breaking news
Mission telangana-2019
-
మిషన్ తెలంగాణ
-
10 కోట్ల మందిని బీజేపీలో చేర్చించటమే లక్ష్యం
-
10 కోట్ల మందిని బీజేపీలో చేర్పించటమే లక్ష్యం
హైదరాబాద్ : నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ప్రజల్లో విశ్వాసం పెరిగిందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 10 కోట్ల మందిని బీజేపీలో చేర్పించటమే లక్ష్యమన్నారు. తెలంగాణలో 35 లక్షల సభ్యత్వాలను చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. ఆన్లైన్లో పార్టీ సభ్యత్వానికి మంచి స్పందన వస్తోందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 22 శాతం ఓట్లు వచ్చాయన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించే దిశగా పురోగమించాలని ఆయన సూచించారు. యూపీఏ హయాంలో ధరలు విపరీతంగా పెరిగాయని... బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ ఏడు నెలల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ చిత్తశుద్ధితో అమలు చేస్తోందన్నారు. మేకిన్ ఇండియాకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. -
తెలంగాణ కోర్ కమిటీపై అమిత్ షా ఆగ్రహం!
హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 'మిషన్ తెలంగాణ-2019' లో భాగంగా గురువారం తెలంగాణ కోర్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన టీ.కోర్ కమిటీపై సీరియస్ అయినట్లు సమాచారం. తెలంగాణలో అవకాశాలు ఉన్నా ఎందుకు పార్టీ పుంజుకోవటం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సభ్యత్వ నమోదును ఎందుకు పూర్తి చేయలేకపోయారని, తెలంగాణ కోసం పోరాడినా ఎందుకు ఫలితాలు సాధించలేకపోయారని అమిత్ షా కోర్ కమిటీని ప్రశ్నించినట్లు సమాచారం. తెలంగాణలో ఎదగడానికి అవకాశం ఉన్నా నాయకత్వం సరిగా పని చేయటం లేదని, పార్టీ కేడర్ను వాడుకోవడంలో నాయకత్వం విఫలమైందని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కనీసం 30 లక్షల మంది సభ్యత్వం నమోదు చేయాలని, ఎమ్మెల్సీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని అమిత్ షా ఈ భేటీలో సూచించినట్లు సమాచారం. -
నేడు బీజేపీ కీలక సమావేశాలు
-
బీజేపీ మిషన్ తెలంగాణ @ 2019!
* నేడు బీజేపీ కీలక సమావేశాలు * పనితీరే ప్రామాణికంగా నిర్ణయాలు * హైదరాబాద్ చేరుకున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ తెలంగాణ-2019’ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ కీలక సమావేశాలు హైదరాబాద్లో గురువారం జరగనున్నాయి. సభ్యత్వం, విస్తరణ లక్ష్యంగా జరిగే సమీక్షా సమావేశాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహిస్తున్నారు. గతేడాది ఆగస్ట్ పర్యటన సందర్భంగా రాష్ట్ర పార్టీకి చేసిన దిశానిర్దేశం, అప్పటి నుంచి ఇప్పటిదాకా పురోగతి, భవిష్యత్లో అనుసరించాల్సిన వ్యూహం పై సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో పాల్గొనడానికి అమిత్ షా బుధవారం రాత్రికే హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణలో విస్తరణకు సానుకూలం తెలంగాణలో పార్టీ విస్తరణకు సానుకూల పరిస్థితులు ఉన్నట్లు బీజేపీ జాతీయ నాయకత్వం అంచనాకు వచ్చింది. పార్టీ బలహీనంగా ఉన్న దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బలాన్ని పెంచుకోవడానికి తెలంగాణ రాష్ట్రమే అనుకూలంగా ఉన్నట్టుగా సర్వేల్లో తేలింది. దీంతో ముందుగా రాష్ట్ర పార్టీ సీనియర్లలో ఉన్న అంతరాలను, కొత్తవారిని పార్టీలో ఎదగకుండా అడ్డుగా ఉన్న సీనియారిటీ సమస్య, గ్రామ స్థాయి నిర్మాణంలో వైఫల్యం వంటి వాటిపై మరోసారి సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై సూచనలు చేయనున్నారు. తెలంగాణలో ఇప్పుడు పార్టీకి 4లక్షల సభ్యత్వం ఉందని, ఆ సంఖ్యను 20 లక్షలకు పెంచాలని లక్ష్యాన్ని పెట్టుకోవాలని పార్టీకి అమిత్ షా నిర్ధేశించగా డిసెంబర్ 24 నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కూడా మైనారిటీలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందడానికి ప్రయత్నాలు చేస్తోందని, దానికి దీటుగా ప్రతి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకునే దిశలో పార్టీ శ్రేణులను అమిత్షా సమాయత్తం చేయనున్నారు. హైదరాబాద్కు చేరుకున్న అమిత్షా అమిత్షా బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, సీనియర్ నేతలు నల్లు ఇంద్రసేనా రెడ్డి, కె.లక్ష్మణ్, నాగం జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రా రెడ్డి, రాజాసింగ్, ఎన్వీఎస్ ప్రభాకర్, పార్టీ నేతలు సంకినేని వెంకటేశ్వర్రావు తదితరులు స్వాగతం పలికారు. గురువారం ఉదయం 8 గంటలకు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో అమిత్ షా భేటీ కానున్నారు. 11 గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడి తర్వాత రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల దాకా ఈ సమావేశం జరుగుతుంది. రాత్రికి అమిత్ షా ఏపీకి వెళ్తారు.