-
పగులుతున్న అవినీతి పుట్ట
-
వివాహిత దారుణహత్య
కుప్పం రూరల్, న్యూస్లైన్: కడ వరకు కాపాడుకుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే కాలయముడయ్యాడు. వివాహేతర సంబంధం మోజులో పడి భార్యను కడ తేర్చేందుకు పథకం పన్నాడు. స్నేహితుని సాయంతో భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఈ హత్యా నేరం నుంచి తప్పించుకునేందుకు విఫలయత్నం చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన కుప్పం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..చందం పంచాయతీ కొత్తఇండ్లు గ్రావూనికి చెందిన చంద్రకళ (28)కు దళావారుు కొత్తపల్లె వాసి బాలాజీ(34)తో 2001 లో వివాహమైంది. వీరి పిల్లలు భార్గవ్(7), నిహారిక(4). బాలాజీ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో భార్యను మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడైన ప్రభాకర్తో కలసి పథకం పన్నాడు. నూలుకుంట గ్రావుం వద్దనున్న సుబ్రవుణ్య స్వామి ఆలయంలో పూజలు చేస్తే దంపతుల మధ్య కలతలు తీరుతాయని నమ్మిం చాడు. బాలాజీ, ప్రభాకర్ గురువారం ఉదయం చంద్రకళను ఇండిక కారు (ఏపీ02క్యూ4999)లో దేవాలయుం వద్దనున్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. పూజ కోసమంటూ చంద్రకళ కళ్లకు గంతలు కట్టారు. ఆపై రాళ్లు, దుడ్డుకర్రలతో అతికిరాతకంగా దాడి చేసి చంపారు. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని పథకం పన్నారు. వుృతదేహాన్ని కారులో తీసుకుని కుప్పం-క్రిష్ణగిరి జాతీయు రహదారిపై వచ్చారు. అయితే పగటి పూట ట్రాఫిక్ అధికంగా ఉండడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. కుప్పం నుంచి తమిళనాడులోని వేపనపల్లెకు వెళ్లే దారిలోనున్న అటవీ ప్రాంతంలో చంద్రకళ మృతదేహాన్ని దాచారు. చంద్రకళ కనబడడం లేదంటూ ఆమె బంధువులకు గురువారం సాయంత్రం సమాచారమిచ్చారు. దీంతో బంధువులు బాలాజీ ఇంటికి వచ్చి నిలదీ శారు. వీరిపై బాలాజీ, అతని స్నేహితులు దాడి చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు 24 గంటల వ్యవధిలో కేసును ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసును మరింత లోతుగా విచారించాల్సి ఉందని సీఐ రాజగోపాల్రెడ్డి, ఎస్ఐ గంగిరెడ్డి తెలిపారు. -
బాబు సమైక్యవాదా... తెలంగాణవాదా?
=ప్రజా సమస్యలు పట్టని మాజీ సీఎం =కుప్పం ప్రజలనే మోసం చేస్తున్నారు =వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి విమర్శ కుప్పం, న్యూస్లైన్: తొమ్మిదేళ్లు వుుఖ్యవుంత్రిగా, వురో తొమ్మిదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏనాడైనా ప్రజల గురించి పట్టించుకున్నారా ? అని వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా నియోజకవర్గ కన్వీనర్ నారాయణస్వామి ప్రశ్నించారు. ప్రజాసమస్యల గురించి ఆయన ఏనాడూ పట్టించుకోలేదని చెప్పారు. బీసీలు అధికంగా ఉన్న కుప్పం ప్రాంతంలో వారిని నమ్మించి మోసం చేస్తూ పబ్బం గడిపేస్తున్నారని వివుర్శించారు. ఈ నెల 30న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పంలో ప్రారంభించనున్న సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ఏర్పాట్లలో భాగంగా బుధవారం ఇక్కడి వాణి మహల్లో ఆ పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ కుప్పం నియోజకవర్గ సవున్వయుకర్గ సుబ్రవుణ్యంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నారాయణస్వామి మాట్లాడుతూ బాబు సమైక్యవాదా... లేక తెలంగాణ వాదో స్పష్టం చేయూలని డిమాండ్ చేశారు. జగన్మోహన్రెడ్డిని విమర్శించడం ఆయనకు అలవాటుగా మారిందని చెప్పారు. శంఖారావం సభను విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. పార్టీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి వూట్లాడుతూ రాష్ట్ర విభజనతో భావితరాల భవిష్యత్తు నాశవువుతుందని తెలిసినా చంద్రబాబుకు పట్టడం లేదని ధ్వజమెత్తారు. సుబ్రవుణ్యంరెడ్డి వూట్లాడుతూ సమైక్య శంఖారావాన్ని కుప్పం నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వూట్లాడుతూ 25 సంవత్సరాలుగా శాసన సభ్యుడిగా ఉన్న చంద్రబాబు వల్ల కుప్పంలో పాపాలు పెరిగాయుని, వాటిని తుడిచిపెట్టేందుకు జగన్మోహన్రెడ్డి ఇక్కడి నుంచే యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. కుప్పాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. రాజకీయు శక్తిగా వస్తున్న జగన్ను ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. కుప్పంలో అడ్డుకుంటే బాబును మిగిలిన ఏ ప్రాంతంలోనూ తిరగనివ్వవుని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు బాబు చేస్తున్న రాజకీయూలకు కుప్పం ప్రజలు సమాధానం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కుప్పం ప్రాంతంలో 25 వేల రేషన్ కార్డులు, 10 వేల పింఛన్లు ఇచ్చిన ఘనత వైఎస్.రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. 1999లో ఉచిత విద్యుత్ విషయాన్ని కుప్పంలో జరిగిన సభలోనే మొదటిసారిగా ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో రెండు లక్షల మంది జనాభా ఉంటే అందరూ సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని, వారి ఓట్లతో గెలుపొందిన బాబు మాత్రమే ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని అన్నారు. పార్టీ పలవునేరు నియోజకవర్గ సవున్వయుకర్త అవురనాథరెడ్డి వూట్లాడుతూ రాష్ట్ర విభజనకు మూలం చంద్రబాబేనన్నారు. కుప్పం ప్రాంతంలో వెరుు్య బ్యాలెట్లను ఉంచి సమైక్యాంధ్ర, విభజనపై ఓటింగ్ పెడితే 999 వుంది సమైక్యాంధ్రకే మొగ్గుచూపుతారని తెలిపారు. పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గ సవున్వయుకర్త ప్రవీణ్కువూర్రెడ్డి వూట్లాడుతూ చంద్రబాబు తెలుగుజాతిని విడదీసి ద్రోహుడయ్యారని విరుచుకుపడ్డారు. 2014 తర్వాత టీడీపీ కనుమరుగుకావడం ఖాయమన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కుప్పంలో అభివృద్ధి చేసి సత్తాచాటుకుంటామన్నారు. ఎమ్మె ల్సీ తిప్పారెడ్డి వూట్లాడుతూ తెలుగుజాతిని సోనియూ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అన్నారు. పార్టీ పీలేరు సవున్వయుకర్త చింతల రావుచంద్రారెడ్డి వూట్లాడుతూ అందరి చూపూ సమైక్య శంఖారావం సభ వైపే ఉందన్నారు. పార్టీ సత్యవేడు, మదనపల్లె ని యోజకవర్గాల సమన్వయకర్తలు ఆదివుూలం, షమీమ్ అస్లాం, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయుత్రిదేవీ, అధికార ప్రతినిధి తలపులపల్లె బాబురెడ్డి పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement