-
‘బిల్లు’పోటు!
శ్రీకాకుళం పాతబస్టాండ్: దోమపోటుకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. దీనిపై ఎన్నిసార్లు అధికారులను కలిసినా ఫలితం ఉండడం లేదు. రైతులే నేరుగా కలెక్టర్ను, ఖజానా శాఖ అధికారులను కలిసినా లాభం లేకపోయింది. రెండేళ్ల నుంచి రైతులకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఖజా నా శాఖ సిబ్బంది తమ ఆర్థిక ప్రయోజనాలు చూసుకునే బిల్లు జాప్యం చేస్తున్నారని వ్యవసా య శాఖ అధికారులు కొందరు ఆరోపిస్తున్నా రు. దీనిపై కమిటీ కూడా వేసి వారికి ఎలాంటి మార్గ దర్శకాలు ఇవ్వకుండా వేరే శిక్షణకు పంపిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని అంటున్నా రు. దీనిపై శుక్రవారం జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో చర్చ రావడంతో తాజాగా శనివా రం వ్యవసాయ శాఖ అధికారులు ఖజానా శాఖ డీడీని ఆమె కార్యాలయంలో కలిసి సమస్యను పరిష్కరిం చాలని కోరారు. 2014 నుంచి.. 2014లో ఖరీఫ్ సీజన్లో జిల్లాలో వరి దోమపోటుకు గురైంది. దాదాపు 20 మండలాల్లో వేలా ది హెక్టార్లలో పంట నాశనమైంది. దీనికి ప్రభుత్వం నష్ట పరిహారం కింద రూ.22 కోట్లు మం జూరు చేసింది. అయితే ఇందులో రూ.17 కోట్లు అప్పుడే రైతుల ఖాతాలో జమయ్యాయి. మిగి లిన డబ్బు వెయ్యి మంది రైతులకు అందాల్సి ఉంది. ఈ పరిహారం కోసం ఏడాదిన్నర కిందటే బిల్లులు ఖజానా శాఖ అధికారులకు అందించా మని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నా రు. ఇప్పటికీ రైతులకు పరిహారం అందలేదు. మంత్రి చెప్పినా దోమపోటు పరిహారం చెల్లించాలని కలెక్టర్ చా లాసార్లు అధికారులకు పలు సమావేశాల్లో సూ చించారు. మూడు నెలల కిందట జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి కూడా బిల్లులు చెల్లిం చాలని ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. వెంటనే పరిష్కరించాలి దోమపోటు పరిహారం వెంటనే రైతులకు చెల్లిం చాలని, సకాలంలో చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని గత శనివా రం వ్యవసాయ శాఖ జేడీ జి.రామారావు, ఇతర ఏడీఈలు, డీడీలు ఖజానా శాఖ డీడీ నిర్మలమ్మ ను కోరారు. అయితే దీనికి ఖజానా శాఖ అధి కారులు కారణాలు చెప్పే ప్రయత్నం చేయగా, వ్యవసాయాధికారులు స్పందిస్తూ వెంటనే బిల్లులు చేయాలని, కమిటీల పేరిట కాలయాపన లే కుండా నేరుగా బిల్లు చేసి, రైతుల బ్యాంకు ఖా తాల్లో పరిహారం జమచేయాలని వారు ఒత్తిడి చేశారు. తర్వాత వారు ఖజానా శాఖ తీరుపై జిల్లా ఉన్నతాధికారులను కలిసి వివరించారు. -
సమగ్ర దర్యాప్తు జరిపించాలి..
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం : భద్రాచలం గోదావరి బ్రిడ్జి అప్రోచ్రోడ్డుపై జరిగిన బస్సు ప్రమాదంపై ప్రత్యేక కమిటీ ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆయన హుటాహుటిన భద్రాచలం వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. బస్సు ప్రమాద మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఘటనాస్థలిలో లూజ్ సాయిల్ ఉందని, ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు రెండు సార్లు ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లుగా చెబుతున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకుంటున్న క్షతగాత్రులను పొంగులేటి పరామర్శించారు. ‘ఏరియూ ఆస్పతిలో చికిత్స కోసం 26 మంది వచ్చారు. వారిలో ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం పంపించామని’ డాక్టర్లు చెప్పారు. బస్సులో 42 మంది ఉన్నప్పుడు మిగతా పదిమంది ఏమయ్యూరని పొంగులేటి ప్రశ్నించారు. దీనిపై వైద్యులు, పోలీసులు, ఆర్టీసీ అధికారుల వద్ద తగిన సమాచారం లేకపోవటంతో ఎంపీ పొంగులేటి వారి వివరాలను కూడా సేకరించాలని సూచించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పటంతో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పట్టణంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్న వారి వివరాలను కూడా సేకరించారు. నేనున్నా.... మృతురాలు శ్రావణి కుటుంబానికి పొంగులేటి భరోసా.. బస్సు ప్రమాద మృతుల్లో ఒకరైన బొడ్డు శ్రావణి కుటుంబాన్ని ఆదుకుంటానని ఎంపీ పొంగులేటి భరోసా ఇచ్చారు. కూసుమంచి మండలం ఈశ్వరమాధారానికి చెందిన శ్రావణి కుటుంబం దుమ్ముగూడెం మండలం సింగారానికి వలస వచ్చింది. శ్రావణి, భర్త లక్ష్మీనారాయణతో కలిసి కిరాణషాపు నిర్వహిస్తోంది. వీరితో పాటు వీరి కుమారు శ్రావణ్, కూతురు గాయత్రి సింగారం వెళ్లేందుకని ఖమ్మంలో రామబాణం బస్సెక్కారు. ప్రమాదంలో శ్రావణి మృతిచెందగా మిగతా ముగ్గురు గాయూలపాలయ్యూరు. వీరిలో గాయత్రి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ఎంపీని చూసి లక్ష్మీనారాయణ భోరున విలపించాడు. ఖమ్మం తీసుకెళ్లిన తన బిడ్డ పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళన చెందాడు. వెంటనే ఎంపీ ఖమ్మం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్తో ఫోన్లో మాట్లాడారు. బాలిక ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అవసరమైతే హైదరాబాద్ తరలించాలని సూచించారు. అనంతరం మార్చురీలో ఉన్న శ్రావణి మృతదేహాన్ని పొంగులేటి సందర్శించారు. ఆ సమయంలో శ్రావణి అత్త జయమ్మ ఎంపీని చూసి కన్నీటి పర్యంతమయ్యూరు. పొంగులేటి కూడా కంటనీరు పెట్టారు. ‘మీ కుటుంబానికి నేనున్నా..ఏమి కాదని అభయమిచ్చారు.’ ఎంపీ వెంట ైవె ఎస్ఆర్సీపీ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, నాయకులు కడియం రామాచారి, గంటా కృష్ణ ఉన్నారు.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
T20 WC 2024 IND VS PAK: రోహిత్ శర్మ సూపర్ సిక్సర్.. వైరల్ వీడియో
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుడ్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
Advertisement