-
కాటేసిన కంఠసర్పి
– బాలిక మృతి – బాలుడిక అస్వస్థత – మంత్రాలయంలో ఘటన మంత్రాలయం రూరల్: కంఠసర్పితో మంత్రాలయం రాఘవేంద్రనగర్కు చెందిన పూజ(11) మృతిచెందింది. ఉంగరాల వ్యాపారం చేస్తున్న బద్రి, గానెమ్మ దంపతులకు నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. బుధవారం ఉదయం బహిర్బూమికి వెళ్లి వచ్చిన కొద్దిసేపటికి కుమారుడు జీవన్, కుమార్తె పూజ గొంతులో నొప్పిగా ఉందని తల్లితండ్రులకు చెప్పారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం శ్రీ మఠం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు పూజ అప్పటికే మృతి చెందిందని చెప్పారు. జీవన్ను మాత్రం మెరుగైన వైద్యం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. కర్నూలులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించగా.. వైద్య పరీక్షలు నిర్వహించి కంఠసర్పి అని తేల్చారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ చంద్రశేఖర్వర్మ, గ్రామ సర్పంచ్ టి.భీమయ్య..రాఘవేంద్రనగర్కు చేరుకొని బాలిక మతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాలిక అంత్యక్రియల నిమిత్తం మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి రూ. 2 వేలు ఆర్థిక సహాయాన్ని గ్రామ సర్పంచ్ టి.భీమయ్య, వార్డు మొంబర్ వీరన్న చేతుల మీదుగా అందజేశారు. -
వ్యాక్సినేషన్కు సుస్తీ!
సాక్షి, సిటీబ్యూరో: వైద్యుల నిర్లక్ష్యం.. పేదల నిరక్షరాస్యత.. వెరసి చిన్నారుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. వైద్యారోగ్య రాజధానిగా పేరొందిన గ్రేటర్ హైదరాబాద్లో 1520 మురికివాడలు ఉన్నాయి. ఇక్కడ జాతీయ ఉచిత వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం తగిన విధంగా జరగడం లేదు. ప్రతి శనివారం ఆరోగ్య కేంద్రాల్లోని ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు ఆయా బస్తీల్లో పర్యటించి పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు వేస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. నిజానికి పల్స్పోలియో అప్పుడు తప్ప మిగతా సమయాల్లో అటు వైపు కూడా కన్నెత్తి చూడట్లేదు. తల్లి గర్భం దాల్చిననాటి నుంచి ప్రసవం వరకు, ఆ తర్వాత బిడ్డ పుట్టినప్పటి నుంచి ఐదేళ్ల వరకు వేయించాల్సిన టీకాల జాబితా, తదితర వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉండగా, అదేమీ సవ్యంగా జరగడం లేదు. ఇంటింటికీ తిరగకపోవడం వల్లే.. జీవనోపాధికి నిత్యం అనేకమంది పిల్లపాపలతో కలిసి నగరానికి వలస వస్తున్నారు. వీరంతా బస్తీల్లో తలదాచుకుంటున్నారు. ఊర్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటిముందుకే వచ్చి పిల్లలకు టీకాలు వేస్తే.. నగరంలోని బస్తీలలో మాత్రం ఆరోగ్యకేంద్రాలను, కమ్యూనిటీ హాల్స్ను వెతుక్కోవాల్సి వస్తోంది. వాక్సిన్ ఏ రోజు వేస్తారు? ఎక్కడ వేస్తారో ప్రచారం ఉండటం లేదు. దీంతో గతంలో ఒకటి రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న వారు, వలసల వల్ల ఆ తర్వాతి డోసులను మర్చిపోతున్నారు. టీకాలు వేయించుకోని వారే కాదు, ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాలు వేయించుకున్న వారు సైతం డిఫ్తీరియా, కామెర్లు, టీబీ, కోరింత దగ్గు, ధనుర్వాతం, మెదడువాపు రోగాల బారినపడుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఔషధ నిల్వల్లో తలెత్తుతున్న లోపాలతోనే వ్యాక్సిన్ వికటిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా, మిగతా ప్రాంతాలతో పోలిస్తే పాతబస్తీ, సమీప కాలనీల్లో ఢిప్తీరియా, మమ్స్, మీజిల్స్ కేసులు ఎక్కువ నమోదవుతున్నట్లు స్పష్టమవుతోంది. అటకెక్కిన మొబైల్ ట్రాకింగ్ విధానం జిల్లా కలెక్టర్గా గుల్జార్ ఉన్నప్పుడు బస్తీల్లోని గర్భిణిలు, ఐదేళ్లలోపు పిల్లలు, వారికిచ్చే వాక్సిన్లు, ఇతర వివరాల నమోదుకు ఆన్లైన్ మొబైల్ ట్రాకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రూ.లక్షలు వెచ్చించి మొబైల్ ఫోన్లు కొన్నారు. దీని పర్యవేక్షణకు ఫిలింనగర్లో తొలిసారిగా ఐవీఆర్ఎస్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మరో 18 కేంద్రాలకు సేవల్ని విస్తరించినా.. నిర్వహణ లోపంతో ఈ విధానం అటకెక్కింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement