breaking news
MLA Pratap Apparao
-
టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో భారీ చేరికలు
సాక్షి, చాట్రాయి(నూజివీడు): ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. మండలంలోని చీపురుగూడెం, నరసింహారావుపాలెం గ్రామాల్లో శుక్రవారం టీడీపీ కార్యకర్తలు భారీగా వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ పాలనపై ప్రజలు విసుగు చెంది జగన్మోహనరెడ్డిపై ఉన్న నమ్మకంతో వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో పార్టీ ఓడిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టాడని ఎద్దేవా చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహనరెడ్డిని ఒక్కసారి ముఖ్యమంత్రిని చేసేందుకు కార్యకర్తలు, నాయకులు కష్టపడాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ టీడీపీ నాయకుడు ఓబిళ్లనేని వెంకటేశ్వరావుతో పాటు 20 టీడీపీ కుటుంబాల వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో చాట్రాయి జెడ్పీటీసీ సభ్యుడు దేశిరెడ్డి రాఘవరెడ్డి, జిల్లా వైఎస్సార్ సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు చెలికాని బాబ్జీ, మండల అధ్యక్షుడు మిద్దె బాలకృష్ణ, పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు చింతగుంట్ల వెంకటేశ్వరావు, చీపురుగూడెం ఎంపీటీసీ మేకల చందూ తదితరులు పాల్గొన్నారు. నరసింహారావుపాలెం: మండలంలోని నరసింహారావుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు సమక్షంలో గౌరసాని వెంకటరెడ్డితోపాటు 21 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో చాట్రాయి జెడ్పీటీసీ సభ్యుడు దేశిరెడ్డి రాఘవరెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ పుచ్చకాయల లక్ష్మీకాంతమ్మ, మండల పార్టీ నాయకులు దామెర ప్రసాద్బాబు, వైఎస్సార్ సీపీ సేవాదళ్ మండల కార్యదర్శి బి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. -
కబడ్డీ విజేత విజయవాడ జట్టు
కొత్త ఈదర (ఆగిరిపల్లి): మండల పరిధిలోని కొత్త ఈదరలో ఈ నెల 26 నుంచి జరుగుతున్న జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో విజయవాడ స్టేడియం జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం రాత్రి ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా వైఎస్సార్ సీపీ నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీని మరింతగా ఆదరించాలని, దీని ద్వారా ఆణిముత్యాల్లాంటి ఆటగాళ్లు తయారవుతారని అన్నారు. ఫైనల్స్లో కొత్త ఈదర జట్టుపై విజయవాడ స్టేడియం జట్టుకు జయకేతనం ఎగురవేసింది. విజయవాడ జట్టుకు ప్రథమ బహుమతిగా రూ.10,116లు, ద్వితీయ బహుమతిని కొత్త ఈదర జట్టు రూ.5,116లు, నూజివీడు ట్రిపుల్ ఐటీ జట్టు (తృతీయ) రూ.3,116లు ఎమ్మెల్యే బహూకరించారు. -
'నిలువెత్తు డబ్బు పోసినా టీడీపీలో చేరను'
విజయవాడ: తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఖండించారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిలువెత్తు డబ్బు పోసినా తాను టీడీపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నాడంటూ అధికార టీడీపీ తనపై దుష్రచారం చేస్తోందంటూ కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మండిపడ్డారు. తాను చివరివరకూ వైఎస్ఆర్ సీపీ లోనే కొనసాగుతానని పేర్కొన్నారు. టీడీపీ మునిగిపోయే పడవ అని, ఆ పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని ప్రతాప్ అప్పారావు వివరించారు.