breaking news
mini pakistan
-
‘టెక్ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు..
టీసీఎస్ (TCS) నాసిక్ బీపీవోలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడులపై ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగా మరో ఐటీ సంస్థ టెక్ మహీంద్రాపైనా ఇదే రకమైన మతపరమైన పక్షపాత ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముంబై గోరేగావ్ ఐటీ పార్క్లో ఈ సంస్థకు చెందిన బీపీపీ కార్యాలయంలో మతపరమైన పక్షపాతం, వివక్షపూరిత నియామక పద్ధతులు కొనసాగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.బాంబే హైకోర్టు న్యాయవాది అశుతోష్ దూబే తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక ఉద్యోగి పంపిన సందేశాన్ని షేర్ చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. సదరు కార్యాలయంలోని హెచ్ఆర్ విభాగం ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వారినే ఎక్కువగా నియమిస్తోందని, కార్యాలయ నిబంధనలు కూడా పక్షపాతంగా ఉన్నాయని ఆ సందేశంలో ఆరోపించారు.ముఖ్యంగా రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు క్యాంటీన్లో ఇఫ్తార్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించారని, ఆ సమయంలో ప్యాంట్రీ ఏరియాలోకి ఇతరులు పాదరక్షలతో రావద్దంటూ ఏర్పాటు నోటీసులకు సంబంధించిన ఫోటోలనూ దూబే షేర్ చేశారు. దీనివల్ల తాము "మినీ పాకిస్తాన్లో" పని చేస్తున్నట్లు అనిపిస్తోందని, అక్కడ పనిచేయడం అసౌకర్యంగా ఉందంటూ ఒక ఉద్యోగి వాపోయినట్లుగా దూబే పేర్కొన్నారు. అలాగే, నియామకాల్లో పారదర్శకత లేదని, కార్పొరేట్ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది అశుతోష్ దూబే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన టెక్ మహీంద్రా యాజమాన్యంఈ ఆరోపణలపై టెక్ మహీంద్రా యాజమాన్యం వెంటనే స్పందించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలు, ఫోటోలు పూర్తిగా "నిరాధారమైనవి" అని కొట్టిపారేసింది. తాము నిర్వహించిన అంతర్గత సమీక్షలో అటువంటి వివక్షపూరిత సంఘటనలు ఏవీ జరగలేదని తేలిందని సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. ముఖ్యంగా వైరల్ అవుతున్న 'ఫుట్వేర్ ఫ్రీ జోన్' నోటీసు అసలు తమ కార్యాలయానికే చెందినది కాదని, నియామక ప్రక్రియలో కూడా ఎలాంటి అవకతవకలు లేవని కంపెనీ వెల్లడించింది.తమ సంస్థ సర్వమత సమానత్వాన్ని పాటిస్తుందని, సమ్మిళిత, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రాధాన్యతని టెక్ మహీంద్రా పేర్కొంది. మతం, కులం లేదా ఇతర ప్రాతిపదికన ఎలాంటి వివక్షను సహించబోమని, ప్రతి ఉద్యోగిని నిష్పాక్షికంగా చూస్తామని కంపెనీ స్పష్టం చేసింది. కార్పొరేట్ విలువలను కాపాడటంలో తాము ఎప్పుడూ ముందుంటామని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా కోరింది.ఇదీ చదవండి: కంపెనీల్లో ఇదేం నీతి? దెబ్బకు హెచ్ఆర్ సైలెంట్! -
‘ఓల్డ్ సిటీ మినీ పాకిస్థాన్ అవుతోంది’
హైదరాబాద్: మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ నిజంగానే మినీ పాకిస్థాన్గా మారుతోందంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలను తాను ఇది వరకే తెలంగాణ అసెంబ్లీలో అన్నానని, అప్పుడు తాను అన్నమాటలు ఏదో పొరపాటున అన్నవి కాదని స్పష్టం చేశారు. మరోసారి తాను అప్పట్లో చెప్పిన మాటల్ని సమర్థించుకుంటున్నట్లు తెలిపారు. -
'నా నియోజకవర్గం ఓ మినీ పాకిస్థాన్'
పశ్చిమ బెంగాల్ కేబినెట్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత బాబీ ఫర్హాద్ హకిమ్ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పాకిస్థాన్ జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన 'నా నియోజకవర్గమే కోల్ కతాలో మినీ పాకిస్థాన్ లాంటిది' అని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అయినప్పటికీ మమతా బెనర్జీ నమ్మిన బంటు అయిన ఫర్హాద్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్థాన్ కు వెళితే ఏమీ లేదు కానీ, తాను పాకిస్థాన్ గురించి ఏమైనా మాట్లాడితే వివాదం చేస్తారా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. తాను ముస్లిం కావడం వల్లే ప్రశ్నిస్తున్నారని, ఇందులో మత కలహాల కుట్ర కనిపిస్తున్నదని ఆయన ఎదురుదాడికి దిగారు. బెంగాల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫర్హాద్ హకిమ్ నియోజకవర్గంలో ఇటీవల పాక్ దినపత్రిక డాన్ కు చెందిన విలేకరి మలెహా హమిద్ సిదిఖి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ ఫర్హాద్ చేసిన మినీ పాకిస్థాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. భారత్ లోని ముస్లింల గురించి తప్పుడు సంకేతాలు ఇచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారని పలువురు మండిపడుతున్నారు.


