breaking news
kp
-
కేపీఐ గ్రీన్కు ఎస్బీఐ నిధులు.. రూ. 3,200 కోట్లకు ఓకే
పీఎస్యూ దిగ్గజం ఎస్బీఐ నుంచి ఫైనాన్స్ సౌకర్యాన్ని పొందినట్లు పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ కేపీఐ గ్రీన్ ఎనర్జీ తాజాగా వెల్లడించింది. దీంతో ఎస్బీఐ నుంచి రూ. 3,200 కోట్ల రుణాన్ని అందుకోనున్నట్లు తెలియజేసింది. సోలార్, హైబ్రిడ్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ ప్రాజెక్టులకు ఎస్బీఐ రుణాలు సమకూర్చనున్నట్లు తెలియజేసింది.వీటిని గుజరాత్లో మొత్తం 1జీడబ్ల్యూపీ సామర్థ్యంతో ఏర్పాటు చేయనుంది. రెండు వ్యూహాత్మక పాజెక్టులకు ఈ రుణ సౌకర్యాలు మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. 250 మెగావాట్ల(ఏసీ), 350 ఎండబ్ల్యూపీ(డీసీ) సోలార్ పవర్ ప్రాజెక్టుతోపాటు.. 370 మెగావాట్ల హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టు వీటిలో ఉన్నాయి. -
కేపీ.. క్లీన్ స్వీప్
వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స, ఇండస్ట్రీ ఎన్నికల ఫలితాలు శనివారం రాత్రి వెలువడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరులో కటకం పెంటయ్య ప్యానల్ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటికి ఆరుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన దిడ్డి కుమారస్వామిపై కటకం పెంటయ్య విజయం సాధించగా, ఆయన ప్యానల్ నుంచి ఉపాధ్యక్షుడు, గౌరవ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారే కాకుండా ఐదుగురు కార్యవర్గ సభ్యులు గెలిచారు. ఫలితాలు వెలువడగానే పెంటయ్య వర్గీయులు చాంబర్ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. - వరంగల్ సిటీ