breaking news
janmaboomi
-
జన్మభూమి కమిటీల అవినీతిమయం
సాక్షి,పెళ్లకూరు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోలేదు.దోచుకోవడమే పరమావధిగా అధికార పార్టీ పాలన సాగింది. సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చేశారు. ఆ పార్టీ నాయకులు ఇసుక అక్రమంగా తరలించి రూ.కోట్లు గడించారు. దీంతో స్వర్ణముఖి, కాళంగి నదులు రూపు కోల్పోయాయి. ఇళ్లు, పెన్షన్లు, రుణాలు మంజూరు చేసుకోవాలంటే అర్హులైన లబ్ధిదారులంతా ఐదేళ్లపాటు జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా అర్హులకు ఒక్క పథకాన్ని కూడా అందించిన దాఖల్లాలేవు. దోపిడీయే ధ్యేయంగా.. నీరు – చెట్టు పథకం కింద నియోజకవర్గానికి సుమారు రూ.200 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి. పనులను టీడీపీ నాయకులు చేపట్టారు. నిబంధనలు పాటించకుండా తూతూమంత్రంగా పనులు పూర్తి చేసి రూ.కోట్లు నిధులు బొక్కేశారు. కొన్నిచోట్ల పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారు. అదేవిధంగా రైతు రథాల కింద మంజూరైన ట్రాక్టర్లను అర్హులైన అన్నదాతలకు అందజేయకుండా అధికార పార్టీ నేతలే కైవసం చేసుకున్నారు. ఎన్టీఆర్ గృహాలు, పెన్షన్లు, మరుగుదొడ్లు మంజూరు చేయాలంటే జన్మభూమి కమిటీలు లబ్ధిదారుల వద్ద అధిక మొత్తంలో గుంజుకున్నట్లు విమర్శలున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతోపాటు పంచాయతీ సర్పంచ్లకు నిధులు మంజూరు చేయకుండా రాజ్యాంగా విరుద్ధంగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారు. వారు చేసిన అరచకాలతో ప్రజలు బాగా విసిగిపోయారు. 2014 సంవత్సరం ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన టీడీపీ అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేసింది. గడిచిన ఐదేళ్లలో ఒక్కపైసా మాఫీ చేయకపోగా వడ్డీ భారంతో అన్నదాతలు అనేక కష్టాలు పడుతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లోనూ భారీగా అవినీతి చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని అనేక మండలాల్లో అధికార పార్టీ నాయకుల భూ కబ్జాల పర్వం యథేచ్ఛగా సాగింది. ఇన్చార్జిగా వ్యవహరించిన వారు అధికారులపై ఒత్తిళ్లపై తెచ్చి తమ నాయకులను పనులు చేయించుకున్నారు. మున్సిపాలిటీల్లో ఇలా.. సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో ప్రజల గురించి అధికార పార్టీ నాయకులు స్పందించలేదు. పలుచోట్ల జరిగిన పనుల్లో అవినీతిని ఏరులై పారించారు. తెలుగుదేశం నాయకులు కాంట్రాక్టర్లుగా మారి రూ.లక్షలు స్వాహా చేశారు. ప్రధానంగా నాయుడుపేట మున్సిపాలిటీలో జరిగిన రోడ్డు, డ్రెయినేజీ పనుల్లో అవినీతి ఎక్కువగా చోటుచేసుకుంది. అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఇక్కడి ప్రజలు తాగునీటితో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా దోచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. సూళ్లూరుపేటలోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న తీసుకున్న చర్యలు శూన్యం. ప్రజల కోసం ప్రతిపక్షం పోరాటాలు నియోజకవర్గంలో ప్రజల సమస్యలను అధికార పార్టీ పట్టించుకోలేదు. ప్రతిపక్ష నాయకులు వాటిపై పోరాటాలు చేస్తూ పరిష్కారానికి తమవంతు కృషి చేశారు. ఐదేళ్లలో వర్షాలు సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మారుమూల గ్రామల ప్రజల దుస్థితిపై ఇక్కడి టీడీపీ నేతలు స్పందించలేదు. వైఎస్సార్సీపీ నాయకులు పలుమార్లు జెడ్పీ సమావేశంలో ప్రజల పక్షాన గళం విప్పారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నిత్యం గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటిని కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లకూరు, నాయుడుపేట మండలాల పరిధిలోని స్వర్ణముఖి నది నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లు, లారీలతో చెన్నైకి తరలించడంపై పెళ్లకూరు ఎంపీపీ సత్యనారాయణరెడ్డి కొందరు రైతులతో కలిసి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి సాగు, తాగునీటికి కష్టాలు తప్పవని, ఈ ప్రాంతం ఎడారిగా మారిపోయో ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొని అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. అయితే పలుమార్లు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులను సైతం టీడీపీ నేతలు బెదించి వాహనాలను విడిపించిన ఘటన చోటుచేసుకున్నాయి. అధికార పక్ష అవినీతిపై ప్రతిపక్ష నేతలు అనేక సందర్భాల్లో గళం విప్పారు. సమావేశాల్లో మాట్లాడి ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు. తాగు, సాగునీటి విషయంలో అధికారులతో అనేకసార్లు మాట్లాడి వినతులు సమర్పించారు. సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ప్రజలపక్షాన గళం విప్పారు. ప్రజల సమస్యలపై చర్చించారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని వైనంపై బహిరంగ వేదికలపై నిలదీసిన ఘటనలున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో అధికార పార్టీ ఒక్కోసారి ఒక్కో స్టాండ్ తీసుకున్నా ప్రతిపక్షం మాత్రం మొదటి నుంచి హోదా కోసమే పోరాడింది. ఆ పార్టీ నాయకులు హోదా వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని పోరుబాట పట్టారు. ప్రజలతో కలిసి ధర్నాలు, ర్యాలీలు చేశారు. -
టీడీపీలో కుమ్ములాటలు
► మండల పార్టీ నేతల ప్రకటనతో భగ్గుమన్న విభేదాలు ► అసంతృప్తులకు బుజ్జగింపులు ► జన్మభూమి కమిటీల్లో చోటిస్తామని నాయకుల భరోసా జిల్లా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం పార్టీ మండలాధ్యక్షులను ప్రకటించడంతో మరింత పెరిగాయి. మండలాలకూ విభేదాల సెగ పాకింది. దీంతో పార్టీ అధిష్టానానికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. జన్మభూమి కమిటీల పేరుతో అవినీతికి పాల్పడుతుండటం.. ఈ కమిటీల్లో జిల్లా స్థాయి నాయకుల అనుచరులు.. బంధువులే అధికంగా ఉండటాన్ని సామాన్య కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. చిత్తూరు, సాక్షి: జిల్లా టీడీపీలో అసంతృప్తి తీవ్రతరమైంది. తాజాగా ప్రకటించిన మండలాధ్యక్ష పదవులలోనూ తమకు అన్యాయం చేశారని బీసీలు నిరసిస్తున్నారు. ఎక్కువ మండలాల్లో పార్టీ సారథ్యం సీఎం సామాజిక వర్గీయులకే కట్టబెట్టారని వీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో తమకు గుర్తింపే లేదని ఎస్సీ, ఎస్టీలు రగిలిపోతున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కుతూహలమ్మ చెప్పినవారికి కాకుండా.. టీడీపీలో అన్నీతామై నడిపిస్తున్న ఓ సామాజికవర్గం చెప్పిన వారికి మండలాధ్యక్ష పదవులిచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపీ శివప్రసాద్ మాటకూ పార్టీలో విలువ లేదని ఎస్సీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దికాలంగా పార్టీలో అసంతృప్తి పెరుగుతుండటం గమనించిన అధిష్ఠానం మండలాధ్యక్షుల ప్రకటనను రెండు నెలలు వాయిదా వేసింది. మదనపల్లి, శ్రీకాళహస్తి, పీలేరు, సత్యవేడు, తదితర నియోజకవర్గాల్లో మండలాధ్యక్షుల పదవుల కోసం రోడ్డుపైకొచ్చి ఘర్షణకు దిగిన సందర్భాలున్నాయి. అసంతృప్తులను బుజ్జగించి శనివారం మండల పార్టీ నేతల పేర్లను ప్రకటించారు. అయినా అసంతృప్తి పెల్లుబుకుతూనే ఉంది. అసంతృప్తులను బుజ్జగించే పనిలో భాగంగా కొత్తగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. ఇంతకుముందు కమిటీలో సర్పంచ్, ఎంపీపీ, నలుగురు పార్టీ నాయకులు ఉండేవారు. ఇప్పుడు సర్పంచ్లు ఇతర పార్టీ వారు ఉన్నచోట్ల వారిని తొలగించి టీడీపీ నాయకులకు ఈ కమిటీల్లో చోటుకల్పిస్తామని అధిష్ఠానం వారికి మాట ఇచ్చింది. మదనపల్లి టీడీపీ మూడు వర్గాలుగా విడిపోయింది. రామదాస్చౌదరి, దొమ్మలపాటి రమేశ్, బొమ్మచెరువు శ్రీరాములు వర్గాలు నిత్యం తన్నుకుంటూనే ఉన్నాయి. మదనపల్లి మండలాధ్యక్ష పదవి తమకే ఇవ్వాలని బొమ్మచెరువు వర్గం డిమాండ్ చేస్తోంది. గొడవలు ముదరడంతో పాత అధ్యక్షుడు దొరస్వామి నాయుడినే కొనసాగిస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నాలుగు మండలాలుంటే అన్నింట్లోనూ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. కొత్త అధ్యక్షుల ఎంపిక కోసం శ్రీకాళహస్తిలో జరిగిన సమావేశంలో పెద్ద గొడవే జరిగింది. దీంతో పాత వారినే కొనసాగిస్తున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రంగా ఉన్నాయి. నియోజకవర్గం తెలుగుదేశం కన్వీనర్ హరికృష్ణను కాదని అక్కడి తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించే సామాజిక వర్గం వారికే పదవులు కట్టబెట్టడం పుండుమీద కారం చల్లినట్లుగా తయారైంది. నారాయణవనం టీడీపీ నాయకుల మధ్య కుమ్ములాటలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక్కడ తలారి మనోహర్కు వాడవాడల నుంచి కలెక్షన్లు సమకూర్చే గిరిబాబుకు పదవి కట్టబెట్టడంతో భాస్కరన్ గ్రూపు పార్టీని వీడేందుకు సిద్ధమైంది. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడి పని చేస్తే గుర్తింపు లేకుండా ప్రజా బలం లేని వారికి అధ్యక్షపదవి ఎలా ఇస్తారని వారు అంటున్నారు. భాస్కరన్ గ్రూపు ఎమ్మెల్యే నిర్వహించే ఏ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించినట్లు సమాచారం. సత్యవేడు నియోజకవర్గ వరదయ్యపాళ్యంలో పరిస్థితి టీ కప్పులో తుపానులా ఉంది. ఎమ్మెల్యే తలారి ఆదిత్య నాన్న మనోహర్కు, జెడ్పీటీసీ సరస్వతమ్మ కొడుకు కరుణాకర్నాయుడుకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నా ఆయనకు ఎక్కువ ప్రాధ్యాన్యత ఇస్తుండటం అక్కడి కేడర్లో అసంతృప్తికి కారణమని తెలిసింది. తలారి మనోహర్ ప్రతిపాదిం చిన చలపతినాయుడు ఐవీఆర్ఎస్ ఓ టింగ్లో ఓడిపోయినా ఆయననే తిరిగి మండలాధ్యక్షుడిగా ఎంపిక చేయడంపై అసంతృప్తులు భగ్గుమంటున్నారు. ఇం తకుముందు రెండుసార్లు పదవి కోసం పోటీ చేసిన మైనారిటీ నాయకుడు నవాబును ఈ సారీ పక్కన పెట్టారు.