breaking news
K.Palanisamy
-
పన్నీర్ కు మరో షాక్.. నలుగురిపై వేటు!
చెన్నై: సుప్రీంకోర్టు తీర్పుతో తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన శశికళ వర్గం.. ఆయనకు మరో షాకిచ్చింది. ఆయనకు మద్ధతిస్తున్న మరో నలుగురు నేతలపై పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్ కు గురైన వారిలో విద్యాశాఖ మంత్రి కె.పాండ్యరాజన్, సీనియర్ నేత సి.పొన్నేయన్ సహా సీహెచ్ పాండ్యన్, ఎన్ విశ్వనాథన్ ఉన్నారు. మహాబలిపురం సమీపంలోని కూవత్తూరులోని గోల్డెడ్ బే రిసార్టుకు వెళ్లి, ఆ నేతలను పన్నీర్ కు మద్ధతు తెలపాలని కోరాలని భావించారు. రిసార్టుకు వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను దెబ్బతీసెందుకు పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటేసినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పన్నీర్ సెల్వం వర్గంలో ఆయనతో కలిసి ప్రస్తుతం పది మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు (లోక్ సభ, రాజ్యసభ) ఉన్నారు. శశికళ వర్గం మాత్రం పన్నీర్ కు సీఎం కూర్చీ ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. అమ్మ జయలలిత ఆశయ సాధన కోసం పనిచేయాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పనులలో నిమగ్నమవ్వాలంటూ శశికళకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడయిన తర్వాత పన్నీర్ సెల్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై శశికళ వర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. మరోవైపు రిసార్టులో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలు శశికళ వర్గం తరఫున అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా రాష్ట్ర రహదారులు, ఓడ రేవుల మంత్రిగా ఉన్న కె.పళనిస్వామిని ఎన్నుకున్నారు. తమిళనాడు రాజకీయాలు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు నేనేంటో అసెంబ్లీలో చూపిస్తా: సెల్వం జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! గోల్డెన్ బే రిసార్ట్ వద్ద హైడ్రామా ఫుల్ జోష్గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు!
-
గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు!
చెన్నై: జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడైన తర్వాత తమిళ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శశికళ క్యాంపు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా కె.పళనిస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో పళనిస్వామి మీడియాతో మాట్లాడారు. 'పార్టీ శాసనసభాపక్ష నేతగా నేను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. నా ఎన్నిక గురించి గవర్నర్ కు సమాచారం అందించాను. నాకు 119 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని తెలియజేశాను. గవర్నర్ ను కలిసి మెజార్టీ ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నట్లు లేఖ సమర్పిస్తాను. పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించామని' పళనిస్వామి వివరించారు. గవర్నర్ నుంచి పిలుపు వస్తే మెజార్టీ ఎమ్మెల్యేలతో వెళ్లి కలువనున్నట్లు తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత సభలోనూ తన మెజార్టీ నిరూపించుకుంటానని ఆయన ధీమాగా ఉన్నారు. తంబిదురై, సెంగొట్టయన్ తాజాగా జయలలిత మేనళ్లుడు దీపక్ జయకుమార్ పేర్లు కూడా పరిశీలనలోకి రాగా చివరికి కె.పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర రహదారులు, ఓడ రేవుల మంత్రిగా ఉన్నారు. సేలం జిల్లా ఎడప్పాడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు పన్నీర్ కు శశికళ మరో షాక్! జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం?