Kharif Farmers
-
సగానికి చేరిన సాగు
► ఇప్పటి వరకు 50 శాతం పంటల సాగు ► పెట్టుబడుల కోసం రైతుల అవస్థలు ► రుణాలు ఇవ్వని బ్యాంకులు ► వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న కర్షకులు నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో ఖరీఫ్ సాగు ఊపందుకుంది. వారం రోజుల క్రితం 21,586 హెక్టార్లలో (7 శాతం మాత్రమే)పంటలు సాగు కాగా, ప్రస్తుతం 50 శాతానికి చేరింది. అంటే 1,72,098 హెక్టార్లలో వివిధ పంటలు సా«గు చేశారు. అందులో అగ్రభాగంగా 1,58,113 హెక్టార్లలో పత్తి వేశారు. రుతుపవనాల ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా మూడు, నాలుగు రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దుక్కులు దున్నుకుని సిద్ధంగా ఉంచుకున్న రైతులు పత్తి విత్తనాలను విత్తుకునే పనిలో నిమగ్నమయ్యారు. అదేవిధంగా నాన్ఆయకట్టు ప్రాంతంలో బోరుబావుల కింద ఇప్పటికే అనేక ప్రాంతాలలో వరినార్లు పోసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే రైతులు వరినార్లు పోసుకునే పనిలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 3,19,625 హెక్టార్లు కాగా సుమారు 3,50,000 హెక్టార్లలో వివిధ పంటలను రైతులు సాగు చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,72,098 హెక్టార్లలో సాగు చేశారు. ఇందులో వరి 198 హెక్టార్లలో వరినార్లు పోసుకోగా పత్తిని 1,58,113 హెక్టార్లలో సాగు చేశారు. అంటే పత్తి అంచనాలో 50 శాతం మేర సాగుకు నోచుకుంది. వర్షాలు ఇలానే కొనసాగితే జూలై రెండోవారంలోపు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాగును పూర్తి చేసే అవకాశం ఉంది.. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు ఖరీఫ్ సాగు ఊపందుకోవడంతో అన్నదాతలు పెట్టుబడుల కోసం అవస్థలు పడుతున్నారు. దుక్కులు దున్నకం, విత్తనాల, ఎరువు కొనుగోలు, కూలీల ఖర్చులు ఎకరానికి పత్తికి సుమారు రూ.10 వేల వరకు పెట్టుబడులను పెట్టాల్సిన అవసరం ఉంది. దీంతో రైతులు బ్యాంకుల చుట్టూ పంట రుణాల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 3 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రుణాలు పొంది ఉన్నారు. అయితే నాలుగో విడత రుణమాఫీని ప్రభుత్వం గత నెలలో విడుదల చేసినా ఇప్పటి వరకు 90 శాతం మంది రైతుల ఖాతాల్లో డబ్బులను జమజేశారు. అయినప్పటికీ బ్యాంకులు రైతులకు డబ్బులు ఇవ్వడానికి విముఖతను చూపుతున్నాయని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఖరీఫ్ రుణాలను రూ.1,400ల కోట్లు ఇవ్వాలని జిల్లా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసింది. అయినా బ్యాంకులు రైతులకు రుణాలను ఇవ్వకుండా రేపురా..మాపురా అని తిప్పుకుంటున్నారే తప్ప అప్పులు ఇవ్వని పరిస్థితి. ఇప్పటి వరకు కేవలం రూ.330ల కోట్లు మాత్రమే రెన్యూవల్తో పాటు కొన్ని కొత్త రుణాలను ఇచ్చినట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ కలెక్టర్ డాక్టర్ గౌరవ్ఉప్పల్ పది రోజుల క్రితం బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో రుణం కోసం వచ్చిన ప్రతి రైతుకూ పంటరుణాలను ఇవ్వాలని, రైతుల పట్ల చిన్నచూపుతగదని ఆదేశాలను జారీ చేశారు. కానీ ఖరీఫ్ సీజన్ ఆరంభమై ఇరవై రోజులు గడుస్తున్నా ఇప్పటికీ బ్యాంకు అధికారులు స్పందించడం లేదు. సీజన్ వచ్చి నెత్తిన కూర్చోవడంతో రైతులు పెట్టుబడుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు బ్యాంకులు రుణాలను ఇవ్వడానికి విముఖత చూపకపోవడంతో రైతులు పెడ్డుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా తీసుకుని వ్యాపారులు అధిక వడ్డీలతో రుణాలను ఇస్తున్నారు. విత్తనాలను, ఎరువులను, దున్నకాల కోసం ఉద్దెర పెట్టి ఎక్కువ వడ్డీలను వసూళ్లు చేసుకునే పనిలో వ్యాపారులు ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా అ«ధికారులు స్పందించి బ్యాంకుల నుంచి పంట రుణాలను ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. పంటల సాగు ఇలా.. (హెక్టార్లలో) పంట పేరు అంచనా సాగైంది వరి 57567 198 వరినార్లు జొన్న 644 152 సజ్జ 728 75 మొక్కజొన్న 211 15 కంది 10381 1239 పెసర 2798 359 వేరుశనగ 1028 137 ఆముదం 977 5 పత్తి 213695 158113 మిర్చి 2262 8 మొత్తం 3,19,625 1,72,098. రుణాలను ఇవ్వకపోతే మా దృష్టికి తీసుకురావాలి.. బ్యాంకులు రైతులకు పంట రుణాలను ఇవ్వాలని కచ్చితమైన ఆదేశాలను కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశాలను జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా పంటరుణాలను ఇవ్వాల్సిందేనని చెప్పారు. బ్యాంకులు రుణాలను ఇవ్వకపొతే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా వ్యవసాయాధికారి బి.నర్సింహారావు, ఎల్డీఎం సూర్యం తెలిపారు. ఎక్కడైనా ఇబ్బందులు గురిచేస్తే తమ ఫోన్లకు జేడీఏ సెల్ 7288894477, ఎల్డీఎం సెల్ 9440186963 తెలియజేయాలని సూచించారు. -
దుక్కిదున్ని.. దిక్కులు చూస్తూ..!
ప్రహసనంగా పంట రుణాలు మొండి చెయ్యి చూపిస్తున్న బ్యాంకర్లు వడ్డీ వ్యాపారులే దిక్కు అయోమయంలో అన్నదాత ప్రశ్నార్థకంగా ఖరీఫ్ సాగు దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది జిల్లాలో ఖరీఫ్ రైతుల పరిస్థితి. తొలకరి పలకరించినా చేతిలో చిల్లిగవ్వలేక దుక్కులు దున్ని దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. బ్యాంకు రుణాలు అందక.. ఇన్పుట్ సబ్సిడీ రాక.. ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. పెట్టుబడి కోసం నగానట్రా తాకట్టుపెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. చిత్తూరు : ఖరీఫ్ కష్టాలు మొదలయ్యాయి. తొలకరి పలకరించినా పంట పెట్టుబడికి చేతిలో చిల్లిగవ్వలేక రైతులు దిక్కులు చూడాల్సి వస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో ఒక్కరైతుకూ ప్రభుత్వ రుణం అందక ప్రయివేటు వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. రైతులకు బాసటగా నిలిచి బ్యాంకు రుణాలు ఇప్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అందని ద్రాక్షలా ఇన్పుట్సబ్సిడీ జిల్లా ైరె తులకు ఇన్పుట్ సబ్సిడీ అందని ద్రాక్షలా మారింది. గత రెండు ఖరీఫ్లకు సంబంధించి ఇన్పుట్సబ్సిడీ రూ.205 కోట్ల వరకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు దానిపై ప్రభుత్వం కనీసం నిర్ణయమూ తీసుకోలేదు. రెండేళ్లు గడచినా సబ్సిడీ రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ప్రైవేటు భారం రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు రైతులకు చుక్కలు చూపుతున్నారు. పాత రుణాలు కడితేనే కొత్త రుణాలు ఇస్తామని తెగేసి చెబుతుండడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దళారులు ఒక రోజుకు రూ.10వేలకు రూ.500 వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇదే మొత్తాన్ని బ్యాంకులో రుణం తీసుకుంటే రూ.1.50 పైసలు పడుతుంది. ప్రైవేటు దళారులు వందకు రూ.3 నుంచి రూ.4 వరకు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రమారమీ ప్రతి సంవత్సరమూ రూ.50 కోట్ల వరకు రైతులు వెచ్చించాల్సి వస్తోంది. రుణమాఫీ ఏదీ తాము అధికారంలోకి వస్తే వ్యసాయ రుణాలు మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కర్షకుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తరువాత కొర్రీలు పెడుతుండటంతో ైరె తులకు మాఫీ ఫలాలు అందటం లేదు. జిల్లాలో 8.70 లక్షల రైతులకు బ్యాంకుల్లో రూ.11,180.25 కోట్ల రుణాలు ఉన్నాయి. మొదటి విడతగా రూ.600 కోట్లు చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. రెండో విడత అని రైతులను ఊరిస్తోంది. వాటికి ప్రస్తుతం రుణ ఉపశమన పత్రాలు పంపిణీ చేయనున్నారు. ఈసొమ్ములు ఎప్పటికి చేతికి వచ్చేనో. చేయూత లేకుండా ఏరువాక సంబరాలా? రె తులకు ప్రభుత్వం చేయూత నివ్వకుండా ఏరువాక సంబరాలు నిర్వహిస్తుండడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభమై పది రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు రుణాలు మంజూరు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట రుణాలు లేకుండా ఏరువాక ఎలా సాగించాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకర్ల నిర్లక్ష్యం జిల్లా రైతులకు రుణం ఇచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొత్త రుణాలు, ఉన్న రుణాలను రెన్యువల్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఒక్క కొత్త రుణం కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది రుణ లక్ష్యం రూ.3,176 కోట్లు ఉండగా ఇందులో ఈ ఖరీఫ్కు దాదాపు రూ.1,500 కోట్ల మేరకు రుణాలు అందించాలని బ్యాంకర్లకు ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఇప్పటి వరకు ఎంత మంది రైతులకు ఇచ్చారో అధికారుల వద్దే సమాచారం లేదు. -
రైతులకు మద్దతు ధర అందించాలి
రాంనగర్ : ఖరీఫ్లో రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర విషయంలో రాజీపడేది లేదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశా రు. మంత్రి శనివారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ పార్థసారథితో కలిసి జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఫిర్యాదులకు, విమర్శలకు తావు లేకుం డా ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర విధిగా రైతాంగానికి అందించాలని అధికారులను ఆదేశించారు. అసలే తీవ్ర ఎండలతో వర్షాభావ పరిస్థితులతో కరువుతో ఉన్న రైతులు నష్టపోకూడదన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వ ప్రాధాన్యమైన పని ధాన్యం కొనుగోలుగా పరిణించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం మిల్లర్లకు అన్ని విధాలుగా సహకరిస్తుందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తేమ కొలిచే సాధనాలు, తార్పాలిన్లు ఇతర మౌలిక సౌకర్యాల కోసం మార్కెటింగ్ శాఖ ద్వారా రూ. 6 కోట్ల 47 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున పత్తికొనుగోలు కేంద్రాల పరిధిలో ఫైర్ సర్వీసులను అప్రమత్తం చేయాలని సూచించా రు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెను వెంటనే మిల్లుపాయింట్లకు చేర్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ 2014-15 సంబంధించి ధాన్యం కొనుగోలు విషయంలో 25 శాతం లెవీ పాలసీతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఇందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని సూచిం చారు. ప్రతి జిల్లాలో ఆన్లైన్ విధానం ద్వారా చెల్లింపులు జరపాలని, రైతుల బ్యాంకు ఖాతా నంబర్లు సేకరించి డేటాబేస్ నమోదు చేయాలని కోరారు. కస్టమ్ మిల్లింగ్ చార్జీలను ఈ సీజన్లో పెంచే ఆలోచన ప్రభుత్వం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 15 లక్షల మెట్రిక్ టన్నుల రారైస్, 10 లక్షల బాయిల్డ్ రైస్ సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి మిల్లర్లకు లక్ష్యం నిర్దారించాలని కోరారు. మిల్లర్లు జిల్లా యంత్రాంగం నుంచి ఎలాంటి పర్మిట్లు పొందనసరం లేదని సోనా, సాంబమసూరి ఇతర సూపర్ఫైన్ రకాలకు లెవీ విధానం వర్తించదన్నారు. సూపర్ఫైన్ రకం ధాన్యం మిల్లర్లు, ట్రేడర్లు రాష్ట్రంలో విక్రయించాలని, ఇతర రాష్ట్రాలకు అనుమతి లేదన్నారు. జేసి ప్రీతిమీనా మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్లో 799000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రాగలదని అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 123 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించి ఇప్పుటి వరకు 20 ప్రారంభించినట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి నాణ్యత ప్రమాణాల నిర్దారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొన్న ధాన్యం మిల్లులకు తక్షణమే రవాణా చేయడానికి గాను ట్రాన్స్పోర్టు టెండర్లు ఖరారు చేసినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో 8000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న మార్కెట్కు రాగలదని అంచనా వేసి 3 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పత్తికొనుగోలు కోసం 13 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్డీఏపీడీ సుధాకర్, జేడీఏ నర్సింహారావు, డీఎస్ఓ నాగేశ్వర్రావు, ఏఎస్వో వెంకటేశ్వరు పాల్గొన్నారు.