-
వచ్చే 5 ఏళ్లలో భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
గ్లోబల్ వార్మింగ్ సమస్యలను ఎదుర్కొవడం కోసం పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిపై దృష్టిసారించాయి. అంతేకాకుండా కంపెనీలు కూడా పెట్రోల్, డిజీల్తో నడిచే సాంప్రదాయ వాహనాలకు స్వస్తి పలుకుతూ ఎలక్ట్రిక్ వాహనాలపై అడుగులు వేస్తున్నాయి. మరోవైపు ఇంధన ధరలు అమాంతం ఒక్కసారిగా పెరగడంతో వాహనదారులు కూడా ప్రత్యామ్నాయాలపై చూస్తున్నారు. భారత్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు భారీ ఆదరణను నోచుకుంటున్నాయి. భారత ఈవీ మార్కెట్ల్పై దిగ్గజ కంపెనీల దృష్టి..! దేశీయ కంపెనీలే కాకుండా విదేశీ కంపెనీలు కూడా భారత ఈవీ మార్కెట్లపై దృష్టిసారించాయి. టెస్లా లాంటి కంపెనీలు భారత మార్కెట్లలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. భారత్లో అధిక దిగుమతి సుంకాలు ఉండడంతో పలు విదేశీ కంపెనీల రాక ఆలస్యమవుతోంది. టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్ ఇండియా, హ్యుందాయ్ మోటార్ కంపెనీ, మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్, ప్రధాన పోటీదారులగా నిలవనున్నాయి. లగ్జరీ కార్ స్పేస్లో...మెర్సిడెస్-బెంజ్ ఇండియా, ఆడి ఇండియా , జాగ్వార్ ఇండియా వంటి బ్రాండ్లతో పాటుగా బీఎండబ్ల్యూ, వోల్వో కంపెనీలు కూడా భారత ఎలక్ట్రిక్ మార్కెట్లపై దృష్టిసారించాయి. వచ్చే 5ఏళ్లలో 78 బిలియన్ డాలర్లకు..! రీసెర్చ్ అండ్ మార్కెట్స్ చేపట్టిన తాజా అధ్యయనం ప్రకారం... భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విలువ 2027 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు 78 బిలియన్ డాలర్లకు పైగా చేరుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ప్రస్తుత మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడానికి సాంకేతికతలో నిరంతర పురోగతి మరియు ఆటోమోటివ్ పరిశ్రమలో కొత్త ఆవిష్కరణలు ఎలక్ట్రిక్ కార్ మార్కెట్కు డిమాండ్ను పెంచుతున్నాయని నివేదిక పేర్కొంది. దక్షిణ భారతంలో ఎలక్ట్రిక్ వాహనాలపై మరింత ఆదరణ ఉందని రీసెర్చ్ అండ్ మార్కెట్స్ వెల్లడించింది. గణనీయమైన వృద్ధి..! ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులుతో పాటుగా, కొత్తగా వాహనాలను కొనేవారు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలకే జై కొడుతున్నారు. జస్ట్ డయల్ కన్స్యూమర్ ఇన్సైట్ల ప్రకారం...ఈ-స్కూటర్లు సంవత్సరానికి అత్యధికంగా 220.7 శాతం మేర డిమాండ్ను సాధించగా, ఈ-కార్లు 132.4 శాతం, ఈ-మోటార్సైకిళ్లకు 115.3 శాతం , ఈ-సైకిళ్లకు 66.8 శాతం డిమాండ్ ఉన్నట్లు జస్ట్ డయల్ తన నివేదికలో పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జస్ట్ డయల్కు వచ్చిన కాల్స్ ఆధారంగా ఈ నివేదికను రూపొందించనట్లు తెలుస్తోంది. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దారులకు కేంద్రం శుభవార్త..! -
టాప్ 10 కంపెనీల్లో ఐదు నష్టాల బాటే...
న్యూఢిల్లీ : టాప్ 10 కంపెనీల్లో ఐదు కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయట. ఏప్రిల్ 18 నుంచి 22 వరకూ గడిచిన వారంలో ఈ కంపెనీలు దాదాపు 38,968 కోట్ల మార్కెట్ వాల్యుయేషన్ ను కోల్పోయాయని గణాంకాలు తెలుపుతున్నాయి. బాగా పడిపోయిన కంపెనీల్లో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) పరిస్థితి మరింత దారుణంగా ఉందని తెలుస్తోంది. ఈ వారంలో టీసీఎస్ మార్కెట్ వాల్యుయేషన్ రూ. 20,876.99 కోట్ల వరకూ పడిపోయి, రూ. 4,76,291.84 కోట్లగా నమోదైంది. టీసీఎస్ బాటలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, సన్ ఫార్మా, హెచ్ యూఎల్ నడిచాయి. అయితే ఇన్ఫోసిస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఓఎన్జీసీ, కోల్ ఇండియాలు ఈ వారంలో లాభాలనే నమోదు చేశాయి. రిలయన్స్ మార్కెట్ వాల్యుయేషన్ రూ.8,651.8 కోట్లు పడిపోయి, రూ.3,36,593.97 కోట్లగా నమోదైంది. అదేవిధంగా ఐటీసీ సైతం రూ.4,224.79 కోట్లు తగ్గి, రూ.2,62,097.53 కోట్ల మార్కెట్ వాల్యుయేషన్ కలిగి ఉంది. సన్ ఫార్మా రే 2,791.74 కోట్లు, హెచ్ యూఎల్ మార్కెట్ వాల్యు రూ.2,423.61 కోట్లు తగ్గాయి. ఇన్ఫోసిస్ రూ.9601.23 కోట్లు, హెచ్ డీఎఫ్ సీ రూ. 2,793.64 కోట్లు, ఓఎన్జీసీ రూ. 2,694.98 కోట్లు మార్కెట్ క్యాప్ ను పెంచుకున్నాయి. అదేవిధంగా సెన్సెక్స్ సైతం వరుసగా రెండు వారాలు లాభాలనే నమోదుచేసింది. ఈ వారంలో 211 పాయింట్లు లాభాలను పండించి, 25,838.14గా నమోదైంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement