breaking news
Mangala Suthra
-
మంగళసూత్రం ఎపిసోడ్.. చిన్మయి కౌంటర్!
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎపిసోడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ చేసిన కామెంట్స్పై పెద్దఎత్తున చర్చ మొదలైంది. మంగళసూత్రం ధరించడమనేది చిన్మయి ఇష్టమని.. తానైతే తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పనని అన్నారు. ఈ కామెంట్స్పై కొందరు నెటిజన్స్ విమర్శించగా.. మరికొందరు సమర్థించారు. దీంతో రాహుల్, చిన్మయి జంటపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.దీంతో తమపై పెద్దఎత్తున ట్రోల్స్ రావడంతో సింగర్ చిన్మయి స్పందించింది. ఆయన ఏందో ఒక సందర్భంలో అలా మాట్లాడారని తెలిపింది. అదే ఇప్పుడు చర్చకు కారణమైంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న చర్చపై నాకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. కానీ మనదేశంలోని మహిళల గురించే ఆందోళన చెందుతున్నానన నెటిజన్లకు కౌంటరిచ్చింది.(ఇది చదవండి: నా భార్యకు తాళి వేసుకోవద్దనే చెబుతా: రాహుల్ రవీంద్రన్)ఓ నెటిజన్ చిన్మయి- వైరముత్తు ఎపిసోడ్పై ప్రశ్నించాడు. వైరముత్తు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోయారు.. కానీ ఇక్కడ ఇతర మహిళల గురించి ఆందోళన చెందుతున్నారని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీనిపై చిన్మయి స్పందిస్తూ..అవును.. ఎందుకంటే లైంగిక వేధింపులకు గురి కావడం నా తప్పే.. కానీ మీలాంటి పురుషులు నా లైంగిక వేధింపుల ఎపిసోడ్ గురించి ఎందుకు ప్రస్తావించాలి? దయచేసి ఢిల్లీ గాలిని పీల్చుకోండి.. ఎందుకంటే నేను అలాంటి గాలిని తట్టుకోలేనంటూ తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. కాగా.. 2018లో మీటూ ఉద్యమం సమయంలో ఓ ఈవెంట్లో వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 20 మంది మహిళలు ఆతనిపై ఆరోపణలు చేశారు.కాగా.. సింగర్ చిన్మయి, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఏడాది డేటింగ్ తర్వాత 2014లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు జూన్ 2022లో కవలలు జన్మించారు. ప్రస్తుతం రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది గర్ల్ఫ్రెండ్ మూవీ నవంబర్ 7న రిలీజ్ కానుంది. He literally said it in some context on an interview which has become a tweet. The rage from the men calling him all sorts of abuses - I am worried for the women here truth be told— Chinmayi Sripaada (@Chinmayi) November 4, 2025 -
మంగళసూత్రం మింగిన గేదె.. ఐదోతనం కాపాడిన వైద్యుడు!
మహారాష్ట్రలోని వాశిం జిల్లాలో ఒక వింత ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక గేదె రూ. 15 లక్షల విలువైన మంగళసూత్రం మింగేసింది. పశువైద్యులు ఆ గేదె కడుపులోని మంగళ సూత్రం తీసేందుకు దాని కడుపును కోశారు. మంగళసూత్రం బయటకు తీశాక ఆ గేదెకు 65 కుట్లు వేశారు. జిల్లాలోని సార్సీ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. రామ్హరీ అనే రైతు భార్య స్నానం చేసే ముందు తన మంగళ సూత్రాన్ని తీసి, సోయాబీన్ తొక్కలు ఉన్న ఒక పాత్రలో పెట్టింది. స్నానం పూర్తయ్యాక, ఆ ప్లేట్ను తమ పశువులశాల లోని గేదె ముందు ఉంచి, ఇంటిపనులలో మునిగిపోయింది. రెండు గంటల తరువాత తన మెడలో మంగళ సూత్రం లేని విషయాన్ని ఆమె గమనించింది. కొద్దిసేపు ఇటునటు వెదికాక తాను ఆ మంగళ సూత్రాన్ని సోయా తొక్కలున్న ప్లేట్లో పెట్టినట్లు గుర్తుకు తెచ్చుకుంది. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ పశువులశాలలోకి వెళ్లి చూసింది. గేదె తన మంగళసూత్రం మింగేసిందని గ్రహించింది. వెంటనే ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలియజేసింది. రైతు రామ్హరీ ఈ విషయాన్ని ఫోనులో పశువైద్యాధికారి బాలాసాహెబ్కు తెలియజేశాడు. అతని సూచన మేరకు ఆ రైతు తన గేదెను వాశింలోని పశువైద్యశాలకు తీసుకు వెళ్లాడు. అక్కడ పశువైద్యాధికారి మెటల్ డిటెక్టర్తో ఆ గెదె కడుపులో మంగళసూత్రం ఉన్నదని నిర్ధారించారు. తరువాత దానికి ఆపరేషన్ చేసి, మంగళ సూత్రాన్ని బయటకు తీశారు. ఈ ఆపరేషన్ 2 గంటలపాటు సాగింది. తరువాత వైద్యుదు ఆ గేదెకు 65 కుట్లు వేశారు. కాగా తన మంగళసూత్రాన్ని గేదె కడుపు నుంచి వెలికి తీసి, తన ఐదోతనం కాపాడారంటూ ఆ రైతు భార్య వైద్యునికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇది కూడా చూడండి: పాక్ ప్రధాని జీతం ఎంత? అదనపు సౌకర్యాలు ఏముంటాయి? -
ఆశీర్వాదం అడిగితే.. తాళి కట్టబోయిన నేత
-
ఆశీర్వాదం అడిగితే.. తాళి కట్టబోయిన బీజేపీ నేత
చెన్నై (తమిళనాడు): బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి పరధ్యానంలో పచ్చని పెళ్లి పందిట్లో కలకలం రేపారు. తమిళనాడులోని తిరునల్వెలిలో బుధవారం ఆయన ఓ పెళ్లికి హాజరయ్యారు. తాళిబొట్టును తన చేతుల మీదుగా వరుడికి అందించాలని పెద్దలు కోరగా అందుకు ఆయన అంగీకరించారు. పరధ్యానంలో ఉన్న ఆయన తాళి బొట్టును తీసుకొని ఏకంగా పెళ్లికూతురు మెడలో కట్టేందుకు ప్రయత్నించగా చుట్టుపక్కల వారికి అక్కడ ఏం జరుగుతుందో కొన్ని క్షణాలు అర్థం కాలేదు. వెంటనే తేరుకున్న ఓ పెద్దావిడ మంగళసూత్రం కట్టకుండా ఆయనను నిలువరించింది. తాను పరధ్యానంతో చేసిన చర్యకు స్వామి కాస్త సిగ్గుపడి నవ్వుకున్నారు. ఆయన చర్యలతో పెళ్లికి వచ్చిన అతిథులు, వధూవరుల కుటుంబసభ్యులు ఈ సంఘటనతో షాక్ తిన్నారు.


