-
విలక్షణమైన రెస్టారెంట్: అక్కడ ఆర్డర్ తారుమారైనా పొరపాటు కాదు!
ఎన్నో రెస్టారెంట్లు చూసుంటారు. కానీ ఇలాంటి రెస్టారెంట్ చూసే అవకాశమే లేదు. ఎందుకంటే? ఎక్కడైన కస్టమర్ ఆర్డర్ చేసింది కాకుండా మరోకటి ఆర్డర్ తీసుకువస్తే..జరిగే రచ్చ అంతా ఇంత కాదు. ఏకంగా రెస్టారెంట్నే క్లోజ్ అయ్యేలా గొడవ చేస్తారు కస్టమర్లు. కానీ ఇక్కడ ఆర్డర్ తప్పుగా తెచ్చిన సద్దుకుపోతారు కస్టమర్లు. పైగా రెస్టారెంట్కి జనాలు రావడం తగ్గించరు కూడా. అదేంటీ? అనిపిస్తుంది కదూ!. ఐతే ఆ రెస్టారెంట్ ఏంటో ఎక్కడ ఉందో చదివేయండి మరీ..! ఇదో విలక్షణమైన రెస్టారెంట్. జపాన్ రాజధాని టోక్యో పశ్చిమ శివార్లలో ఉందిది. దీని పేరు ‘రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్’. ఇక్కడ మీరు సుషి ఆర్డరిస్తే, మీ టేబుల్ మీదకు నూడుల్స్ రావచ్చు. నూడుల్స్ ఆర్డరిస్తే, సూప్ రావచ్చు. మీరు ఆర్డర్ ఇచ్చేది ఒకటైతే, మీ టేబుల్ మీదకు వచ్చేది మరొకటి కావడం ఈ రెస్టారెంట్లో సర్వసాధారణం. ఒక్కోసారి మీరు ఆర్డరిచ్చిన ఐటెమ్స్ ఎంతసేపటికీ మీ టేబుల్ మీదకు రాకపోవచ్చు. ఏదైనా ఒక రెస్టారెంట్లో ఇంత అవకతవకగా సర్వీస్ ఉన్నట్లయితే, కస్టమర్లు గొడవలకు దిగుతారు. పద్ధతి మార్చుకోకపోతే, రెస్టారెంట్కు రావడమే మానేస్తారు. చివరకు రెస్టారెంట్ మూతబడే పరిస్థితి వస్తుంది. అయితే, ‘రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్’ మాత్రం విజయవంతంగా నడుస్తోంది. ఆర్డర్లు తారుమారైనా ఇక్కడకు వచ్చే కస్టమర్లు ఏమాత్రం పట్టించుకోరు. టేబుల్ మీదకు వచ్చిన దాంతోనే సర్దుకుపోతారు. ఒకటి ఆర్డరిస్టే, మరొకటి తీసుకొచ్చినందుకు సర్వర్లపై విరుచుకుపడరు. వారిని సానుకూలంగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే, ఇక్కడ సర్వర్లుగా పనిచేసేవారు వయోవృద్ధులు, పైగా డెమెన్షియా బాధితులు. అందువల్ల వారు ఆర్డర్లను తారుమారు చేసినా, కస్టమర్లెవరూ వారి మీద కోపగించుకోరు. డెమెన్షియా వల్ల మతిమరుపుతో బాధపడే వయోవృద్ధులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే షిరో ఒగుని అనే వ్యాపారవేత్త ఈ రెస్టారెంట్ను ప్రారంభించాడు. (చదవండి: మహిళ కళ్లల్లో 60కి పైగా సజీవ పురుగులు!) -
క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ. 9 వేల కోట్లు..ఏం చేశాడంటే?
తమిళనాడులోని పళనికి చెందిన రాజ్కుమార్ అనే డ్రైవర్కి ఉన్నట్టుండి తన ఖాతాలో భారీ మొత్తంలో నగదు డిపాజిట్ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 వేల కోట్ల జమ కావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తరువాత విషయం తెలుసి సంబరాలు చేసుకునేలోపే జరిగిన పరిణామానికి ఉసూరు మన్నాడు. సెప్టెంబరు 9న చెన్నైలోని క్యాబ్ డ్రైవర్ రాజ్కుమార్ ఎదురైనా అనుభవం ఇది. ఇంతకీ ఏమైంది అంటే.. రాజ్కుమార్ చెన్నైలోని కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకు నుంచి తన ఖాతాలో రూ.9,000 కోట్లు డిపాజిట్ కావడంతో ముందు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అప్పటిదాకా అతని ఖాతాలో రూ.105 మాత్రమే ఉంది. ఆ తరువాత ఇదేదో స్కాం అనుకున్నాడు. అక్కడితో ఆగలేదు.. ఒకసారి టెస్ట్ చేస్తే పోలా అనుకున్నాడు. వెంటనే తన స్నేహితుడికి రూ.21 వేలు బదిలీ చేశాడు. లావాదేవీపూర్తియిందా లేదా ఆసక్తిగా ఎదురు చూశాడు. ఆశ్చర్యంగా.. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో ఇది నిజమేనని నిర్ధారించుకున్నాక ఎగిరి గంతేశాడు. కానీ అరగంటలోనే ఉత్సాహం అంతా ఆవిరైపోయింది. మరుసటి రోజు ఉదయం తూత్తుకుడి బ్యాంకు అధికారులు రంగంలోకి దిగారు. పొరపాటున రూ.9 వేల కోట్లు బదిలీ అయ్యిందని ఫ్రెండ్కి ట్రాన్సఫర్ చేసిన సొమ్ము మొత్తం అప్పగించాల్సిందేని డిమాండ్ చేశారు. దీంతో కంగు తిన్న రాజ్కుమార్ లాయర్లతో బ్యాంకు అధికారులతో సంప్రదింపులు చేశాడు. చివరికి రూ. 21 వేలను వాహనరుణంగా సర్దుబాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. -
సెల్ఫీ ఆనందంలో సెల్నే విసిరి ఆ తర్వాత...: వీడియో వైరల్
స్మార్ట్ఫోన్లు ప్రజల జీవితంలో ఎంత పెద్ధ స్థానాన్ని ఆక్రమించాయో చెప్పనవసరం లేదు. ఫోన్ లేకపోతే మనుగడే లేదన్నంతగా వాటిపై ఆధారపడిపోయాడు. అంతేగాదు ఆ స్మార్ట్ఫోన్లతో ఏ చిన్న ఆనందాన్నైనా సెల్ఫీ అంటూ....వీడియోల్లో బంధించి ముచ్చటపడిపోతుంటాం. ఇటీవల కాలంలో ఈ సెల్ఫీల క్రేజ్ జనాల్లో మాములుగా లేదు. ఎంతలా ఉందంటే ప్రాణాంతకమైన ప్రదేశాల్లో సైతం సెల్ఫీలు దిగి ప్రాణాలు పైకి తెచ్చుకుంటున్నావారు కొందరైతే. మరికొందరూ సెల్ఫీ ఆనందంలో ఏం చేస్తున్నారో మరిచిపోయి విలువైన వస్తువులను పొగొట్టుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి కూడా సెల్ఫీ తీసకుంటూ ఆ ఆనందంలో ఫోన్ని విసిరేసి...అబ్బా! అంటూ తలపట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే...ఒక వ్యక్తి సరదాగా సముద్రంలో బోట్తో షికారు కొడుతుంటాడు. అతను బోట్లో నుంచుని ఒక చేతితో చేపను పట్టుకుని సెల్పీలు తీసుకుంటాడు. రకరకాల యాంగిల్స్లో.. వివిధ ఫోజులలో ఫోటోలు తీసుకున్నాడు. ఆ సెల్పీ ఆనందం అయిపోగానే చేపను పడవేయబోయి పొరపాటున ఫోన్ని సముద్రంలో విసిరేస్తాడు. దీంతో పాపం ఆ వ్యక్తి ఫోన్ని ఎలాగైనా పట్టుకోవాలని బోట్ వద్దకు వచ్చి వంగి తెగ ప్రయత్నిస్తాడు కూడా. కానీ దురదృష్టం అప్పటికే జరగాల్సినదంతా జరిగిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగవైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి 😂 pic.twitter.com/i9aFrSYeRg — Tansu YEĞEN (@TansuYegen) September 11, 2022 (చదవండి: శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన విచిత్ర జీవి: వీడియో వైరల్) -
రిషి సునాక్ ‘తప్పు’: ఆడేసుకుంటున్న నెటిజన్లు, ఏం జరిగిందంటే
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో దూసుకుపోతున్న బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ సోషల్ మీడియాలోసంచలనంగా మారారు. అయితే రాజకీయంగా తన ప్రతిభను చాటుకోబోతున్నందుకు కాదు.. సోషల్ మీడియా పోస్ట్లో తప్పులో కాలేసిందుకు. అయితే ఈ సెటైర్లకు, విమర్శలకు కూల్గా సమాధానమిచ్చారు. ప్రధాని పదవికి సంబంధించిన పోటీ రెండో రౌండ్లో అత్యధిక ఓట్లను గెలుచుకుని టాప్లో ఉన్న రిషి తన ప్రచార బ్యానర్లో స్పెల్లింగ్ తప్పుగా రాయడంతో నెటిజన్లు సునాక్ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. తన మొదటి టెలివిజన్ డిబేట్ సందర్భంగా నిర్వహించిన ప్రచారంలో ట్విటర్లో ‘క్యాంపెయిన్’ స్పెల్లింగ్ను తప్పుగా రాయడంతో ఆయన నెటిజన్లుకు దొరికియారు. పలు కామెంట్లు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా గూగుల్ ట్రెండింగ్లో కూడా సునాక్ పేరు నిలిచింది. అవ్వడానికి బిలియనీర్..కానీ క్యాంపెయిన్ అనే పదాన్ని సరిగ్గా రాయలేకపోయారని ఒక యూజర్ కమెంట్ చేశారు. మరోవైపు వీటిపి రిషి సునాక్ స్పందించారు..తన స్లోగన్ రడీ ఫర్ రిషిలా...రడీ ఫర్స్పెల్ చెక్ అంటూ హుందాగా సమాధామిచ్చారు. కాగా బ్రిటన్ ప్రధాని పదవి కోసం రిషి సునాక్, పెన్నీ మార్డౌట్తో సహా మరో ఐదుగురి మధ్య పోటీ సాగుతోంది. మొదటి రౌండ్లో నాలుగింట ఒక వంతు ఓట్లను సాధించి, రెండో రౌండ్లో మూడు అంకెలకు పైగా సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. ప్రచారంలో భాగంగా మిగిలిన ప్రత్యర్థులు వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్, విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్, మాజీ మంత్రి కెమీ బాడెనోచ్, టోరీ బ్యాక్ బెంచర్ టామ్ తుగెన్ధాట్లతో వారాంతపు టెలివిజన్ డిబేట్లలో పాల్గొననున్నారు రిషి. Slick https://t.co/OXNLfiwNul — Guido Fawkes (@GuidoFawkes) July 15, 2022 When people ask me why I'm supporting @RishiSunak for leader, here's why: Not only does he have the right skills and experience to be our next PM, but the right character, too. He's a thoroughly decent person - as this clip from last night's debate shows...#Ready4Rishi pic.twitter.com/oP8F15tJOg — Nigel Huddleston MP (@HuddlestonNigel) July 16, 2022 -
పోర్న్ వీడియో? ట్విటర్ తప్పులో కాలు
సాక్షి, న్యూఢిల్లీ : మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విటర్ తప్పులో కాలేసింది. ఐఫోన్ 12 మినీ వీడియోను అప్లోడ్ చేసినందుకు ఒక యూజర్కు భారీ షాక్ ఇచ్చింది. ఆ వీడియోను పోర్న్ వీడియోగా పొరబడి అతని అకౌంట్ని బ్లాక్ చేసింది. దీంతో సదరు లబోదిబోమన్నాడు. వివరాల్లో వెళ్లితే నిఖిల్ చావ్లా అనే యూజర్, ఐఫోన్ 12 మినీ వీడియో టీజర్ను తన ట్విటర్ ఖాతాలో అప్లోడ్ చేశాడు. అంతే పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల తర్వాత అతని ఖాతాను ట్విటర్ బ్లాక్ చేసింది. అసభ్యకరమైన కంటెంట్ ఉందంటూ ఈ వీడియోను తొలగించింది. ఆ తరువాత ఖాతాను అన్లాక్ చేసి, అభ్యంతరమైన, అశ్లీల కంటెంట్ను తొలగించడమో,రిపోర్ట్ చేయడమో చేయాలని ఆదేశించింది. దీనికి సమాధానం ఇచ్చేలోపే తన అకౌంట్ను మరో 24 గంటలు బ్లాక్ చేశారని వాపోయాడు. చివరకు ట్విటర్ పాలసీ టీంను సంప్రదించి తన ఖాతా అన్లాక్ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే యూజర్ పోస్ట్ చేసిన ఐఫోన్ 12 మినీ టీజర్ వీడియో కంటెంట్ను ట్విటర్ అల్గోరిథం అభ్యంతరకరమైందిగా గుర్తించిందని ట్విటర్ తెలిపింది. ఇలాంటి వాటిని నిరోధించేందుకు వినియోగదారులు సేఫ్టీ సెటింగ్స్లో మీడియా సెన్సెటివ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలని సూచించింది. Working with the @Twitter @Policy team to get our founder @nikhilchawla’s account back with the iPhone 12 Mini video tweet that was erroneously marked as intimate content. We have filed an appeal! @TwitterIndia @manishm @keyamadhvani @jack Thank you all for your support! pic.twitter.com/ZgKiJtOzmL — The Unbiased Blog (@TheUnbiasedBlog) January 5, 2021
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కొలతల ప్రకారం‘ఉపాధి’ పనులు చేపట్టాలి
మూడో దశలో 63.53% పోలింగ్
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
నల్లమలలోగుప్తనిధుల వేట
10న ప్రధాని మోదీ రాక
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
లక్ష్యం.. బహుదూరం
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
జూనియర్ ఏషియన్విజేతకు సన్మానం
ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement