-
ఇంటి కరెంట్ బిల్లు రూ.76లక్షలు! మరోసారి రీడింగ్ తీస్తే..
మధిర: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ఇళ్లలో విద్యుత్ మీటర్ల రీడింగ్ తప్పులతడకగా మారడంతో వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. మధిరలోని వర్తక సంఘం సమీపాన నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తమ్మారపు నాగమణి ఇంట్లో సోమవారం విద్యుత్శాఖ సిబ్బంది మీటర్ రీడింగ్ తీశారు. స్కానింగ్ మిషన్ ద్వారా రీడింగ్ తీసే క్రమంలో పక్కనే ఉన్న మరో మీటర్ రీడింగ్ కూడా చేరడంతో 3090110116 సర్వీస్కు రూ.76,46,657గా బిల్లు వచ్చింది. రెండు మీటర్లు కలిసినా 76 లక్షలకు పైగా బిల్లు రావడమేమిటని బాధితులు ఆందోళన చెం దారు. దీంతో సిబ్బం ది మరో స్కా నింగ్ మిషన్ తీసుకొచ్చి రీడింగ్ తీస్తే బిల్లు రూ.58 మాత్రమే వచ్చింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. స్కానింగ్మిషన్లలో అవకతవకలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
APEPDCL ఎవరి ఇంటి మీటర్కు వారే రీడింగ్!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి ఏపీ రాష్ట్ర ఇంధన శాఖ శ్రీకారం చుడుతోంది. ఎవరి ఇంటి మీటర్కు వారే రీడింగ్ తీసి బిల్లులు పొందేలా సాంకేతికతను అభివృద్ధి చేసింది. స్మార్ట్ ఫోన్తో కరెంటు బిల్లు కడుతున్నట్లుగానే అదే ఫోన్తో మీటర్ రీడింగ్ కూడా తీసేయొచ్చు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బిల్లులు తీసే ప్రక్రియ స్పాట్ బిల్లింగ్ రీడర్ల ద్వారా జరుగుతోంది. కరోనా నేపథ్యంలో మీటర్ రీడింగ్ తీసేందుకు సిబ్బంది ఇళ్లకు రావడంపై కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. అయినా, మరో మార్గం లేకపోవడంతో వారే రీడింగ్ తీస్తున్నారు. గత రెండు వేవ్లలో కరోనా బారిన పడి పలువురు స్పాట్ బిల్లింగ్ రీడర్లు ప్రాణాలు కూడా కోల్పోయారు. మూడో వేవ్ వస్తున్న నేపధ్యంలో మళ్లీ ఇప్పుడు రీడింగ్పై ఆందోళన మొదలైంది. అంతేకాకుండా రీడింగ్ తీయడం కాస్త ఆలస్యమైతే స్లాబు మారి, బిల్లు ఎంత వస్తుందోననే భయం వినియోగదారుల్లో ఉంది. దీనికి పరిష్కారంగా ఎవరికి వారు మీటరు రీడింగ్ సకాలంలో తీసుకుని పంపితే ఈ–బిల్లు మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అందుబాటులోకి తెచ్చింది. దీనిని మిగతా రెండు డిస్కంలు ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్లు కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రీడింగ్ ఇలా.. ఈపీడీసీఎల్ అనుసరిస్తున్న విధానం ప్రకారం.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈస్టర్న్ పవర్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. కొత్త వారైతే పేరు, చిరునామా, సెల్ ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ నమోదు చేయాలి. ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. 16 నంబర్ల విద్యుత్తు సర్వీస్ మీటరును నమోదు చేయాలి. ఆ వెంటనే సెల్ఫోన్కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీటరు ఐకాన్ రిజిస్ట్టర్ సర్వీస్ నంబర్పై క్లిక్ చేసి కెమెరా ఐకాన్ ద్వారా మీటర్ రీడింగ్ స్కాన్ చేయాలి. దానిని సబ్మిట్ చేస్తే అధికారి నిర్ధారణ చేసిన తరువాత మొబైల్కు సమాచారం వస్తుంది. ఈ యాప్లోనే బకాయిలు, బిల్లు కట్టే విధానం, వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. అందరి క్షేమం కోరి వినియోగదారులకు ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నాం. విద్యుత్ అంతరాయాల షెడ్యూల్ను ముందే తెలుసుకునేలా రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం (ఆర్టీఎఫ్ఎంఎస్)ను కూడా మా డిస్కం అభివృద్ధి చేసింది. వినియోగదారులు, సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి మీటర్కు రీడింగ్ వెసులుబాటు కల్పించాం. దీనివల్ల భద్రతతో పాటు స్లాబులు మారకుండా ఉంటాయి. –కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
విద్యుత్ మీటర్లు దడ పుట్టిస్తున్నాయి.. కనెక్షన్ లేకుండానే..
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో విద్యుత్ మీటర్లు వినియోగదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ఖానాపూర్ పట్టణంలో విద్యుత్ మీటర్లు కనెక్షన్ లేకుండానే రీడింగ్ తిరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విద్యుత్ కనెక్షన్ తొలగించి విద్యుత్ మీటర్లు చేతితో పట్టుకుంటే చాలు రీడింగ్ తిరుగుతున్నాయి. దీనిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి మీటర్ల వల్ల విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి మీటర్లతో ప్రజలకు విద్యుత్ సరఫరా చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. చదవండి: (సైదాబాద్ ఘటన: మత్తు రహిత సింగరేణిగా మారాలి) -
గతేడాది మార్చి బిల్లునే చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి మీటర్ రీడింగ్ తీసి విద్యుత్ బిల్లుల డిమాండ్ నోటీసులు జారీ చేయడానికి బదులు ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు నిర్ణయం తీసుకున్నాయి. 2019 మార్చిలో జరిపిన వినియోగానికి సంబంధించి చెల్లించిన విద్యుత్ బిల్లులనే 2020 మార్చిలో జరిపి న వినియోగానికి సైతం చెల్లించాలని వినియోగదారులను కోరనున్నా యి. కొత్త వినియోగదారులైతే ఫిబ్రవరి 2020 నెలకు సంబం ధించి చెల్లించిన బిల్లు మొత్తాన్నే మార్చి నెల వినియోగానికి సైతం చెల్లించాలని కోరనున్నాయి. దీనికి సంబంధించిన అనుమతుల కోసం శుక్రవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మీటర్ రీడింగ్ తీసి వినియోగదారులు చెల్లించిన బిల్లులను సర్దుబాటు చేస్తామని ఈఆర్సీకి తెలిపాయి. వినియోగంతో పోల్చితే ఎవరైనా అధికంగా బిల్లులు చెల్లిస్తే.. తర్వాత మీటర్ రీ డింగ్ తీసినప్పుడు వారికి సంబంధించిన తదుపరి నెల బిల్లును ఆ మేరకు తగ్గించి సర్దుబాటు చేస్తారు. ఇదే తరహాలో అధిక వినియోగం ఉండి తక్కువ బిల్లులు చెల్లించిన వారి నుంచి తదు పరి నెల బిల్లులో ఆ మేరకు మిగిలిన మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తామని ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించి శనివారం ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. -
పెట్రోల్ రాదు.. రీడింగ్ మాత్రమే వస్తుంది
సాక్షి,మంచిర్యాల : ఓ వాహన యాజమాని గురువారం సాయంత్రం పెట్రోల్ పోయించుకునేందుకు జన్నారం మండలం రేండ్లగూడ సమీపంలోని పెట్రోల్ బంక్కు వెళ్లాడు. పెట్రోల్ పోసెందుకు గన్ తీయగానే పెట్రోల్ పోస్తున్నట్లు రీడింగ్ నడుస్తుంది. పెట్రోల్ రావడం లేదు. అవాక్కయిన వాహన యాజమాని అలాగే పరిశీలించారు. బైక్లో పెట్రోల్ పోయకుండానే సుమారు రూ.400 వరకు రీడింగ్, పెట్రోల్ మీటర్ల రీడింగ్ నడుస్తుంది. ఇది ఎలా జరుగుతుందని, మోసం చేస్తున్నారంటూ వాహన యాజమానులు పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువురికి తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్సై వినోద్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని శాంతింపజేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శుక్రవారం జన్నారం తహసీల్దార్ రాజుకుమార్ పెట్రోల్ బంకుకు వెళ్లి విచారణ చేశారు. పెట్రోల్ పోసే గన్ తీయగానే రీడింగ్ నడుస్తుందని, ఇలా జరుగడానికి కారణంపై ఆరా తీశారు. గాలి, వర్షం, పిడుగుల కారణంగా ఇలా అయిందని, ఈ విషయాన్ని పై అధికారులకు సమాచారం ఇచ్చామని సిబ్బంది పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని తహసీల్దార్ పెట్రోల్ బంకు యాజమానికి తెలియజేసి ఇలా జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement