-
ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉద్రిక్తత
-
ఖమ్మంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణలు..
సాక్షి, ఖమ్మం జిల్లా: కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆర్టీ వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన హనుమంతరావు, అతని అనుచరులతో కలిసి కాంగ్రెస్కు చెందిన మేకపోతుల మహేష్ గౌడ్పై కత్తులతో, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మహేష్కు తీవ్ర గాయాలవ్వడంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా గతంలోనూ మహేష్పై అనేకసార్లు దాడికి యత్నించినట్లు తెలిసింది. పలుమార్లు పలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాజా పరిణామాల నేపథ్యంలో పండితాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. -
ఆ జిల్లాపై హరీష్ రావు కన్నేసి ఉంచారా?
గులాబీ బాస్ ఆశించిన విధంగానే ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఖమ్మం బీఆర్ఎస్ గందరగోళంగా తయారైంది. పలువురు సీనియర్లు పార్టీ వీడతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగ ప్రవేశం చేయడంతోనే అంతా సర్దుకుందనే టాక్ వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో సైతం హరీష్ రావు ఖమ్మం జిల్లాపై ఓ కన్నేస్తారా? భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ తెలంగాణ సరిహద్దులో ఏపీకి ఆనుకుని ఉన్న ఖమ్మం జిల్లాలో విజయవంతంగా జరిగింది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపేవిధంగా ఉంటుందని, అదే సమయంలో ఖమ్మం జిల్లా పార్టీలోని అసమ్మతిని కూడా దారికి తెచ్చుకున్నట్లుగా ఉంటుందనే వ్యూహంతోనే కేసీఆర్ ఖమ్మంను ఎంపిక చేశారని తెలుస్తోంది. పార్టీ అనుకున్న సంఖ్యలో కాకపోయినా.. భారీగా తరలివచ్చిన ప్రజలు గులాబీ దళపతికి సంతోషం కలగచేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఢిల్లీలో గ్రాండ్గా నిర్వహించాలని మొదట్లో భావించారు. అయితే అనూహ్యంగా వేదిక ఖమ్మంకు మారింది. వేదిక మార్పు వెనుక కేసీఆర్ రాజకీయ సమీకరణాల వ్యూహం కూడా సక్సెస్ అయిందని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో అసంతృప్తితో ఉన్న కొందరు సీనియర్ బీఆర్ఎస్ నేతలు పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఖమ్మం జిల్లాపై బిజేపి కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ పూర్వరంగంలో ఖమ్మంలో ఆవిర్భావ సభ పెట్టడం ద్వారా పార్టీలోని అసంతృప్త నేతలు చేజారకుండా చూసుకోవడమే కాకుండా పార్టీని బలోపేతం చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఖమ్మం వేదికను ఎంచుకున్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తుంది. అయితే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లు, జన సమీకరణ బాధ్యతను ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావుకు అప్పగించారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు ఖమ్మంలోనే మకాం వేసిన హరీష్రావు.. జన సమీకరణ ఏర్పాట్లు చూసుకున్నారు. ఖమ్మంకు వచ్చీ రావడంతోనే అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించే బాధ్యతను చేపట్టారు. జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంకి వెళ్లి చర్చలు జరిపారు. తాజా రాజకీయ పరిణామాలపై తుమ్మలతో చర్చించారు. రానున్న రోజుల్లో జిల్లాలో ఖచ్చితంగా తుమ్మలకు ప్రయారిటీ ఉంటుందన్న సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్ని ఆయనకు హరీష్ వివరించారని చెబుతున్నారు. హరీష్ రావు తో జరిపిన చర్చలు విశ్వాసం కలిగించడంతో..తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో మళ్ళీ యాక్టివ్ అయ్యారు. పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాలను మంత్రి హరీష్ రావుతో కలిసి జిల్లా అంతటా నిర్వహించారు. జన సమీకరణకు అన్ని నియోజకవర్గాల్లోనూ స్థానిక నేతలతో పాటుగా.. తన అనుచరులను కూడా పురమాయించారు. తుమ్మలతోనే కాకుండా జిల్లా అంతటా అసంతృప్తితో ఉన్న ముఖ్య నాయకులతో హరీష్రావు రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. కొత్తగూడెంలో గత రెండేళ్ల నుంచి అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెంలో మళ్లీ యాక్టివ్ కావాలని ఆవిర్భావ సభకు రావాలని కేసీఆర్ సూచించిన నేపద్యంలోనే జలగం వెంకట్రావు సభకు వచ్చారని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాయకులు, కేడర్ మొత్తం వర్గ విభేదాలు పక్కనపెట్టి బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు రావడంతో సభ అనుకున్న స్థాయిలో సక్సెస్ అయిందన్న వాదన వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు సైతం వచ్చారు. సభ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలకు వర్గ విభేదాలను పక్కనపెట్టి వచ్చే ఎన్నికల్లో పదికి పది అసెంబ్లీ సీట్లు.. రెండు లోకసభ స్థానాలు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని దిశా నిర్దేశం చేశారట. జిల్లాలో 2014, 2018 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మళ్లీ రిపీట్ కావద్దని సూచించారట. ఆవిర్భావ సభను విజయవంతం చేసినందుకు మంత్రి హరీష్ రావును సీఎం కేసీఆర్ ప్రశంసించారు. మొత్తానికి ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభతో అసంతృప్త నేతలు పార్టీ నుంచి చేజారకుండా సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ నాయకులందరూ చివరి వరకు వర్గ విభేదాలను పక్కనపెట్టి పని చేస్తారా... లేకుంటే మధ్యలో హ్యాండ్ ఇస్తారా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.. -
'పార్టీ కార్యకర్తలు తాలిబన్లు, నక్సలైట్లుగా ఉద్యమించాలి'
-
నువ్వు మంచిగున్నవ్!..సీఐ అనుచిత వ్యాఖ్యలు
కారేపల్లి: పొలం గట్టు తగాదాపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ మహిళతో సీఐ పెడార్థం వచ్చేలా మాట్లాడారన్న ఆరోపణ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో కలకలం రేపింది. ‘నీవు మంచిగనే ఉన్నావ్ కదా! నువ్వు నాకు నచ్చినవ్!!’అంటూ సీఐ అనుచితంగా మాట్లాడాడని బాధితురాలు ఆరోపించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ విషయాన్ని పాత్రికేయులకు వెల్లడించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ మహిళ వారికి ఫోన్ చేసి ‘సమస్య పరిష్కారానికి అధికారులు హామీ ఇచ్చారు. నేను చెప్పినవేవీ పేపర్లలో రాయకండి’అని కోరడం గమనార్హం. బాధితురాలి కథనం ప్రకారం... కారేపల్లి మండలం రేలకాయలపల్లి గ్రామానికి చెందిన భూక్యా కాంతమ్మ, భూక్యా మమత తల్లీకుమార్తెలు. పెళ్లయిన మమత భర్తతో గొడవ కారణంగా తల్లి ఇంట్లోనే ఉంటోంది. మమత బాబాయి భూక్యా లక్ష్మణ్ ఇటీవల తమ చేను గట్టు ఆక్రమించి దున్నుతుండగా ప్రశ్నించడంతో కొట్టాడని మమత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ లక్ష్మణ్ మరోసారి పత్తి చేను గట్టు దాటి వచ్చి అర ఎకరం వరకు ఆక్రమించి దున్నుతుండగా శనివారం రాత్రి 7 గంటలకు కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మమత వెళ్లింది. అప్పుడే సీఐ అనుచితంగా మాట్లాడినట్లు మమత సోమవారం విలేకరులకు వెల్లడించింది. అంతేకాకుండా రాత్రి 11.30 వరకు ఒక్కదాన్నే పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టారని, పెద్దవాళ్లతో గొడవలు ఎందుకు అని చెప్పారని ఆరోపించింది. అయితే సోమవారం సాయంత్రం మాత్రం ఈ విషయాలేవీ పత్రికల్లో రాయొద్దని కోరింది. ‘అనుకోకుండా జరిగింది. ఏదీ మనసులో పెట్టుకోకు. నీ సమస్య మొత్తం పరిష్కరిస్తాం. మీ బాబాయ్ను పిలిపించి నీ భూమి హద్దులు పెట్టిస్తాం’అని పోలీసులు చెప్పారని తెలిపింది. మమత ఆరోపణలపై కారేపల్లి సీఐ బి. శ్రీనివాసులును వివరణ కోరగా మమత ఫిర్యాదు పత్రం ఇష్టారీతిన ఉండడంతో మార్చి రాయాలని దబాయించిన మాట వాస్తవమేనని, కానీ అనుచితంగా మాట్లాడలేదన్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement