breaking news
Joint Managing Director
-
సమతుల్యత సాధించాలి
‘‘ఏ రంగంలోనైనా నాయకత్వం వహించడానికి దూరదృష్టి, కొత్త ఆవిష్కరణలపై అవిశ్రాంత కృషి అవసరం. సాంకేతికతంగా వస్తున్న మార్పులను అమలు చేయడంలో, టీమ్ వర్క్ను బలోపేతం చేయడంలో ముందుండాలి. బలమైన నాయకులుగా ఉండాలంటే పనిలో నైపుణ్యాలతో పాటు వైవిధ్యాన్నీ పెంపొందించాలి. సక్సెస్ ఉద్దేశం ఒక్కరమే ఎదగడం కాదు, అర్థవంతమైన మార్పుతో మనతోపాటు ఉన్నవారితో కలిసి నడవడం.సమతుల్యం చేయడంలోనే సవాళ్లువైద్య రంగంలో మహిళలు అతిపెద్ద కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ నిత్యం సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. వృత్తిపరంగా ఎదగడంలోనూ, వ్యక్తిగత బాధ్యతలతో బాలెన్స్ చేయడం అనేది అతిపెద్ద అడ్డంకిగా మారింది. కెరీర్– ఇల్లు రెండింటినీ సమర్థంగా నిర్వహించడానికి సమాజం ఇప్పటికీ మహిళలపై చెప్పలేనన్ని అంచనాలను ఉంచుతోంది. రెండుచోట్లా మహిళలు అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వాతావరణం ఉండాలి. అలా లేకపోవడంతో ‘ఆమె సమర్ధత’కు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. మన సమాజంలో మరొక సవాల్ లోతుగా పాతుకుపోయిన లింగ వివక్ష. నాయకత్వ అవకాశాలను పరిమితం చేసేది ఇదే.నాయకత్వం జెండర్తో కాదు సామర్థ్యం వల్లే సాధ్యం అని నిరూపించడానికి మహిళ మరింత కష్టపడి పనిచేయాలి. మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మరింత చురుగ్గా వ్యవహరించాలి. డెసిషన్ మేకర్స్ జాబితాలో ఎక్కువ మంది మహిళలకు స్థానం ఉండేలా చూసుకోవాలి. మిగతావాటికన్నా వైద్యరంగం భిన్నమైనది, లోతైనది కూడా. ఎందుకంటే ఇక్కడప్రాణాలను కాపాడటం, ఆరోగ్య ఫలితాలలో మంచి మార్పులు తీసుకురావడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, సరిహద్దులను దాటి ఆలోచించడం, యథాతథ స్థితి కొనసాగేలా టీమ్స్ను ప్రోత్సహించడం... వంటివి వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలో మనల్ని ముందు ఉంచుతుంది.నెట్వర్క్ను నిర్మించుకోవాలిసాధారణంగా మహిళలు రిస్క్ తీసుకొని, తమ స్థానాన్ని సాధించేందుకు వెనకాడతారు. మీ ముందు చూపును, అంతర్దృష్టిని నమ్మండి. బలమైన మద్దతునిచ్చే నెట్వర్క్ను నిర్మించుకోండి. విజయం ఎప్పుడూ ఒంటరి ప్రయాణం కాదు. మిమ్మల్ని సవాలు చేసేవారు, మార్గదర్శకులు, సహచరులు, టీమ్స్తో ముందుకు కదలాలి. నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆపవద్దు. సవాళ్లను సోపానక్రమాలుగా స్వీకరించాలి. ప్రతి అడ్డంకిని నూతనంగా ఆవిష్కరించడానికి, అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం అనుకోవాలి. మహిళా వ్యవస్థాపకులు పరిశ్రమలను రూపొందిస్తున్నారు, ఇది మన సమయం అని గుర్తించండి’’ అంటూ మహిళాభ్యున్నతికి మార్గదర్శకం చేస్తున్నారు డాక్టర్ సంగీతారెడ్డి. మార్పులు తప్పనిసరిరోల్ మోడల్స్ మార్గదర్శకత్వంతో పాటు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలి. వ్యవస్థాగత అడ్డంకులను పరిష్కరించాలి. పనిప్రదేశంలో సమాన వేతనం, నిష్పాక్షికమైన కెరీర్ పురోగతికి మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా, మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మారాలి. మహిళలు ఆరోగ్య సంరక్షణలో పాల్గొనేవారు మాత్రమే కాదు, భవిష్యత్తుకు చురుకైన రూపశిల్పులుగా మారాలి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పుష్కరాలకు 2,270 బస్సులు
హైదరాబాద్ నుంచి 530 25 లక్షల మందిని చేరవేయడమే లక్ష్యం టీఎస్ఆర్టీసీ జేఎండీ రమణరావు వెల్లడి హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న గోదావరి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం 2,270 బస్సులు నడుపుతున్నట్టు టీఎస్ ఆర్టీసీ జాయింట్ ఎండీ రమణరావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ర్టంలోని వివిధ పుష్కర ఘాట్లకు 25 లక్షల మంది భక్తులను చేరవేయడమే లక్ష్యంగా బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలి పారు. హైదరాబాద్ నుంచి 530, ఆదిలాబాద్- 310, నిజామాబాద్- 300, కరీంనగర్ -415, వరంగల్- 355, ఖమ్మం నుంచి 360 బస్సులు పుష్కర ఘాట్లకు భక్తులను చేరవేస్తాయని వివరించారు. హైదరాబాద్ నుంచి అన్ని పుష్కరఘాట్లకు బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు ప్రధాన ఘాట్లు అయిన బాసర, భద్రాచలం, ధర్మపురి, కాళేశ్వరంలకు అవసరాన్ని బట్టి ప్రత్యేక బస్సులు పెంచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పుష్కరఘాట్ల వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక బస్స్టేషన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు రమణరావు వివరించారు. తాగునీరు, మరుగుదొడ్లు, క్యాంటీన్లు, సమాచార కేంద్రాలు, విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యం, క్లాక్ రూం సౌకర్యంతో పాటు బస్స్టేషన్ల వద్ద 150 మంది అంతర్గత సిబ్బందిని కూడా నియమిస్తున్నట్టు తెలిపారు. భక్తులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు.