breaking news
at konaseema
-
కొనసాగుతున్న పోలీసుల మోహరింపు
కాపు నేత తాతాజీని కాకినాడ నుంచి అమలాపురానికి తరలింపు...హౌస్ అరెస్ట్ ఇంకా అజ్ఞాతంలోనే కాపు జేఏసీ నేతలు విష్ణుమూర్తి, పవ¯ŒSకుమార్ వారి కోసం రెండు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు కర్ణాటక నుంచి అమలాపురానికి అదనంగా ఆర్ఏఎఫ్ దళాలు డీఐజీ రామకృష్ణ నలుగురు ఎస్పీలతో సమీక్షలు అమలాపురం టౌ¯ŒS : పోలీసు నిఘా చర్యలు కోనసీమలో కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కోనసీమ వ్యాప్తంగా ఆరు వేల మంది పోలీసులను మోహరింపజేసి ఆధునాతన పోలీసు సాంకేతిక వాహనాలను సిద్ధం చేసుకున్నా బుధవారం ఉదయానికి కర్ణాటక రాష్ట్రం నుంచి రాపిడ్ ఏక్ష¯ŒS ఫోర్సు (ఆర్ఏఎఫ్)కు చెందిన నాలుగు దళాలను అమలాపురానికి అదనంగా రప్పించారు. డీఎస్పీ లంక «ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఆర్ఏఎఫ్ దళాలు పుర వీధుల్లో కవాతు నిర్వహించాయి. ఏలూరు రేంజ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ కోనసీమలోనే మకాం చేసి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. యాత్రను అడ్డుకునే నేపధ్యంలో కోనసీమకు ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా నియమితులైన చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు జి.శ్రీనివాస్, తివిక్రమ వర్మ, విజయకుమార్, బ్రహ్మారెడ్డి రావులపాలెం, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు ప్రాంతాల్లో ఉండి శాంతి భద్రతల పరిస్థితులు, కాపు నేతల అరెస్ట్లు, తదినంతర పరిణామాలపై క్షణం క్షణం సమీక్షిస్తున్నారు. నలుగురు ఎస్పీలతో కూడా డీఐజీ పలుమార్లు చర్చించారు. జిల్లాలో ముఖ్య కాపు నేతందలరూ అరెస్ట్ లేదా హౌస్ అరెస్ట్లు చేసేదాకా కోనసీమలో ఈ ముమ్ముర పోలీసు మోహరింపు కొనసాగుతాయని తెలిసింది. తాతాజీని కాకినాడ నుంచి అమలాపురానికి తరలింపు... కోనసీమ తెలగ, బలిజ, కాపు (టీబీకే) అధ్యక్షుడు కల్వకొలను తాతాజీని అమలాపురంలో మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను మంగళవారం రాత్రి పట్టణ పోలీసు స్టేష¯ŒS నుంచి కాకినాడకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా స్థానిక కాపు యువకులు అడ్డుకోవటమే కాకుండా ధర్నా చేసిన విషయమూ విదితమే. యువకుల ఆందోళన విరమించాక తాతాజీని మంగళవారం అర్థరాత్రి పట్టణ పోలీసు స్టేష¯ŒS నుంచి కాకినాడ పోర్టు పోలీసు స్టేష¯ŒSకు తరలించారు. అయితే తాతాజీని బుధవారం మధ్యాహ్నం కాకినాడ నుంచి అమలాపురానికి తీసుకువచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. అజ్ఞాతంలోనే విష్ణుమూర్తి, పవ¯ŒSకుమార్లు ... రాష్ట్ర కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు నల్లా పవ¯ŒSకుమార్లు మంగళవారం సాయంత్రం నుంచి కాపు నేతల అరెస్టులపర్వం మొదలు కాగానే వారిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరి కోసం పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెండు బృందాలు గాలించినప్పటికీ ఉనికి తెలియరాలేదు. -
పోలీసు దిగ్బంధంలో కోనసీమ
అమలాపురం టౌన్ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి కోనసీమలో నిర్వహించనున్న కాపుల పాదయాత్రకు పోలీసు బలగాలను భారీగా మోహరిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి 500 మంది పోలీసులను ఇక్కడికి రప్పించిన జిల్లా పోలీసు శాఖ ఆది, సోమవారాల్లో మరో రెండు వేల మందిని రంగంలోకి దింపుతున్నట్టు తెలిసింది. కాపుల పాదయాత్రకు శనివారం వరకూ అనుమతులు లేని దృష్ట్యా పోలీసులు కూడా యాత్రను నియంత్రించే దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లా ఏఎస్పీ ఏఆర్ దామోదర్ను కాపుల పాదయాత్ర బందోబస్తు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆయన స్థానిక పోలీసు కంప్యూటర్స్ భవనంలో డీఎస్పీ లంక అంకయ్యతో పాటు జిల్లాలోని ఇతర పోలీసు అధికారులతో శనివారం సాయంత్రం సమీక్షించారు. పాదయాత్రకు కాపు జేఏసీ రూపొందించిన రూట్ మ్యాప్ను పరిశీలించారు. ఎక్కడెక్కడ పోలీసు బందోబస్తు భారీ స్థాయిలో ఉండాలి, ఏయే రూట్లతో పోలీసులను మోహరించాలనే అంశంపై చర్చించారు. ఇదే సమయంలో అమలాపురంలో కాపు రాష్ట్ర జేఏసీ నాయకులు పాదయాత్ర ఏర్పాట్లపై నిర్వహించుకున్న సమావేశంలోని నేతల ప్రసంగాల సారాంశంపై కూడా ఆయన సమీక్షించారు. పాదయాత్రకు అనుమతి లభిస్తే బందోబస్తు ఏ రకంగా ఉండాలి, అనుమతి లేకుండా యాత్ర అనివార్యమైతే బందోబస్తు ఏ స్థాయిలో ఉండాలన్న విషయాలపై సమీక్షించారు. యాత్ర సమయంలో కోనసీమను పోలీసు వలయంతో దిగ్బంధనం చేసేలా బందోబస్తుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.