lotterry system
-
అదృష్టం అంటే ఆమెదే.. చెత్తలో ‘టికెట్’కు రూ. కోటి!
అలప్పుజ: అదృష్టం తలుపు తట్టడమే కాదు.. ఒక్కోసారి చెత్తబుట్టలో నుంచి కూడా పలకరిస్తుందని కేరళకు చెందిన ఓ మహిళ విషయంలో నిరూపితమయ్యింది. తెలియక పారేసిన లాటరీ టికెట్ ఆమెను రాత్రికి రాత్రే కోటీశ్వరురాలిని చేసింది. తృటిలో చేజారిన మహాభాగ్యం తిరిగి దక్కిన ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.కేరళలోని అలప్పుజ జిల్లా తలవాడి పంచాయతీ పరిధిలోని ఎడతువా ప్రాంతానికి చెందిన కుంజమ్మ అనే మహిళ, అంబలప్పుజా-తిరువల్లా రాష్ట్ర రహదారి పక్కన ఒక చిన్న దుకాణాన్ని నడుపుకుంటూ తన జీవనం సాగిస్తున్నారు. రోజూవారీ వ్యాపారంతో పాటే ఆమె స్థానికంగా ఉండే జార్జ్కుట్టి అనే లాటరీ విక్రేత వద్ద రెండు ‘కారుణ్య’ లాటరీ టికెట్లను కొనుగోలు చేశారు. గురువారం నాడు లాటరీ ఫలితాలు వెలువడగా, కుంజమ్మ ఎంతో ఆసక్తిగా తన వద్ద ఉన్న లాటరీ నంబర్లను ఫలితాలతో సరిచూసుకున్నారు. అయితే తాను కొన్న రెండు టికెట్లలో ఒక దానికి మాత్రమే రూ. 5,000 కన్సోలేషన్ బహుమతి వచ్చినట్లు ఆమె గమనించారు. తనకు దక్కిన అదృష్టం అంతేనని సరిపెట్టుకున్న కుంజమ్మ, రెండో టికెట్కు ఎలాంటి బహుమతీ రాలేదని భావించి, దానిని తన దుకాణంలో ఉన్న చెత్తబుట్టలో పారేశారు.అయితే అసలు కథ అప్పుడే మొదలైంది. లాటరీ ఫలితాలను నిశితంగా గమనించిన కుంజమ్మ సోదరుడు ఆమెకు ఒక కళ్లు చెదిరే వార్తను చెప్పారు. పనికిరాదని ఆమె చెత్తలో పారేసిన ఆ రెండో టికెట్కే ఏకంగా రూ. ఒక కోటి మొదటి బహుమతి వరించిందన్నాడు. ఆ మాట విన్న వెంటనే కుంజమ్మకు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చేతిదాకా వచ్చిన అదృష్టాన్ని తానే స్వయంగా చెత్తపాలు చేశానని గ్రహించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, రాత్రికి రాత్రే తన సోదరుడిని వెంటబెట్టుకుని ఆమె తిరిగి తన దుకాణానికి పరుగులు తీశారు. ఇద్దరూ కలిసి ఆ చెత్తబుట్టలో వెతకడం ప్రారంభించారు. కాసేపటి తర్వాత వారి నిరీక్షణ ఫలించింది. చెత్తలో పారేసిన ఆ కోటి రూపాయల లాటరీ టికెట్ ఎట్టకేలకు దొరికింది. అది చూసి ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన స్థానికుంగా సంచలనంగా మారింది.ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచం.. మూడు సరికొత్త సంచలనాలు -
రూ.100 గెలిస్తే ఇచ్చేది మాత్రం రూ.68!
నిత్యం దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ఫలానా వ్యక్తి లాటరీ గెలుచుకున్నారని వింటూంటాం. ఒకవేళ ఆ వ్యక్తి రూ.100 లాటరీ ద్వారా గెలుపొందితే ట్యాక్స్లు పోను తనకు చివరకు అందేది దాదాపు రూ.68 మాత్రమే. మిగతా రూ.32లు వివిధ ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అసలు లాటరీ పొందిన వారికి ఎలాంటి ట్యాక్స్లు విధిస్తున్నారు. అది ఎంత మొత్తంలో కట్టాల్సి ఉంటుందో తెలుసుకుందాం.కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషా అనే స్కూటర్ మెకానిక్ ఇటీవల ఏకంగా రూ.25 కోట్ల లాటరీ గెలుపొందారు. కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్ లాటరీలో పాల్గొనేందుకు రూ.500 పెట్టి టికెట్ కొన్నారు. ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అందులో అల్తాఫ్ ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వ ట్యాక్స్లో పోను చివరకు తనకు అందేది మాత్రం సుమారు రూ.17.25 కోట్లు కావడం గమనార్హం. అంటే రూ.7.8 కోట్లమేర ట్యాక్స్ కట్ అవుతుంది.ఇదీ చదవండి: ఎప్పటికీ మారనిది ఏంటో చెప్పిన టాటాట్యాక్స్లు ఇలా..ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194బీ కింద లాటరీలో గెలుపొందిన డబ్బుపై 30 శాతం పన్ను చెల్లించాలి. ఈ 30 శాతం పన్నుపై అదనంగా మరో నాలుగు శాతం వరకు సర్ఛార్జీ, సెస్ రూపంలో ట్యాక్స్ కట్టాలి. దాంతో మొత్తం సమకూరిన సొమ్ముపై 31.2 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సర్ఛార్జీ, సెస్ను ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, విద్యకు వెచ్చించాల్సి ఉంటుంది. ముందుగానే సదరు లాటరీ సంస్థలు టీడీఎస్(మూలం వద్ద పన్ను కోత) రూపంలో పన్ను కట్ చేసుకుని మిగతా డబ్బు విజేతలకు ఇస్తారు. లాటరీ ద్వారా గెలుపొందిన డబ్బు రెగ్యులర్ ఇన్కమ్ కిందకు రాదు. అది ‘ఇతర ఆదాయం’ విభాగంలోకి వస్తుంది. కాబట్టి బీమాకు సంబంధించిన 80డీ కింద ప్రభుత్వం గరిష్టంగా ఇచ్చే రూ.50 వేలు, 80సీ కింద ఇచ్చే రూ.1.5 లక్షలు పన్ను వెసులుబాటుకు అనర్హులుగా పరిగణిస్తారు. -
హెచ్ 1బీ వీసా : ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారతీయ ఐటి నిపుణులకు మరోసారి షాక్ ఇచ్చింది. హెచ్ 1బీ వీసాల జారీలో కంప్యూటరైజ్డ్ లాటరీ పద్దతికి గుడ్ బై చెబుతూ మరో కీలక ప్రతిపాదన చేసింది. దీనిస్థానంలో వేతన స్థాయి ఆధారిత వీసాలు జారీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్పై 30 రోజుల్లోగా స్పందన తెలియజేయవచ్చుని అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ(డిహెచ్ఎస్) తెలిపింది. ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యత అంటూ ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న ట్రంప్ సర్కార్ తాజాగా లాటరీ పద్దతిన వీసాలు కేటాయించే పద్దతికి కూడా స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. లాటరీ విధానాన్ని రద్దు చేసి ఇకపై గరిష్ఠ వేతన స్థాయి వీసాల ద్వారా మెరుగైన వేతనాలను అందించేలా ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. భారత్ సహా, వివిధ దేశాలనుంచి ప్రతీ ఏడాది హెచ్ 1బీ వీసా కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తూ ఉంటాయి. వీటిలో కంప్యూటర్ లాటరీ ద్వారా 65 వేల మందిని ఎంపిక చేసి హెచ్1బీ వీసాలు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పద్దతిలో విదేశాలకు చెందిన అభ్యర్ధులు చౌకగా దొరుకుతుండడంతో అమెరికా యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతోందంటూ ట్రంప్ సర్కార్ వాదిస్తోంది. దీనికి బదులుగా ఎక్కువ నైపుణ్యం ఉండి, ఎక్కువ జీతాలకు పని చేసే ఉద్యోగులకు మాత్రమే హెచ్1బీ వీసాను జారీచేసేలా చర్యలు చేపట్టనుంది. -
నేడు ఉమ్మడి రాష్ట్ర సభ్యుల విభజన
-
రాజ్యసభ ఖాళీలకు 19న ఎన్నికలు
* నేడు ఉమ్మడి రాష్ట్ర సభ్యుల విభజన సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాల కోసం జూన్ 19న ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 9 స్థానాలు ఖాళీగా ఉండగా 8 స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనుంది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్రెడ్డి మరణించడంతో ఏర్పడిన ఖాళీని మినహాయించి ఈ నోటిఫికేషన్ను జారీ చేశారు. ఈ స్థానం కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్కు చెందుతుందా? లేక తెలంగాణకు చెందుతుందా? అన్న అంశాన్ని నిర్ధారించాక దీనికి సైతం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇలావుండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్న విధంగా లాటరీ పద్ధతిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బుధవారం కేటాయించనున్నారు.


