breaking news
Letter to Speaker
-
ఆ వీడియో ఫుటేజీ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ శాసనసభ్యుల సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్కు దారి తీసిన ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని ఇవ్వాలని సీఎల్పీ కోరింది. బుధవారం ఈ మేరకు స్పీకర్ మధుసూదనాచారికి కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ వేర్వేరుగా లేఖలు రాశారు.ఈ నెల 12న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన ఫుటేజీలను తమకు ఇవ్వాలని లేఖల్లో కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి గవర్నర్ వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు ఉన్న విజువల్స్ ఇవ్వాలని, అదే విధంగా ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఫుటేజీ కూడా ఇవ్వాలని కోరారు. -
టీడీపీని టీఆర్ఎస్లో కలిపేశాం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని విడిచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు అంతా అనుకున్నట్టే చేశారు. టీడీపీ నాయకత్వానికి షాకిచ్చే పరిణామం చోటుచేసుకుంది. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని టీడీపీ నాయకత్వం చెబుతుండగా, తమదే అసలైన పక్షమంటూ టీడీపీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేశామని చెబుతున్నారు. ఒక్కొక్కరుగా టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభా పక్షాన్నే విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. శాసనసభలో టీడీపీ పక్షం విలీనం చేసినట్టు తెలియజేస్తూ ఏకంగా స్పీకర్కు లేఖ అందించారు. తెలంగాణ టీడీపీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టు శాసనసభ స్పీకర్ మధుసూధనా చారికి అందజేసిన లేఖలో తెలియజేసారు. తెలంగాణలో టీడీపీ తరఫున 15 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా, శాసనసభా పక్షం తరఫున తామంతా శుక్రవారం ఒక సమావేశం నిర్వహించాం. లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని ఈ సమావేశం తీర్మానం చేశాం. ఈ సమావేశంలో 10 మంది ఎమ్మెల్యే పాల్గొన్నారు. టీడీపీ లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని తీర్మానం చేసిన నేపథ్యంలో రాజ్యాంగంలోని 10 వ షెడ్యూలు పేరా 4 మేరకు తమను టీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా పరిగణించాలి... అని కోరుతూ 10 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని వారు శుక్రవారం స్పీకర్ కు అందజేశారు.స్పీకర్ కు అందజేసిన వినతి పత్రంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తీగల కృష్ణారెడ్డి, జి.సాయన్న, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాధవరపు కృష్ణారావు, కేపీ వివేకానంద, చల్లా ధర్మారెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్లు సంతకాలు చేశారు. మరోవైపు తెలంగాణ టీడీఎల్పీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి, మిగతా ఎమ్మెల్యేలు సండ్ర వీరయ్య, మాగంటి గోపీనాథ్, అరెకపూడి గాంధీ తదితరులు శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. టీఆర్ఎస్లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వారు ... అసెంబ్లీ కార్యదర్శికి ఓ లేఖ సమర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు టీమ్ విలీనం చెల్లదన్నారు. విలీనం అంటే మొత్తం పార్టీ విలీనం కావాల్సిందేనని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. -
టీఆర్ఎస్ లో విలీనం చేయండి: ఎర్రబెల్లి
హైదరాబాద్: తమను టీఆర్ఎస్ లో విలీనం చేయాలని టీడీపీ నుంచి 'గులాబీ' దళంలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని కోరారు. ఈ మేరకు ఎర్రబెల్లి దయాకరరావు శుక్రవారం స్పీకర్ కు లేఖ రాశారు. టీఆర్ఎస్ లో విలీనం కావడానికి 10 మంది ఎమ్మెల్యేలు అంగీరించారని వెల్లడించారు. నిన్న టీఆర్ఎస్ కార్యాలయంలో తామందరం సమావేశమయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 4వ నిబంధన ప్రకారం తమ విలీనానికి అనుమతి ఇవ్వాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. శాసనసభలోనూ తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని లేఖలో కోరారు. స్పీకర్ కు రాసిన లేఖలో తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు, సాయన్న, ప్రకాశ్ గౌడ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాధవం కృష్ణారావు, కేవీ వివేకానంద గౌడ్, ధర్మారెడ్డి, రాజేందర్ రెడ్డి సంతకాలు చేశారు.