breaking news
Krishna Janmashtami celebrations
-
జన్మాష్టమి ఎలా ఆచరించాలి? శ్రీకృష్ణుని అవతార లక్ష్యం
శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన దివ్య ధామం నుండి భూమిపై అవతరించిన పవిత్రమైన రోజు. ఈ పండుగను శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి నాడు జరుపుకుంటారు. భగవంతుని అలౌకికమైన ఆవిర్భావం, దివ్య లీలలను అర్థం చేసుకోవడం ద్వారా జీవులు ముక్తిని పొంది, భగవద్దామాన్ని చేరగలరని భగవద్గీత బోధిస్తోంది. శ్రీ కృష్ణుడి జననం మానవ జీవిత సార్థకతకు అవసరమైన అనేక వరాలను లోకానికి అందించింది. మధురలోని కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులకు చతుర్భుజ విష్ణువుగా అవతరించటం, ఆపై సామాన్య బాలకుడిగా రూపాంతరం చెందటం, పసిపిల్లాడిగానే అనేక అసురులను మట్టుపెట్టడం, చిటికెన వ్రేలుతో గోవర్ధన గిరిని ఎత్తి పట్టడం తదితర అసాధారణమైన లీలలన్నీ శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని చాటిచెబుతున్నవే.శ్రీకృష్ణుని అవతార లక్ష్యంశ్రీకృష్ణుని జననం సాధారణ శిశువుల వలె సంభవించినది కాదు. వాస్తవానికి ఆయన పుట్టుక లేనివాడైనప్పటికీ, తన అంతరంగిక శక్తిచేతనే ఈ లోకాన అవతరించి మన మధ్య జన్మించడం ఆయన దివ్య లీలల్లో ఒకటి. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి, ధర్మాన్ని పునఃస్థాపించడం వారి అవతార ప్రయోజనాలలో మరొకటి. మనమంతా ఈ భౌతిక దేహాలు కాదని, శాశ్వత ఆత్మ స్వరూపులమని, నిరంతర ఆనందం మన సహజ స్థితి అని తెలుపుతూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అందించిన సందేశం మన సనాతన సంస్కృతికి మూల స్థంభం. మానవ జన్మకు అంతిమ లక్ష్యం భగవంతునితో మన ప్రేమపూర్వక సంబంధాన్ని పునరుద్ధరించుకోవడమే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవాళికి అందించిన పరమ సందేశం "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" (సమస్త ధర్మాలను త్యజించి నన్నే శరణు పొందుము). ఇది మోక్షాన్ని పొందే అత్యంత సరళమైన మార్గం.జన్మాష్టమిని ఎలా ఆచరించాలి?కృష్ణాష్టమి నాడు భక్తులు అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉంటారు. ఆరోగ్యం సహకరించనివారు పండ్లు, పాలు వంటి అనుకల్ప ప్రసాదం తీసుకోవచ్చు. మీకు సమీపంలోని శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుని సేవల్లో పాల్గొనండి. ముఖ్యంగా, ఆ రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం (కనీసం 108 సార్లు) చాలా శ్రేష్ఠం. పలు కారణాల రీత్యా దేవాలయానికి వెళ్లలేని భక్తులు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా శ్రీకృష్ణుని కృపను పొందగలరు. ఈ కలియుగంలో శ్రీకృష్ణుడు తన నామ రూపంలో అవతరించి వున్నారు. హరే కృష్ణ మహామంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించి శ్రద్ధగా వినడం ద్వారా హృదయంలోని కల్మషాలు తొలగి, భగవత్ప్రేమ పెంపొంది, ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించగలము. ఈ రోజు భగవద్గీత, శ్రీమద్భాగవతం వంటి గ్రంథాల నుండి శ్రీకృష్ణుని లీలలు, ఉపదేశాలను పఠించడం పుణ్యప్రదం.విశ్వవ్యాప్తమైన శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమిని విశ్వవ్యాప్త పండుగగా నిలపడంలో ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల కృషి అపారం. 70 ఏళ్ల వయసులో తమ గురువు ఆదేశంతో పాశాత్య దేశాలకు వెళ్లి భగవద్గీత బోధనలను, పవిత్ర కృష్ణ నామాన్ని వ్యాప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా 108 దేవాలయాలను స్థాపించి, జగన్నాథ రథయాత్రలను ప్రారంభించారు. 70కి పైగా గ్రంథాలను రచించి, వాటిని 25కు పైగా భాషల్లోకి అనువదించి పంపిణీ చేశారు. సామాన్య జీవన శైలితో అత్యున్నత తాత్త్విక చింతనను గలిగి జీవించే విధానాన్ని బోధించి ఎందరో శిష్యులకు మార్గనిర్దేశం చేశారు. యుగధర్మమైన హరినామ సంకీర్తనను ప్రపంచంలోని నగర గ్రామాలకూ వ్యాప్తి గావించి శ్రీచైతన్య మహాప్రభువుల భవిష్యవాణిని సార్థకం చేసిన మహనీయులు భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద.హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరేహరే రామ హరే రామ రామ రామ హరే హరేహరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో కృష్ణాష్టమి వేడుకలుహరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, బంజారా హిల్స్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతాయి. భక్తులు రాధా గోవిందుల దర్శనం చేసుకోవచ్చు, చిన్ని కృష్ణుడిని ఉయ్యాలలో ఊపవచ్చు (ఊంజల సేవ). భగవన్నామ జపం చేయటం, నామ సంకీర్తనల్లో పాల్గొనడం, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ద్వారా దివ్య అనుభూతిని పొందవచ్చు. ఈ రోజు దేవాలయంలో వేలాది మందికి ఉచిత అన్నదానం కూడా నిర్వహిస్తారు. అంతేగాక ఈ ఏడాది నార్సింగిలో నిర్మితమవుతున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్, మరియు కందిలోని హరే కృష్ణ కల్చరల్ సెంటర్ వద్ద కూడా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించబడతాయి.భక్తులందరూ కుటుంబంతో సహా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయం ఆహ్వానిస్తోంది. పాఠకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! హరే కృష్ణ.-శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ ఎం.టెక్ (ఐఐటి మద్రాస్) అధ్యక్షులు, హరే కృష్ణ మూవ్మెంట్ – హైదరాబాద్ -
కృష్ణాష్టమి వేడుకలు.. రాధా కృష్ణుడి వేషాల్లో అలరించిన చిన్నారులు (ఫొటోలు)
-
చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..
కృష్ణాష్టమి వస్తోందంటే చాలు.. దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. మరీ ఈ పర్వదినం రోజున చిన్ని కృష్ణయ్యకు సమర్పించే నైవేద్యాలు ఏంటీ..? ఎలాంటి పదార్థాలు నివేదిస్తారు వంటి వాటి గురించి సవివరంగా చూద్దాం..!.ఈ పర్వదినం పురస్కరించుకుని వీధుల్లో జరిగే ఉట్టికొట్టే వేడుకు కోసం వేలాదిగా ప్రజలు గుమిగూడతారు. చిన్న పెద్దా అనే తారతమ్యం లేకుండా అంతా ఈ వేడుకలో పాల్గొంటారు. మరీ ఈ వేళ చిన్ని కన్నయ్యకి సమర్పించే సంప్రదాయ వంటకాలేంటంటే..చప్పన్ భోగ్ విందు ఏర్పాటు చేస్తారు. ఇది ప్రజలంతా భక్తితో సమర్పించే గొప్ప విందు. ఈ చప్పన భోగ్ విందు సంప్రదాయం ఎలా వచ్చిందంటే..చప్పన్ భోగ్ వెనుక స్టోరీ..ఉత్తర ప్రదేశ్లో మధుర శ్రీ కృష్ణుడు నడయాడిన ప్రదేశం ఉందని తెలుస. అక్కడ బృందావనంలో కృష్ణుడి పెరిగినట్లుగా మనం పురాణల్లో విన్నాం. అక్కడ బృందావన్లో ప్రజలు అంతా ముద్దుల కృష్ణయ్య, కన్నయ్య అనే పిలుచుకునేవారు. యశోదమ్మ కృష్ణుడికి చేసిన గారాభం కారణంగా అందరిని ఆటపట్టిస్తూ తుంటరిగా ఉండేవాడు. అంతా.. అమ్మ యశోదమ్మ నీ కృష్ణుని అల్లరి భరించలేకపోతున్నాం అని ఫిర్యాదులు చేస్తే తిరిగి వాళ్లదే తప్పు అన్నట్లు మందలించే యశోదమ్మ కృష్ణ ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే. అయితే ఒకరోజు బృందావనంలోని ప్రజలంతా ఇంద్రుడిని ఆరాధించే నిమత్తం చప్పన్ భోగ్ కార్యక్రమానికి సన్నహాం చేస్తున్నారు. దీన్ని చూసిన చిన్ని కృష్ణుడు తన తండ్రి నందుడుని ఏంటీ వేడుక? ఎందుకు చేస్తున్నాం అని అడగగా..వర్షాలు బాగా పడేలా ఇంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు చేస్తున్న పూజ అని చెబుతాడు. వెంటనే కృష్ణుడు ఇంద్రుడికి బదులుగా పండ్లు, కూరగాయాలు, జంతువులకు మేత అందించే గోవర్థన గిరిని పూజించాలని అంటారు. అందుకు గ్రామస్తులు అంగీకరించి గోవర్థన గిరికి పూజ చేస్తారు. దీంతో ఇంద్రుడు కోపంతో ఏకథాటిగా ఎనిమిది రోజులు కుండపోత వర్షం కురిపిస్తాడు. అప్పుడు కృష్ణుడు బృందావన ప్రజలను గోవర్థన గిరి వద్దకు వచ్చి తలదాచుకోవాల్సిందిగా చెప్పి ఆ పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఉంచి రక్షించాడు. ఆయన వారందర్నీ రక్షించేందుకు ఎనిమిది రోజులగా నిరాహారంగా ఉండిపోతాడు. అన్ని రోజుల తమ కోసం తినకుండా సంరక్షించిన ఆ జగన్నాథుడికి కృతజ్ఞతగా ఈ చప్పన్ భోగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు బృందావన ప్రజలు. అప్పటి నుంచి కృష్ణుడికి ఇష్టమైన ఆహారాలతో భారీ విందు ఏర్పాటు చేయడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. అలాగే యశోదమ్మను కృష్ణుడు ఇష్టంగా ఏం తింటాడని అడిగిమరీ వండి నివేదించడం జరిగిందని పురాణ వచనం. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. ఈ చప్పన భోగ్లో మొత్తం 56 రకాల ఆహారాలను సిద్ధం చేస్తారు. ఇందులో వివిధ రుచులతో కూడిన ఆహార పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా చేదు, ఘాటు, పులుపుతో కూడిన వంటకాల నుంచి మొదలై, తీపి వంటకాలతో ముగుస్తుంది. ఇందులో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పాలు, మీగడ, పెరుగుకి సంబంధించిన వివిధ తీపి వంటకాలు కూడా ఉంటాయి. (చదవండి: కృష్ణుడి అనుగ్రహం పొందాలంటే..ఆ ఆరింటిని..!) -
హైదరాబాద్ లో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
-
కృష్ణుడి అనుగ్రహం పొందాలంటే..ఆ ఆరింటిని..!
దేవుళ్ల అందరిలోనూ ప్రత్యేక విలక్షణమూర్తి శ్రీకృష్ణుడు!. ఆయన బాల్యం- లీలా మాధుర్యానికి ఆట పట్టు, అనంత దార్శనిక సూత్రాల తేనెపట్టు. ఆయన శృంగార మహత్వం- లౌకిక దృష్టికి సమ్మోహనం, అలౌకిక దృష్టికి విలక్షణం. ఒకరకంగా గొప్ప రాజనీతిజ్ఞుడు. మరో కోణంలో మహా విషాద నాయకుడు ఇలా ఇద్దరు కృష్ణుడిలో తారసపడతారు. ముఖ్యంగా అరిషడ్వర్గాలను- మోక్షమార్గాలుగానూ, స్వర్గద్వారాలుగానూ అద్భుతంగా నిరూపించాడాయన. ఆ వైవిధ్య స్వభావం గురించి భాగవతం సప్తమ స్కంధంలో నారద మహర్షి విశేషంగా వర్ణించాడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు తలలతో మన మానస్సు అనే సరోవరాన్ని అను నిత్యం కలవరపరుస్తుంటుంది. అవే మన లోపలి శత్రుకూటమి. దాన్ని సమూలంగా తుద ముట్టించాలంటే, కోపం అనే ఘీంకారాన్ని విడిచిపెట్టి ఓంకారాన్ని అందుకుని గజేంద్ర మోకంలోని గజేంద్రుడిలా భగవంతుణ్ని ఆశ్రయించాలికృష్ణుడి ప్రత్యేకత ఏమంటే... ఆ ఆరింటినీ సాధనాలుగా మార్చు కొని, వాటి సాయంతోనూ తనను పొందవచ్చునని హామీ ఇచ్చాడాయన. కోరిక, కోపం, భయం, భక్తి, అనురక్తి, ఆసక్తి, ద్వేషం, స్నేహం... చివరకు శత్రుత్వంతో సైతం శ్రీకృష్ణుణ్ని తమవాణ్ని చేసుకోని పొందొచ్చ్చని భాగవతం నిరూపించింది. అలా ఎవరెవరు ఏయే మార్గాల్లో ఆయనకు దగ్గరయ్యారో నారదుడు వర్ణించి చెప్పాడు కూడా. దారి ఏదైనా గమ్యం ఒక్కటే అన్నాడాయన ధర్మరాజుతో. అదెలా అంటే..మనం చెప్పుకొన్న శత్రువర్గంలో కామం మొదటిది. దాని ద్వారానే గోపికలు హరిని సొంతం చేసుకొన్నారు. కామం అంటే కోరిక ఆసక్తి అనురక్తి... తనకు దక్కాలనే తహతహ. ధర్మా ర్థకామమోక్షాలనే నాలుగు రకాల పురుషార్థాలకు సంబంధించి- కామంలోని నాలుగు కోణాలను భరతముని తన నాట్యశాస్త్రంలో విశ్లేషించాడు. గోపికలది మధురభక్తికి చెందిన కామం. మోక్ష కాంక్షలోంచి ఉప్పొంగిందది. కాబట్టి వారిది 'మోక్ష సంబంధి శృంగారం' అన్నారు పెద్దలు. భరతుడి వివరణలోని మోక్షకామానికి సరైన ఉదాహ రణ గోపికల కామం.'కోరికతో గోపికలు, భయం చేత కంసుడు, అసూయాద్వేషాలతో శిశు పాలాదులు, చుట్టరికం రీత్యా యాదవులు, ప్రేమాభిమానాల మూలంగా పాండవులు, భక్తి కారణంగా ముని జనులు శ్రీకృష్ణుడికి చేరువ అయ్యారు' అన్నది నారదమహర్షి విశ్లేషణ. ఇదేవిధంగా ఇకృష్ణుడు చెప్పిన మోక్ష మార్గాలు..ఇంతమందిని ఇన్ని రకాలుగా ఉద్దరించిన కృష్ణుడి జీవితం మాత్రం ఎంతో విచిత్ర మైనది. కళ్లు తెరిచింది- కటకటాల్లో. ఊపిరి పీల్చింది అపాయాల్లో. బతుకు గడిచింది- గండాల్లో. చివరకు ఆయన చరమదశా- పరమ దారుణం. తన కళ్లముందే తన వారంతా ఒకళ్లనొకళ్లు చంపుకొని దుర్మరణం పాలవుతుంటే- కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలి బొటనవేలికి వేటగాడి బాణం నాటుకుని బొట్టుబొట్టుగా నెత్తురు స్రవించి మనుగడ కడతేరిపోవడమంటే- ఎంత విషాదకరమైన ముగింపు!. ఏమనాలి ఆయన జీవితాన్ని?.ఇది అద్భుతమా..!కృష్ణకథను చెబుతూ వ్యాసమహర్షి 'అద్భుతం' అనే పదాన్ని ప్రయోగించారంటే- ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? కృష్ణుడి పుట్టుక అద్భుతం. ఆయన లీలలు అద్భుతం. ఆయన బోధించిన భగవద్గీత పరమాద్భుతం. 'ధర్మం' అనే పదానికి రూపం వస్తే రాముడైనట్లు- అద్భుతం అనే భావానికి ప్రాణం పోస్తే- అది కృష్ణుడు. ఎంత చక్కగా ఆయన జీవిత కథ జీవిత పరమార్థాన్ని విశదరపరుస్తుంది. భగవంతుడు సైతం మనిషిగా పుట్టినప్పుడూ కష్టాలు అనుభవించక తప్పదని, ఉన్నత, పతన స్థితుల కలబోత అనే ఆయనే స్వయంగా అవతారం ఎత్తి చూపించాడు. సో కష్టాలకు కలవరపడొద్దు, ఆ జగన్నాథుడైన శ్రీ కృష్ణ పరమాత్మ మీద భారం వేసి నిశ్చింతగా జీవించి సుఖమయ జీవితాన్ని పొందుదాం. (చదవండి: వరలక్ష్మీ వ్రతం ప్రాశస్త్యం? ఈజీగా చేసుకోవాలంటే..?) -
నిజామాబాద్ జిల్లా మిట్టపల్లి గోకులాష్టమి వేడుకల్లో అపశృతి
-
ఎస్వీ గోసంరక్షణశాలలో వైభవోపేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
సాక్షి, తిరుపతి జిల్లా: తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్కు పూర్ణకుంభ స్వాగతం పలికిన అధికారులు.. శ్రీ వేణుగోపాల స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేపట్టారు. భూమన కరుణాకర రెడ్డికి అర్చకులు సంప్రదాయంగా తలపాగా చుట్టారు. గోపూజ, గోప్రదర్శనం చేసుకున్న తర్వాత పాలుపితికి, గోవులకు దాణా అందించారు టీటీడీ చైనర్మన్. అనంతరం శ్రీ వేంకటేశ్వర దివ్య మహావృత స్థూపం వద్ద నిర్వహించిన పూర్ణాహుతిలో పాల్గొన్నారు. టీటీడీ తరఫున చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రజలందరికీ గోకులాష్టమి శుభాభినందనలు తెలియశారు. పరమ పూజ్యమైన పండగ గోకులాష్టమి రోజున టీటీడీ గో సంరక్షణ శాలలో గోకులాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయని తెలిపారు. గోకులాష్టమి వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతోందన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా సాహ్నివాల్ జాతి గోవును టీటీడీ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల ముందే 40 కోట్ల రూపాయల గ్రాంట్ను గోశాలకు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. చదవండి: తిరుమల ఆలయంపై విమాన సంచారం.. టీటీడీ సీరియస్ సనాతన భారతదేశంలో గాటికి ఆవు లేని ఇల్లు లేనేలేదు. అంతటి పరమ పవిత్రంగా కొలిచే హిందువులకు గోకులాష్టమి అత్యంత ముఖ్యమైనది. గోవులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. నేను గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు వందేగోమాతరం పేరిట జాతీయ స్థాయిలో అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం జరిగింది. దానికి ఇద్దరు నోబుల్ లారెన్స్ కూడా రావడం జరిగింది. గోవులను రక్షించుకోవాలని, గోవులు ఉత్పత్తి చేసేపదార్థాల ద్వారా మన ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపతాయని వంటి అనేక రకాలుగా సెమినార్ అభిప్రాయాలు, సూచానలు వెల్లువెత్తాయి. రెండు రోజుల పాటు జరిగిన సెమినార్లో మేధావులంతా పెద్ద ఎత్తున చర్చించిన కారణంగా మంచి అవుట్ పుట్ వచ్చింది. ఆ తరహా కార్యక్రమాలు మున్ముందు కూడా కొనసాగిస్తాం. గోవు మనదరికీ పూజ్యనీయమైన తల్లి లాంటిది.’ అని భూమన పేర్కొన్నారు. -
సోషల్ మీడియాను షేక్ చేసిన బామ్మ.. వీడియో చూస్తే విజిల్ పడాల్సిందే..
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా, ఈ వేడుకల్లో భక్తులు భారీ రేంజ్లో దహీ హండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉట్టి కొట్టిన వారికి భారీ నజరానా సైతం ఉంటుంది. ఇక, దహీ హండీ వేడుకల్లో ఓ వృద్ధురాలు చేసిన ఫీట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ఉట్టి కొట్టిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. వీడియో ట్రెండింగ్లో నిలిచింది. అయితే, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ముంబైలో దహీ హండీ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) అధికారి దీపాన్ష్ కాబ్రా ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో కొందరు మహిళలు మానవ పిరమిడ్లో ఏర్పాడ్డారు. ఈ క్రమంలో మహిళలపైకి ఎక్కి ఓ వృద్ధురాలు దహీ హండీలో భాగంగా ఏర్పాటు చేసిన కుండను(ఉట్టి)ని తన తలతో బద్దలు కొట్టింది. అనంతరం ఎంతో సేఫ్గా కిందకు దిగింది. కాగా, ఈ వీడియోపై స్పందించిన దీపాన్ష్ కాబ్రా.. "ది ఇన్క్రెడిబుల్ దాదీ" అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వ్యూస్ పరంగా సునామీ సృష్టించింది. కొద్ది సమయంలోనే 1,87,000 కంటే ఎక్కువ వ్యూస్ను, దాదాపు 10,000 లైక్లను సాధించింది. వీడియో చూసిన నెటిజన్లు వృద్ధురాలిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. The Incredible Dadi! pic.twitter.com/QiwPHeYYUx — Dipanshu Kabra (@ipskabra) August 20, 2022 ఇది కూడా చదవండి: గేదె ముందు యువతి కుంగ్ఫూ స్టెప్పులు.. దెబ్బకు చిర్రెత్తడంతో.. -
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు..
-
నెల్లూరులో కృష్ణుడు విగ్రహాలు కొనుగోలు
-
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
-
రేపటి నుంచి గుట్టలో కృష్ణాష్టమి వేడుకలు
యాదాద్రి (నల్లగొండ) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటలకు గోశాలలో గోపూజ, సాయంత్రం 7గంటల నుంచి 9 గంటల వరకు శ్రీకృష్ణాష్టమి వేడుకలు, 7న ఉదయం నుంచి రాత్రి వరకు విశేష అభిషేకాలు, అర్చనలు, 8న సాయంత్రం 4.30 గంటలకు ఉట్ల ఉత్సవం , రుక్మిణీ కల్యాణం నిర్వహించనున్నట్లు వివరించారు.