అమరావతిపై విచారణ నేటికి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతిపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్లపై విచారణ గురువారానికి వాయిదా పడింది. ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ముందు బుధవారం వాదనలు కొనసాగాయి.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ పారిఖ్ వాదనలు వినిపిస్తూ శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పైగా రాజధాని ఎంపిక రాష్ట్ర ప్రభుత్వం హక్కు అని పేర్కొందని సంజయ్ పారిఖ్ వాదించారు. తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది.