-
లావుకు చుక్కలు చూపిస్తున్నారు!
చంద్రబాబు జిత్తుల గురించి తెలుసుకోకుండా టీడీపీలో చేరినందుకు లావు శ్రీకృష్ణదేవరాయలకు ఇపుడు చుక్కలు కనపడుతున్నాయి. అంతే కాదు కృష్ణదేవరాయాలను నమ్ముకుని టీడీపీలో చేరిన నేతలు తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని ఉస్సూరు మంటున్నారు. టీడీపీలో చేరే ముందు కొన్ని నియోజక వర్గాల అభ్యర్ధులను మార్చేయాలని కూడా కృష్ణ దేవరాయాలు షరతు విధించారట. ఇపుడా అభ్యర్ధులంతా కృష్ణ దేవరాయలు ఎలా గెలుస్తారో తామూ చూస్తాం అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. వాపును చూసి బలుపనుకున్న కృష్ణ దేవరాయలు కూడా ఇపుడు ఆత్మపరిశీలనలో పడ్డట్లు చెబుతున్నారు.2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనంలో నరసరావుపేట ఎంపీగా గెలిచారు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆ తర్వాత అయిదేళ్ల పాటు ఆయనకు పార్టీలో సముచిత ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ ఎన్నికల్లో సామాజిక సమీకరణల్లో భాగంగా నరసరావుపేట ఎంపీ స్థానం నుండి బీసీ అభ్యర్ధిని బరిలో దించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఆ క్రమంలో లావు కృష్ణ దేవరాయలకు గుంటూరు లోక్ సభ స్థానం ఇస్తామని చెప్పారు. అంతే వెంటనే చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లి కృష్ణ దేవరాయలు నరసరావు పేట లోక్ సభ టికెట్కు బేరం పెట్టారు.తనకు నరసరావుపేట సీటు ఇవ్వడంతో పాటు తాను చెప్పిన వారికి కొన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని.. తాను చెప్పిన స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులను మార్చాలని షరతు పెట్టారట. తాను టీడీపీలోకి వెళ్తూ తనతో పాటు వైఎస్సార్సీపీలోని తన అనుచరులు మక్కెన మల్లికార్జున రావు,జంగా కృష్ణమూర్తిని కూడా టీడీపీలో చేర్పించారు. గురజాల అసెంబ్లీ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేనిని తప్పించి ఆ సీటును జంగాకృష్ణమూర్తికి ఇవ్వాలని లావు డిమాండ్ చేశారు. వినుకొండ అసెంబ్లీ స్థానంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును తప్పించి ఆ సీటును తన అనుచరుడు మక్కెన మల్లికార్జునరావుకు ఇవ్వాలని షరతు పెట్టారు. అంతే కాదు జీ.వి.ఆంజనేయులును నరసరావు పేటకు బదలీ చేయాలని సలహా కూడా ఇచ్చారు.నరసరావు పేటలో మాజీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుకు టికెట్ ఇవ్వకూడదని పట్టుబట్టారు లావు. అంతే కాదు చిలకలూరి పేట సీటును మాజీ మంత్రి పత్తి పాటి పుల్లారావుకు ఇవ్వద్దని అన్నారట. పెదకూర పాడు సీటును కొమ్మాల పాటి శ్రీధర్ కు కాకుండా వేరే వారికి ఇవ్వాలని సూచించారు. తాను సూచించిన విధంగా అభ్యర్ధులను,నియోజక వర్గాలను మార్చి తన అనుచరులక తాను అడిగిన సీట్లు ఇస్తేనే తాను పార్టీలో చేరతానన్నారట లావు. అన్నీ విన్న చంద్రబాబు నీకెలా కావాలంటే అలాగే చేద్దాం ముందు చేరు అన్నారు. తీరా చేరాక తాను అనుకున్న విధంగా టికెట్లు ఇచ్చుకుంటూ పోయారు. లావు అనుచరులు మక్కెన మల్లికార్జున రావు, జంగా కృష్ణమూర్తిలకు టికెట్లు దక్కలేదు.లావు మార్చమన్న పత్తిపాటి, చదలవాడ అరవింద్,జి.వి.ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాస్లకు టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. దీంతో ఇపుడు లావు కృష్ణదేవరాయలు ఎదురీదాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తమ స్థానాలకే ఎసరు పెట్టాలనుకున్న లావును ఓడించి తీరాలని పత్తిపాటి, చదలవాడ, యరపతినేని, జి.వి.ఆంజనేయులు, కొమ్మాల పాటి శ్రీధర్ శపథాలు చేస్తున్నారు. యరపతినేని అయితే బాహాటంగానే లావు ఎలా గెలుస్తాడో నేనూ చూస్తాను అని సవాల్ చేశారట.ఈ నియోజక వర్గాల్లో లావు ఎన్నికల ప్రచారం చేసినా ఈ నేతలెవరూ ఆయనకు సహకరించడానికి సిద్దంగా లేరు. ఈ ఎన్నికల్లో తమ తమ నియోజక వర్గాల్లో క్రాస్ ఓటింగ్ చేయించి అయినా లావును ఓడిస్తామని వీరు అంటున్నారట. చదలవాడకు టికెట్ ఇవ్వద్దని అనడంతో బీసీ సంఘాల నేతలంతా లావుపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారట. మొత్తం మీద వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి అనవసరంగా టీడీపీలోకి వచ్చానని లావు ఇపుడు తన సన్నిహిత వర్గాలతో అంటున్నారట. తాను చెడ్డమే కాకుండా తన అనుచరులు మక్కెన, జంగా కృష్ణమూర్తిల భవిష్యత్తు కూడా నాశనం చేశారని లావుపై జంగా వర్గీయులు మండి పడుతున్నారని సమాచారం. బహుశా ఈ పరిణామాలన్ని చూసేనేమో.. ఆయన ఏపీలో టీడీపీ గెలుపు కష్టమేనంటూ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. -
బీసీలకు దేశం ఝలక్ !
సాక్షి, నరసరావుపేట: దశాబ్దాలుగా బీసీల పార్టీ అని చెప్పుకుంటూ వారిని కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుంటున్న టీడీపీ మరోసారి బడుగు, బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచింది. బీసీ జనాభా అధికంగా ఉన్న నరసరావుపేటలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అగ్రవర్ణ కులాల వారే ఎంపీలుగా గెలుపొందుతున్నారు. అయితే బీసీలకు రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పరంపరను మార్చేందుకు ఈ దఫా వైఎస్సార్ సీపీ తరఫున నరసరావుపేట లోకసభ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ అనిల్కుమార్యాదవ్ను పోటీలో నిలిపారు. ఈ మంచి ఆలోచనను ప్రశంసించిన బీసీ సంఘాలు టీడీపీ సైతం బీసీ అభ్యర్థిని పోటీలో ఉంచాలని కోరాయి. అయితే పెత్తందారుల ప్రతినిధిగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు వారి డిమాండ్ను పక్కనపెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన లావు శ్రీకృష్ణదేవరాయులును ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించారు. దీనిపై బీసీలు తీవ్రంగా మండిపడుతున్నారు. సీట్ల కేటాయింపులో బీసీలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని, ఈ ఎన్నికల్లో ఓటుతో బాబుకు బుద్ధి చెబుతామంటున్నారు. లావు వ్యతిరేకించినా చదలవాడకే .. పల్నాడు జిల్లాలో పెండింగ్లో ఉన్న నరసరావుపేట అసెంబ్లీ సీటును ఎట్టకేలకు చదలవాడ అరవింద్బాబుకు శుక్రవారం టీడీపీ అధిష్టానం కేటాయించింది. ఈ సీటు కోసం పోటీ పడిన కడియాల, నల్లపాటి వర్గాలు ఈ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 30 వేలకుపైగా ఓట్ల తేడాతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఓడిన వ్యక్తిని మళ్లీ బరిలోకి దింపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పేట టికెట్ హామీతోనే టీడీపీలోకి వెళ్తున్నాను అంటూ ప్రచారం చేసుకున్న వైఎస్సార్ సీపీ బహిష్కృత నేత అట్ల చినవెంకటరెడ్డికి చంద్రబాబు మొండిచేయి చూపారు. చదలవాడ అరవింద్కు టికెట్ ఇవ్వడానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. తను పోటీలో ఉంటే సరైన పోటీ ఇవ్వలేమని, ఒకటి రెండు పేర్లు సూచించారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే లావు తీరుకు వ్యతిరేకంగా రెండు రోజుల కిందట మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పులిమి వెంకటరామిరెడ్డి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లావు, చదలవాడ వర్గాల మధ్య వైరం మరింత పెరిగింది. పురుగుమందు తాగిన వెంకటరామిరెడ్డిని ఎంపీ లావు కనీసం పరామర్శించలేదని, మా ఓట్లు మీకు అవసరం లేదా అని చదలవాడ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. యాదవ వర్గానికి మొండిచేయి... నరసరావుపేట అసెంబ్లీ నుంచి యాదవ సామాజిక వర్గ నేతను పోటీలో ఉంచుతామని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఆ స్థానం నుంచి జంగా కృష్ణమూర్తిని బరిలో దింపాలని లావు శ్రీకృష్ణ ప్రయత్నించారు. మరో ఎన్ఆర్ఐ నేత పేరును పరిశీలించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక నేతకు టికెట్ ఇవ్వాలని ఆ వర్గం డిమాండ్ చేసింది. అయితే శుక్రవారం ప్రకటించిన జాబితాలో యాదవ నేత పేరు లేకపోవడంతో ఆ వర్గం తీవ్ర నిరాశకు లోనైంది. గురజాల, నరసరావుపేటలలో ఏదో ఒక చోట టికెట్ ఇస్తామని ఆశ చూపి చివరకు మొండిచేయి చూపారని, రానున్న ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. -
టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం
-
ఇస్రోలో నారీశక్తి అభినందనీయం : శ్రీకృష్ణదేవరాయలు
-
బర్త్డే కేక్లా రాష్ట్ర విభజన
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ లబ్ధి కోసం బర్త్డే కేక్లా రాష్ట్రాన్ని విభజించారని లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీలు విమర్శించారు. అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించడమే కాకుండా తొమ్మిదో బడ్జెట్లోనూ రాష్ట్రంపై సవతి ప్రేమే చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం లోక్సభలో బడ్జెట్ పద్దులపై వైఎస్సార్సీపీ తరఫున చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ మాట్లాడారు. సంఖ్యా పరంగా ఏపీ నుంచి 25 మంది ఎంపీలు మాత్రమే ఉన్నా ప్రత్యేకహోదా విషయంలో గట్టిగా గళం వినిపిస్తామని తేల్చిచెప్పారు. విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. పార్లమెంటు వేదికగా నాటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం ఏపీలో తగిన సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. రాముడు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు భరతుడు మాదిరిగా ప్రధాని మోదీ ఏపీని భుజాలకు ఎత్తుకోవాలని పేర్కొన్నారు. ఆ సమయంలో సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ జోక్యం చేసుకొని మీరు భరతుడే కదా అని చమత్కరించారు. తొమ్మిదేళ్లు అయినా రైల్వే జోన్ కూడా ఏం పూర్తికాలేదని భరత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా రూ.55 వేల కోట్లను ఆమోదించడం లేదని అన్నారు. విశాఖ, విజయవాడలకు మెట్రో ప్రాజెక్టులు ఇవ్వండి ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో పోటీ పడేలా విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం వంటివి తయారు కావాలని ఎంపీ భరత్ పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయవాడలకు మెట్రో ప్రాజెక్టులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. హోదా ప్రకటించినా దాని ఊసే లేదు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ విభజన అనంతరం ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించారని కానీ ప్రస్తుతం ఆ ఊసే లేదన్నారు. 1950ల్లో తగిన సాంకేతికత లేకున్నా నాగార్జునసాగర్ కట్టారని.. ఆ ప్రాజెక్టుకు పట్టిన సమయం కన్నా పోలవరం ప్రాజెక్టుకు ఎక్కువ సమయం పడుతోందన్నారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వాల్సిన రూ.6,800 కోట్లు విద్యుత్ బకాయిల సమస్యను పరిష్కరించాలన్నారు. ఏపీలో వైద్య కళాశాలలకు కేంద్రం సహకారం అందించాలని విన్నవించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే యోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement