-
సలార్ హిట్.. పవన్ కల్యాణ్ను ఆడుకుంటున్న నెటిజన్లు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం 'సలార్'. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రివ్యూవర్స్తో పాటు నెటిజన్ల నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తుంది. ప్రభాస్ కటౌట్ను కరెక్ట్గా సలార్ చిత్రంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఉపయోగించుకున్నాడని నెట్టింట వైరల్ అవుతుంది. యాక్షన్ సీన్స్లో ఊర మాస్ లుక్లో ఉన్న ప్రభాస్ను డైరెక్టర్ ఎలివేట్ చేసిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో మొదట ప్రభాస్ ఫ్యాన్ ఒకరు మన డైనోసార్ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చాలా ఉపయోగించుకున్నాడని కామెంట్ చేశారు. తర్వాత తమ అభిమాన హీరోల టాలెంట్ను ఏ డైరెక్టర్ ఇతరుల కంటే తెరపై బాగా ఉపయోగించుకున్నారో చెబుతూ రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తూ వచ్చారు. ఇదే విషయాన్ని టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ కూడా షేర్ చేశారు. అందులో అన్నీ సినిమాటిక్గా ఉన్నా పవన్ కల్యాణ్కు మాత్రం కొంచెం పొలిటికల్ టచ్ ఇచ్చారు. ► ప్రభాస్ను కరెక్ట్గా వాడుకుంది రాజమౌళి, ప్రశాంత్ నీల్ ► జూ ఎన్టీఆర్ను బాగా వెండితెరపై ఉపయోగించుకుంది వీవీ వినాయక్, రాజమౌళి ► అల్లు అర్జున్ను సూపర్గా వాడుకుంది సుకుమార్, త్రివిక్రమ్ ► ప్రిన్స్ మహేష్ బాబును బాగా వాడుకుంది పూరీ జగన్నాథ్ ► పవన్ కల్యాణ్ను ఒక రేంజ్లో వాడుకుంది మాజీ సీఎం చంద్రబాబు ఇలా తమ అభిమాన హీరోల గురించి చెబుతూ ఈ పోస్ట్ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సలార్ రివ్యూలతో పాటు ఈ పోస్ట్ కూడా భారీగా వైరల్ అవుతుంది. పొలిటికల్ గేమ్లో పవన్ కల్యాణ్ను చంద్రబాబు ఒక రేంజ్లో వాడుకుంటున్నాడని అర్థం వచ్చేలా వారు తెలుపుతున్నారు. పవన్ను ఉపయోగించుకోవడంలో చంద్రబాబుతో ఏ డైరెక్టర్ పోటీ పడలేడని వారు తెలుపుతున్నారు. ఈ విషయంలో టీడీపీ, జనసేన అభిమానులు కూడా కరెక్టే కదా..! అని చెప్పడం విశేషం. లోకేష్ వ్యాఖ్యలే నిదర్శనం చినబాబు నారా లోకేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడ 2024లో జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అనే ప్రశ్న ఏదురైంది. ఒక క్షణం ఆలోచించకుండా చంద్రబాబు మాత్రమే సీఎం అని చెప్పారు. పదవి విషయంలో నో షేరింగ్ అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇంత క్లారిటీగా చినబాబు ఉంటే పెదబాబు (పవన్ కల్యాణ్) మాత్రం ఏ క్లారిటీతో ఉన్నాడో ఇప్పటికీ చెప్పలేదు. సీఎం పదవి విషయంలో షేరింగ్ లేకుంటే దేనికోసం టీడీపీతో పవన్ కల్యాణ్ చేతులు కలిపాడు..? సభ ఏదైనా సరే పవన్ కనిపిస్తే చాలు సీఎం.. సీఎం.. అంటూ కేకలు పెడుతున్న ఆయన ఫ్యాన్స్ మానసిక పరిస్థితి ఎలా ఉందో..? ఇప్పటికైనా అర్థం అయిందా..? చంద్రబాబు వాడకం ఏ రేంజ్లో ఉంటుందో..? ఆయన వాడకం మొదలు పెడితే మాటలు ఉండవ్ అంటూ నెటిజన్లు డైలాగ్స్ పేలుస్తున్నారు. 🙏 https://t.co/9Mw5lDJ11C — Ram Gopal Varma (@RGVzoomin) December 22, 2023 -
లోకేశ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది: మంత్రి కన్నబాబు
తూర్పు గోదావరి: నారా లోకేశ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. ముఖ్యమంత్రి పట్ల నోటికి వచ్చిన అనుచిత వ్యాఖ్యలు చేస్తే బయట తిరగలేవని హెచ్చరించారు. చంద్రబాబు పోలవరంను ఏటీఎంలా వాడుకుంటున్నారని 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీయో ఆరోపించారని అన్నారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తారుమారు చేశారని పేర్కొన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ముందుగా కాపర్ డ్యామ్ను నిర్మించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద భజనలకు.. బస్సులకు ఖర్చు చేసిన కోట్లాది రూపాయాలు నిర్వాసితులకు ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించారు. చదవండి: కృష్ణా రివర్ బోర్డ్ సమావేశానికి హాజరు కానున్న ఏపీ అధికారులు పోలవరం నిర్వాసితుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి సీఎం జగన్ అని ఆయన అన్నారు. పోలవరం నిర్వాసితుల్లో ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని ఇటీవల క్యాబినెట్లో తీర్మాణం చేసినట్లు తెలిపారు. 2024లో అధికారంలో వస్తామని తండ్రీ కొడుకులు కలలు కంటున్నారన్నారు. ముందు హైదరాబాద్ వదిలి ఆంధ్రప్రదేశ్కు రావాలంటూ మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. చదవండి: అరకు అందాలకు రాచబాట -
పాత లెక్కలు తేల్చుకోవడానికా? పరామర్శించడానికా?: పేర్ని నాని
తాడేపల్లి: చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్షించారు. చంద్రబాబు పరామర్శకు వచ్చి రాజకీయాలు మాట్లాడారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. పాత లెక్కలు తేల్చుకోవడానికి వచ్చారా? పరామర్శించడానికి వచ్చారా? అంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ను కేంద్రప్రభుత్వమే ప్రశంసించిందని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. 20 నెలల్లోనే 97శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారని అన్నారు. మాట ఇచ్చి తప్పడం చంద్రబాబు నైజం! మాట ఇచ్చి తప్పడం చంద్రబాబు నైజమని మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నీళ్లిస్తే ప్రజలు ఎందుకు ఓడించారో? చెప్పాలన్నారు. చంద్రబాబు గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. బెల్ట్ షాపులకు ప్రాణం పోసింది చంద్రబాబు కాదా? అని అడిగారు. దొంగలకు, వెన్నుపోటుదారులకు చంద్రబాబు ఆదర్శం అని దుయ్యబట్టారు. తెలంగాణ జల అక్రమాలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. -
జగన్ పాదయాత్ర ఓర్వలేకే ..
విజయవాడ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేపట్టనుండటంతో ఓర్వలేకే టీడీపీ మంత్రులు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తే... నీరు, రైతులు, పంటలు, సేద్యం గురించి తెలియదంటూ మంత్రులు పిచ్చిపిచ్చి వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమ తానే తెచ్చానని చెబుతున్న మంత్రి దేవినేని ఉమా పెద్ద బ్రోకర్ అని దుయ్యబట్టారు. ఇరిగేషన్పై తెలంగాణలో ఒక మాదిరిగా, ఆంధ్రాలో మరోలా టీడీపీ మాట్లాడుతోందని విమర్శించారు. నేటి పట్టిసీమ ఆనాడు దివంగత మహానేత వైఎస్ తవ్వించిన కుడి కాలువ వల్లే సాధ్యమైందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. కాంట్రాక్టర్లకు, చంద్రబాబుకు, లోకేష్కు మధ్య మంత్రి దేవినేని ఉమా బ్రోకర్గా పని చేస్తున్నాడని ధ్వజమెత్తారు. పిల్లల్ని అడిగినా చంద్రబాబు 420 అని చెబుతారు.. ఆఖరికి అర్ధరాత్రి మంత్రి పదవి తెచ్చుకున్న బీర్ హెల్త్ డ్రింక్ అని చెప్పే మంత్రి జవహర్ కూడా జగన్ పాదయాత్ర పేరు 420 పెట్టి సినిమా తీయమని చెబుతుండడాన్ని ఆయన ఆక్షేపించారు. రాష్ట్రంలో 420 ఎవరో పిల్లల్ని అడిగినా ఖచ్చింగా చంద్రబాబు–420 అని చెబుతారని ఎద్దేవా చేశారు. రాంగోపాల్వర్మ తీసే సినిమాతో చంద్రబాబుకు, ఆయన మంత్రులకు భయం పట్టుకుందని తెలిపారు. ఎన్టీఆర్ చరిత్ర సినిమాలో విలన్గా 420 చంద్రబాబుని పెట్టి తీయాలని, అప్పుడే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని పేర్కొన్నారు. ఆత్మహత్యలపై చర్యలు తీసుకునే నాథులేరీ..? కార్పొరేట్ కళాశాలల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై చర్యలు తీసుకునే నాథుడే లేడని ఆవేదన చెందారు. రాష్ట్రంలో 10 రోజుల్లో 8 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు చనిపోవడానికి కారణమైన మంత్రి నారాయణను సీఎం చంద్రబాబు రైట్ హ్యాండ్గా పక్కనే కూర్చొబెట్టుకోవడంపై మండిపడ్డారు. -
సీఎం పర్యటన ఖరారు
ఏలూరు (మెట్రో) : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పర్యటన ఖరారైంది. ఈనెల 23న ఆయన జిల్లా పర్యటనకు రానున్నారు. ఆ రోజు ఉదయం 11.50 గంటలకు హెలికాప్టర్ ద్వారా దేవరపల్లి జెడ్పీ హైస్కూల్కు చేరుకుంటారు. అనంతరం దేవరపల్లిలో పోలవరం ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ ప్యాకేజీ-2 పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.45 గంటలకు దేవరపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.10 గంటలకు పెదవేగి మండలం ముండూరు గ్రా మానికి చేరుకుంటారు. జిల్లాలో 500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించినందుకు గుర్తుగా ముం డూరులో ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం గుండేరు పనుల తీరును పరి శీలిస్తారు. అక్కడి నుంచి జానంపేట అక్విడెక్ట్ వరకూ కాలువ నిర్మాణ పనులను పరిశీలి స్తారు. మధ్యాహ్నం 2.50 గంటలకు జానంపేట నుంచి బయలుదేరి దొండపాడులోని వంగూరు బైపాస్ రోడ్డుకు చేరుకుంటారు. 3 గంటల నుంచి 4.50 గంటల వరకూ నీరు-చెట్టు పథకం పై ఏర్పాటు చేసిన వర్క్షాప్లో పాల్గొంటారు. 4.50 గంట లకు వంగూరు బైపాస్ రోడ్డు నుంచి బయలుదేరి 5 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో విజయవాడ వెళతారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
ఆ స్థానానికి ఓటింగ్ తేదీలో మార్పు.. ఆరో దశలో ఎన్నికలు!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement