breaking news
narkatpally national highway
-
నకిలీ విత్తన ముఠా అరెస్ట్
నార్కట్పల్లి: నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న ఓ ముఠాను నల్లగొండ జిల్లా నార్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.80 కోట్ల విలువైన పది టన్నుల పత్తి విత్తనాలను స్వాదీనం చేసుకున్నారు. బుధవారం నార్కట్పల్లి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లగొండ ఎస్పీ అపూర్వరావు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ హిల్స్ ప్రాంతానికి చెందిన గోరంట్ల నాగార్జున, ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పెద్దకూరపాడు గ్రామానికి చెందిన గడ్డం రవీంద్రబాబు, నంద్యాల జిల్లా గోసపాడు మండలం జిల్లెల గ్రామానికి చెందిన మెరిగె వేణు, అన్నమయ్య జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన నర్సింహ ఓ ముఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం చేస్తున్నారు. ఈ ము ఠా సభ్యులు కర్ణాటకలో పత్తి విత్తనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి గుంటూరు జిల్లా దాచేపల్లి సమీపంలో స్టోరేజీ చేశారు. అక్కడ నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన రైతులకు ఎక్కువ ధరకు అమ్మేందుకు హైదరాబాద్ మీదుగా తరలించాలని నిర్ణయించుకున్నారు. కారులో నాగార్జున, రవీంద్రబాబు, వేణు బయలుదేరారు. పక్కా సమాచారంతో బుధవారం తెల్లవారుజామున నార్కట్పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులు, టాస్్కఫోర్స్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఎర్టిగా కారును తనిఖీ చేయగా రెండు బస్తాల విత్తనాలు బయటపడ్డాయి. వాటిని వ్యవసాయ అధికారులు పరిశీలించి నకిలీ విత్తనాలుగా నిర్ధారించారు. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి మిగతా విత్తనాలను కూడా స్వా«దీనం చేసుకున్నారు. మరో నిందితుడు నర్సింహ పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. నిందితులపై పీడీయాక్ట్ ప్రయోగించనున్నట్టు చెప్పారు. -
పండగకు తీసుకొస్తుండగా..
నార్కట్పల్లి: హాస్టళ్లో ఉంటున్న తన కొడుకును సంక్రాంతి పండగకు తీసుకుని వస్తుండగా తండ్రితో పాటు కొడుకును రోడ్డు ప్రమా దం రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన 65వ నంబర్ జాతీయరహదారిపై నార్కట్పల్లి మండల కేంద్రంలోని కేఎంసీఎల్ కంపెనీ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన జినక మల్లేషం(45) మేస్త్రీ పనిచేసి జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు భార్యలు. వీరిలో చిన్నభార్య మూడునెలల క్రితం మరణించింది. చిన్నభార్యకు ఇద్దరు కొడుకులు. వీరిలో పెద్దకుమారుడు జినక శివ(14) కాగా చిన్నకుమారుడికి పోలియో వచ్చింది. ఇదిలా ఉండగా జినక శివ నల్లగొండలోని ఓ క్రిస్టియన్హాస్టల్లో ఉంటూ ఆరో తరగతి చదువుకుంటున్నాడు. అయి తే మల్లేషం సం క్రాంతి పండగకు తనకొడుకు శివను ద్విచక్రవాహనంపై కూర్చోబెట్టుకుని నల్లగొండను నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యంలో నార్కట్పల్లిలో వీరు రాంగ్రూట్లో రావడంతో ఎదురుగా హైదరాబాద్ నుంచి విజ యవాడకు వెళ్తున్న కారు ఢీకొ ట్టి వెళ్లిపోయింది. దీంతో ఆ సమయంలో వెళ్తున్న మరో కారు కింద వీరిద్దరు పడిపోయి అక్కడికక్కడే మృతిచెం దారు. మొదటిభార్య సాలమ్మ ఫిర్యాదుమేరకు ఎస్ఐ మోతీరామ్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృత దేహాలను పరిశీలించినఎమ్మెల్యే సం ఘటనా స్థలానికి ఎమ్మెల్యే వేముల వీరేశం చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. చౌరస్తా వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ మలికార్జున్రెడ్డి ఉన్నారు.