-
ఉకో మేడం...కంటతడి పెట్టిన ఎమ్మెల్యే రేఖ నాయక్
-
ఖానాపూర్ లో నువ్వా నేనా..
నిర్మల్: ఓ దిక్కు దట్టమైన అడవులు, ఎత్తయిన గుట్టలు, మరో దిక్కు గోదారి పరవళ్లు, కడెం, కవ్వా ల్ అందాలు.. ఎన్ని చీకట్లున్నా వీటన్నింటి మధ్యే బ తుకుతున్న అడవిబిడ్డలు.. ఇలా స్వచ్ఛమైన పచ్చని ప్రకృతి అందాలతో పెనవేసుకున్నట్లుంటుంది ఖా నాపూర్ నియోజకవర్గం. రాష్ట్రంలో స్వల్పంగా ఉన్న ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఇదొకటి. అందుకే ఇక్కడ నేతల మధ్య పోటాపోటీ. మరో ఆరేడు నెలల్లో ఎన్నికలు రానుండటంతో రోజురోజుకూ ఖానా పూర్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ప్రధానంగా అధికార బీఆర్ఎస్ ‘కారు’ ఓవర్ లోడ్ అవుతోంది. ప్రస్తుతం అధికారపార్టీ ఎమ్మెల్యేనే ఉన్నా.. ఆమెకు ఈసారి టికెట్ రాదంటూ అదే పార్టీ నుంచి మరో నలుగురు ఇక్కడ సీటు ఆశిస్తున్నారు. ఎవరికి వారు ఈసారి తామే బీఆర్ఎస్ అభ్యర్థి అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ‘నేను లోకల్– నువ్వు నాన్లోకల్..’ అంటూ సవాల్ విసురుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షం కంటే స్వపక్షంలో ఉన్నవాళ్లే ఒకరి పై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. ఎస్టీ రిజర్వుడ్ కావడంతో.. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం 2,05,751 మంది ఓటర్లు ఉండగా ఇందులో అధికశాతం గిరిజనులే. మండలాల వారీగా ఆదివాసీ, లంబాడాల ప్రాబల్యం ఉంటుంది. ఎన్నికల్లో నేతల గెలుపోటములను నిర్ణయించేది వీరే. రాష్ట్రంలో కేవలం తొమ్మిది ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్లో ఖానాపూర్తో పాటు ఆసిఫాబాద్, బోథ్ ఉన్నాయి. ఇందులో ఖానాపూర్ ప్రత్యేకం. ఈ నియోజకవర్గం మూడు జిల్లాలతో ముడిపడి ఉంది. ఖానాపూర్, కడెం, దస్తురాబాద్, పెంబి మండలాలు నిర్మల్లో, ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాలు ఆదిలాబాద్లో, జన్నారం మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. నాన్ లోకలే.. ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికల సమయంలో ఎక్కువగా చర్చలకు వచ్చే విషయం లోకల్–నాన్లోకల్ గురించే. ఇక్కడ స్థానిక నేతలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన వాళ్లూ వచ్చి పోటీ చేయడం ప్రత్యేకం. తాజాగా ఇదే అంశం స్థానికులైన నాయకులు లేవనెత్తుతున్నారు. ఇక్కడి ప్రజలకు నిస్వార్థంగా సేవచేసేది స్థానికులేనంటూ జనాల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రేఖానాయక్ సైతం జగిత్యాల జిల్లాకు చెందినవారు. ఈసారీ సీటుకోసం పోటీ పడుతున్న అభ్యర్థుల్లో కూడా స్థానికేతర నేతలు ఉ న్నారు. ఇటీవల జోరుగా ప్రజల్లోకి వెళ్తున్న జాన్సన్నాయక్ది కూడా జగిత్యాల జిల్లా మెట్పల్లి. ఉట్నూర్లో సెటిలైన ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్ జనార్దన్ రాథోడ్ది ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం. ఇది ఆసిఫాబాద్ నియోజకవర్గంలోకి వస్తుంది. కొన్ని దఫాలుగా ఖానాపూర్ నియోజకవర్గంలో చాలామంది ఇతర ప్రాంతాలకు చెందిన నేతలే ఎక్కువగా పోటీలో ఉంటున్నారు. ఇందుకు ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడం, నియోజకర్గాలు తక్కువగా ఉండటమే కారణంగా చెబుతున్నారు. నేనంటే నేనే.. ఖానాపూర్ నియోజకవర్గంలో ‘కారు’ స్పీడ్గానే దూసుకుపోతోంది. తొలిసారి 2004 ఎన్నికల్లో అజ్మీరా గోవింద్నాయక్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలిచారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018 ఎన్నికల్లో గులాబీపార్టీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రేఖానాయక్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ గెలుపుపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అదే ఆశతో చాలామంది అభ్యర్థులు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేతో పాటు మిగిలిన నలుగురు కూడా లంబాడ సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ► ప్రస్తుత ఎమ్మెల్యే రేఖానాయక్ రెండుసార్లు గెలిచిన తనకే మూడోసారి సీటు ఇస్తారని చెబుతున్నారు. సీఎం కూడా సిట్టింగ్లకే టికెట్ ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ► హైదరాబాద్ కలెక్టర్గా చేసిన శర్మన్ చౌహాన్ సైతం పార్టీ పెద్దలతో తనకున్న సంబంధా ల మేరకు తనకే టికెట్ ఖాయమంటున్నా రు. ఇప్పటికే నియోజకవర్గంలోని మా రుమూల గ్రామాల్లోకి సైతం వెళ్తూ నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ► రాజ్యసభ ఎంపీ సంతోష్రావు ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ కన్వీనర్గా ఉన్న పూర్ణచందర్నాయక్ సైతం గ్రామగ్రామానికి వెళ్తున్నారు. ఎంపీ అండతో టికెట్ తనకే ఇస్తారన్న ప్రచారం ప్రజల్లో ఉంది. ►ఇటీవల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న జాన్సన్నాయక్ ఎట్టి పరిస్థితుల్లో తానే అభ్యర్థినని చెబుతున్నారు. మంత్రి కేటీఆర్కు దగ్గరి మిత్రుడని, ఆయనకే టికెట్ వస్తుందని తన అనుచరులు చెబుతున్నారు. ► ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్ జనార్దన్ రాథోడ్ సైతం తనకున్న సంబంధాల మేరకు టికెట్ తనకే ఇస్తారన్న నమ్మకాన్ని వెల్లడిస్తున్నారు. -
జన్నారంలో చెరువు భూముల ఆక్రమణలపై స్పందించిన ఎమ్మెల్యే రేఖ నాయక్
-
దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణాలో..
ఉట్నూర్(ఖానాపూర్): దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నారని కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అమీర్ అన్నారు. కేసీఆర్ చేపట్టిన పథకాలను భారతదేశ వ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు చేపట్టిన కేసీఆర్ సేవాదళ్ యాత్ర ఆదివారం రాత్రి ఉ ట్నూర్ చేరుకుంది. యాత్ర సభ్యులు రాత్రి ఉట్నూర్లోని కేబీ ప్రాంగణంలో గల విశ్రాంతి భవన్లో బస చేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో మహ్మద్ అమీర్ మాట్లాడుతూ కేసీఆర్ పథకాలను భారతదేశ వ్యాప్తంగా విస్తృత పరిచేందుకు తాము యాత్ర చేపట్టామని తెలిపారు. దేశంలోని 11 రాష్ట్రాల్లో 5 వేల కిలోమీటర్లు యాత్ర పూర్తి చేశామని ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్నామని తెలిపారు. జూన్ 16న తమ యాత్ర ముగుస్తుందన్నారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్పై అభిమానంతో సైకిల్పై యాత్ర ప్రారంభించి రాష్ట్రాలు తిరగడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొంత ఆశారెడ్డి, సేవాదల్, రాజు, శ్రావణ్కుమార్, శకిల్, పాషాభాయ్, భాను, భరత్ కనకరాజు, పంద్ర జైవంత్రావు, అజీమొద్దిన్, ధరణిరాజేశ్, షౌకత్ అలీ, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఇంద్రవెల్లి(ఖానాపూర్) : గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నా రు. ఇంద్రవెల్లి మండలం గిన్నేర గ్రామపంచాయతీ పరిధిలోని తుమ్మగూడ, సమాక గ్రామాలకు పంచాయతీరాజ్ శాఖ రూ.1 కోటి 4లక్షల, 50 వేలతో బీటీ రోడ్డు మంజూరు చేయగా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్తో కలిసి శుక్రవారం రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రోడ్డు విస్తీర్ణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుం దన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియో గం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దేవ్పూజే సంగీత, ఏఎంసీ చైర్మన్ రాథోడ్ వసంత్రావ్, సర్పంచ్లు కనక తుల్సిరాం, పెందో ర్ దేవుబాయి, ఆడే విజయ, ఎంపీటీసీ కనక హనుమంత్రావ్, టీఆర్ఎస్ నాయకులు తుమ్మగూడ, సమాక గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట ఉట్నూర్రూరల్(ఖానాపూర్) : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కామాయిపేట్, లక్కారం గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. గ్రామానికి వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలను ఆదివాసీలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని రోడ్లు మంజూరు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఖానా పూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీపీ విమల, జెడ్పీటీసీ జగ్జీవన్, సర్పంచ్ మర్సుకోల తిరుపతి, వైస్ ఎంపీపీ సలీమొద్దీన్, ఎంపీటీసీ రమేశ్, మండల అధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్, నాయకులు «అజీమొద్దీన్, ధరణిరాజేశ్, తదితరులు పాల్గొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement