breaking news
Minister Etela Rajender
-
ఎన్ఆర్ఐలు సహకరించాలి: సిడ్నీలో ఈటల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు సహకరించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. అస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన మంత్రి, సోమవారం సిడ్నీలో ఆస్ట్రేలియన్ తెలంగాణ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెట్టుబడులకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందన్నా రు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రపంచంలోనే ఉత్తమమైన విధానాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు, అన్ని మౌలిక వసతులున్నందున హైదరాబాద్ విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. -
గుట్టలను పోగొట్టుకుంటే పుట్టుక ఉండదు
సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మంత్రి ఈటల సర్ధార్ సర్వాయి పాపన్న గొప్ప ఉద్యమకారుడు సైదాపూర్రూరల్ : గుట్టలను పోగొట్టుకుంటే భవిష్యత్తులో పుట్టుకనేదే ఉండదని, గుట్టలున్న ప్రతి ప్రాంతాల్లో గుడికట్టి గుట్టలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలోని కొమ్ముగుట్టపై సర్దార్ సర్వాయి పాపన్న 365వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అథితిగా హాజరైన ఈటల రాజేందర్ కొమ్ముగుట్టపై పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆనాటి దోపిడి, రాచరిక దుర్మార్గాలకు అరికట్టేందుకు సొంత సైన్యాన్ని ఏర్పర్చుకుని పోరాడిన గొప్ప ఉద్యమకారుడని పాపన్నను కొనియాడారు. కళ్లముందే అన్యాయం జరుగుతుంటే 17వ శతాబ్దంలో తెలంగాణలోని గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన మహావీరుడు పాపన్న అన్నారు. కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో అనేక కోటలను జయించిన వీరుడని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్, మాజీ ఎమ్మెల్సీలు నాగపురి రాజలింగం గౌడ్, నారదాసు లక్ష్మణ్రావు, గౌడసంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బురుగు రామస్వామిగౌడ్, గౌరవ సలహాదారు పెద్దంపేట శంకర్, రాష్ట్ర అధ్యక్షుడు వీరగోని పెంటయ్య, రాష్ట్ర సెక్రటరీ జనరల్ కలర్ సత్తన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తుల సోమయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుండ్రాతి శారద, ఎంపీపీ ముత్యాల ప్రియారెడ్డి, జెడ్పీటీసీ బిల్ల వెంకట్రెడ్డి, సర్పంచ్ బత్తుల సరోజన, ఎంపీటీసీ జగురాణీ బాయి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చందా శ్రీనివాస్, బీఎంసీ నాయకులు జంపయ్య, శ్రీనివాస్, ప్రవీణ్, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
అందరికీ కార్డులు మా బాధ్యత
- గులాబీ కార్డుపై రేషన్ బియ్యం - కార్డుల జారీ నిరంతర ప్రక్రియ - కేసీఆర్ విజన్ ఉన్న నేత - ఆర్థిక మంత్రి ఈటెల సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : చివరి కుటుంబానికీ ఆహార భద్రత కార్డు అందించేవరకు ప్రభుత్వం విశ్రమించదని పౌరసరఫరాలు, ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఆహారభద్రత కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, దీనిపై కొన్ని శక్తులు సృష్టిస్తున్న వదంతులు నమ్మవద్దని సూచించారు. శనివారం ‘మిషన్ కాకతీయ’పై రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న ఈటెల ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న నేత అని, విప్లవాత్మక నిర్ణయాలతో పేదల పక్షపాతిగా చరిత్రకెక్కుతున్నారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణకు పునాదిరాయిగా సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికంగా మారిందని అన్నారు. కుటుంబంలో ప్రతి సభ్యుడికి 6 కేజీల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించామని, గతంలో తెల్ల రేషన్కార్డుపై సరఫరాచేసే సరుకులను ఇకపై గులాబీ కార్డుపై పంపిణీ చేస్తామని, పింక్ కార్డుపై ఇచ్చేవాటిని తెల్లకార్డుపై ఇవ్వనున్నట్లు ఈటెల స్పష్టం చేశారు. రేషన్ కార్డులను తొలగించే ప్రసక్తేలేదని, అర్హులైనవారందరికీ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. ముక్కిన బియ్యంతో వండే ఆహారాన్ని తినలేక ఆకలితో అలమటించే హాస్టల్ విద్యార్థులకు ఇకపై సన్న బియ్యంతో భోజనాన్ని వడ్డించనున్నట్లు తెలిపారు. అలాగే స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలోనూ సన్న బియ్యాన్ని వినియోగించనున్నట్లు ఈటెల తెలిపారు. పెంచిన రేషన్ కోటా, విద్యార్థులకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమానికి కొత్త ఏడాదిన శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నిధుల కొరత రానివ్వకుండా కొత్త పథకాలకు రూపకల్పన చేస్తోందని ఆయన పేర్కొన్నారు. మిషన్ కాకతీయకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, చెరువుల పునరుద్ధరణకు ఆర్థిక సమస్యలేదని అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. చెరువు బాగుంటే ఊరుబాగుంటుందని, ఆంధ్రపాలకుల నిర్లక్ష్యంతోనే జల వనరులు కనుమరుగయ్యాయని అన్నారు. వచ్చే ఐదేళ్లలో 46వేల చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటి కోసం రూ.25వేల కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపారు. -
రేపటి నుంచే ధాన్యం కొనుగోలు
ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలకు పూనుకుంది. ఆరుగాలం శ్రమించిన రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని జిల్లా కలెక్టర్ను, ఇతర ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శనివారం సచివాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 286 కేంద్రాల ఏర్పాటు * రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు * పర్యవేక్షణ కోసం అధికారుల నియామకం * గోదాములను సిద్ధం చేసిన పౌరసరఫరాల శాఖ * రైతులను వ్యాపారులు ఇబ్బందులు పెట్టవద్దు * ‘జీరో’ దందాకు పాల్పడితే లెసైన్సులు రద్దు * మార్గదర్శకాలు జారీ చేసిన కలెక్టర్ రొనాల్డ్ రోస్ * మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో సోమవారం నుంచి ఖరీఫ్ ధా న్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మిల్లర్లు, వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారమే ధాన్యా న్ని కొనుగోలు చేయాలని మంత్రి ఈటెల పేర్కొన్నారు. కనీస మద్దతు ధర ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. నిబంధనలను విస్మరించి ‘జీరో’ దందాకు పాల్పడే వ్యాపారులు, వారికి సహకరించే వ్యాపారుల లెసైన్సులు రద్దు చేస్తామన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా, కొనుగోలు కేంద్రాలలో నే ధాన్యం అమ్మేలా తగు ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇప్పటికే ఇందుకోసం చర్యలు తీసకున్న కలెక్టర్ రోనాల్డ్రోస్ ఈనెల 20న అన్ని ప్రాం తాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మరోమారు అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. కోనుగోలు కేంద్రాలలో వసతులు ఐకేపీ, పీఏసీఎస్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు 286 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి శనివారం బాన్సువాడలో కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించగా, తక్కిన 285 కేంద్రాలను సోమవారం ప్రారంభించనున్నారు. గతంలో రైతులు ధాన్యం తీసుకుని వచ్చి రెండు మూడు రోజుల వరకు వేచి ఉండాల్సి వచ్చేది. ఈసారి అలా జరుగకుండా సకాలంలో కొనుగోలు, డబ్బుల చెల్లింపు సాగేలా ‘ఆన్లైన్’ విధానాన్ని ప్రవేశపెట్ట బోతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మార్కెటింగ్ శాఖకు రూ.54 లక్షలు కేటాయించింది. వీటిని టార్పాలిన్లు, తేమ యంత్రాల కొనుగోలు, కొనుగోలు కేంద్రాలలో కనీస వసతుల కల్పన కోసం ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాది రెండో పంటకు ఆస్కారం లేనందున, రైతుల అవసరాలకు 30శాతం పోను ప్రజాపంపిణీ వ్యవస్థకు సరిపోయే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఇదివరకే మిల్లర్లతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ రైతులకు ఇబ్బందులు కలగకుండా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సూచించారు. ఐకేపీ, పీఏసీఎస్ సభ్యులకు శిక్షణ ఈ సీజన్లో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణ కోసం డిప్యూటీ తహశీల్దార్లను నియమిం చారు. సంబంధిత ఏరియాలకు చెందిన రెవెన్యూ అధికారులను పరిశీలకులుగా నియమించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వచేసేందుకు నిజామాబాద్, ఆర్మూరు, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలలో ఉన్న సీడబ్ల్యూసీ, ఎస్డబ్ల్యూసీ గోదాములు,మిల్లులలో ఏర్పాట్లు చేశారు. రైతులకు ప్రభుత్వ మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ సభ్యులకు కొనుగోలుపై శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. తేమ లేకుండా ధాన్యాన్ని కొనుగోలుకు తర లించేలా కరప్రతాలు ముద్రించి పంపిణీ చేశారు. నిబంధనలు, దళారులతో రైతులకు ప్రతిబంధకాలు కాకుండా చూడాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. వరికి మద్దతు ధర పెంపు మోర్తాడ్ : ఖరీఫ్ సీజనులో సాగు చేసిన వరి ధా న్యానికి తెలంగాణ సర్కారు మద్దతు ధరను కొద్ది గా పెంచింది. ‘ఎ’ గ్రేడ్ ధాన్యానికి గతంలో క్విం టాలుకు రూ.1,345 ఉండగా ఇప్పుడు రూ. 55 పెంచి రూ.1,400 ధర నిర్ణయించారు. ‘బి’ గ్రేడ్ ధాన్యానికి రూ.1,310 ఉండగా రూ. 50 పెంచి రూ.1,360 ధర నిర్ణయించారు. వరి సాగుకు ఖ ర్చులు భారీగానే పెరిగాయని, అందుకు అనుగుణంగా మద్దతు ధరను పెంచకపోవడంతో ఆశించినంతగా గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నా రు. మిల్లర్లు ప్రభుత్వానికి లెవీ పెట్టడానికి దొడ్డు రకం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు. సన్న రకాలను కొనుగోలు చేసే అవకాశం తక్కువ. ఒకవేళ కొనుగోలు కొనుగోలు చేసినా ‘బి’ గ్రేడ్ ధరనే చెల్లిస్తారు. ప్రభుత్వం సన్న రకాలను కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుని, మద్దతు ధరను ఎక్కువగా నిర్ణయిస్తే బాగుండేదని రైతులు భావిస్తున్నారు. గతంలో సన్న రకం ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆచరణలో మాత్రం అమలు చేయలేదు. దీంతో సన్న రకం ధాన్యాన్ని రైతులు తక్కువ ధరకు విక్రయించారు. మార్కెట్లో సన్న బియ్యానికి డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు ధాన్యం కొనుగోలు సమయంలో తక్కువ ధరను చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పం దించి సన్న రకం ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని పలువురు కోరు తున్నారు.