-
పెన్షనర్లకు కరువుభృతి పెంపు
జనవరి నుంచే వర్తింపు సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లకు కరువు భృతిని (డీఆర్) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లకు ప్రస్తుతం 15.196 శాతం డీఆర్ అమల్లో ఉండగా దీనికి అదనంగా 3.144 శాతం కలిపి 18.340 శాతం డీఆర్ చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2016 జనవరి నుంచి ఈ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు (జీవో నంబర్ 112) జారీ చేశారు. ప్రభుత్వోద్యోగులకు ఇటీవల కరువు భత్యం పెంచిన తరహాలోనే పెన్షనర్లకు ప్రభుత్వం డీఆర్ను వర్తింపజేసింది. జనవరి నుంచి చెల్లించాల్సిన బకాయిలను సెప్టెంబర్ పెన్షన్తో కలిపి చెల్లించనుంది. అక్టోబర్ 1న బకాయిలతోపాటు పెరిగిన డీఆర్తో కూడిన పెన్షన్ పెన్షనర్లకు అందనుంది. 2013 జూలై 1 తర్వాత రిటైరైన వారితోపాటు అప్పటికే రిటైరై పెన్షన్ అందుకుంటున్న వారందరికీ డీఆర్ వర్తిస్తుంది. ఈ ఉత్తర్వుల ఆధారంగా ట్రెజరీ అధికారులు, పెన్షన్ పేమెంట్ అధికారులు వచ్చే నెల బిల్లుల చెల్లింపులు చేయాలని ఆర్థికశాఖ అన్ని ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. -
మరో ఆరు మార్కెట్ కమిటీలు
ఇప్పటివరకు 51 కమిటీలకు నియామకం సాక్షి, హైదరాబాద్: ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి (పాశం విజయ), ఆలేరు (కాలే సుమలత), కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట (గుండ సరోజన), మానకొండూరు (మల్లగల్ల నగేశ్) కమిటీలకు పాలక మండళ్లను నామినేట్ చేశారు. రంగారెడ్డి జిల్లా సర్దార్నగర్ కమిటీ చైర్మన్గా శేరిగూడెం వెంకటయ్య, మెదక్ జిల్లా నంగునూరు కమిటీ చైర్మన్గా సంగు పురేందర్ నియమితులయ్యారు. 179 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను 11 కమిటీలకు పీసా చట్టం కింద గిరిజనులకు కేటాయించారు. మిగిలిన 168 కమిటీలకుగాను 51 కమిటీలకు పాలక మండళ్లను నియమించారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి 21 మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నామినేట్ చేయగా.. ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు ఒక్క కమిటీని కూడా నియమించలేదు. మార్కెట్ కమిటీల్లో చోటు కల్పించాలంటూ టీఆర్ఎస్ నాయకులు, క్రియాశీల కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రతిపాదనలపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓ వైపు అసంతృప్తులను బుజ్జగిస్తూ, మరోవైపు తమకు అనుకూలంగా ఉండే వారిని రిజర్వేషన్ కోటాకు అనుగుణంగా ప్రతిపాదిస్తున్నారు.పాలక మండళ్ల పదవీ కాల పరిమితి ఏడాదిగా నిర్ణయించడంతో తర్వాతి పాలక మండలిలో చోటు కల్పిస్తామంటూ సర్దిచెప్తున్నారు. నెలాఖరులోగా భర్తీ: మంత్రి హరీశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలుపుతున్నాం. మిగతా కమిటీలకు సంబంధించి నియామక ప్రక్రియపై కసరత్తు సాగుతోంది. నెలాఖరులోగా కమిటీలకు పాలక మండళ్ల నియామక ప్రక్రియ పూర్తి చేసే యోచనలో ఉన్నాం. సమర్థులను ఎంపిక చేయడం ద్వారా మార్కెట్ యార్డుల కార్యకలాపాలను రైతులకు మరింత చేరువ చేస్తాం. దేశంలోనే తొలిసారిగా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు.. మహిళలకూ పెద్దపీట వేస్తున్నాం. -
ఏపీపీఎస్సీ కార్యదర్శిగా గిరిధర్!
* ఈ నెల 1 నుంచి సెలవులో ఉన్న గిరిధర్ * రాజధాని పనుల్లో ప్రభుత్వ విధానాలు నచ్చక కినుక సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎ. గిరిధర్ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా గిరిధర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అనుసరిస్తున్న విధానాలు, తీరు నచ్చక గిరిధర్ ఈ నెల 1 నుంచి సెలవులో ఉన్నారు. తనను మున్సిపల్ శాఖ బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా ఆయనే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖలో కీలక పోస్టులో ఉన్న గిరిధర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కార్యాలయ ముఖ్యకార్యదర్శిగా తొలుత నియమించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తొలి రోజుల్లో సీఎం కార్యాలయం ముఖ్యకార్యదర్శిగా గిరిధర్ అలుపెరగక రాత్రింబగళ్లు పనిచేశారు. కష్టపడి పనిచేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత మంది వందిమాగధుల చెప్పుడు మాటలను విని గిరిధర్ను సీఎం కార్యాలయం నుంచి మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. కొత్త రాజధాని నిర్మాణం, సింగపూర్ కంపెనీలతో మాస్టర్ ప్రణాళిక రూపకల్పన అంశాల్లో గిరిధర్ కీలక భూమిక పోషించారు. మాస్టర్ ప్రణాళికలోని అంశాలపైన, మాస్టర్ డెవలపర్ ఎంపిక, స్విస్ చాలెంజ్పై ప్రభుత్వ విధానాలు గిరిధర్కు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో ఆయన ఈ నెల 1 నుంచే సెలవులో ఉన్నారు. గిరిధర్ను బదిలీ చేసినప్పటికీ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం ఆ బాధ్యతలను మున్సిపల్ శాఖ కార్యదర్శి జయలక్ష్మి చూస్తున్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్గా కరికాల వలవన్ యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శిగా పని చేస్తున్న కరికాల వలవన్ను పౌరసరఫరాల శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్గా కూడా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇదివరకు పౌరసరఫరాల కమిషనర్గా ఉన్న బి.రాజశేఖర్ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే పి.ఎస్. గిరీష్ను అనంతపురం జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్గా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించి ఆయనకు నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్గా నియమిం చింది.డిప్యుటేషన్పై వచ్చిన ఐఆర్ఎస్ అధికారి గోపీనాధ్ను రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్గా నియమిస్తూ ఉత్తర్వుల జారీ చేశారు. -
గల్లాపెట్టెకు తాళం..
45 రోజులుగా ఫ్రీజింగ్ - నిలిచిన ‘కల్యాణలక్ష్మి, షాదిముబారక్’ - బీసీ, ఎస్సీ కార్పొరేషన్లలోనూ అదే పరిస్థితి - పెండింగ్లో సుమారు రూ.10 కోట్ల చెల్లింపులు - జిల్లా ట్రెజరీ ఆఫీస్ చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు - ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ తప్పని తిప్పలు నక్కలగుట్ట : జిల్లా ఖజానా పెట్టెకు రాష్ట్ర ప్రభుత్వం తాళం వేసింది. జూన్ నుంచి తాత్కాలిక ఫ్రీజింగ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పలు పథకాల అమలుకు బ్రేక్ పడింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతోపాటు ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాల చెల్లింపులు నిలిచిపోయాయి. ఫలితంగా లబ్ధిదారులు జిల్లా ట్రెజరీ కార్యాలయం, దళిత, గిరిజన అభివృద్ధి శాఖలు, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల బిల్లులు కూడా ట్రెజరీలో చెల్లింపులకు నోచుకోకుండా పడి ఉన్నాయి. లబ్ధిదారులకు దాదాపుగా రూ.9.92 కోట్లు పెండింగ్లో పడ్డాయి. సుమారు 45 రోజులు కావొస్తున్నా.. ప్రభుత్వం ఫ్రీజింగ్ ఎత్తివేయకపోవడంతో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ‘కల్యాణలక్ష్మి’లో... దళిత అభివృద్ధి శాఖ : జిల్లా దళిత అభిృృద్ధి శాఖ ద్వారా కల్యాణలకిృ్ష్మ పథకంలో మొత్తం 389 మంది లబ్ధిదారులకు ఆర్థికసాయం మంజూరైనా.. ఫ్రీజింగ్ కారణంగా బిల్లులు జిల్లా ట్రెజరీ కార్యాలయంలోనే నిలిచిపోయాయి. ఈ శాఖ ద్వారా మొదటి విడతలో 285, రెండో విడత 104 కల్యాణలక్ష్మి బిల్లులు దాఖలయ్యాయి. ఇవన్నీ ట్రెజరీలో పెండింగ్లో ఉన్నాయి. దీంతో లబ్ధిదారులు జిల్లా దళిత అభివృద్ధి శాఖ జిల్లా కార్యాలయంృ ఏఎస్డబ్ల్యూఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గిరిజన సంక్షేమశాఖ : జిల్లా గిరిజన సంక్షేమశాఖ ద్వారా కల్యాణలక్ష్మి పథకంలో 410 మంది దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల విచారణ పూర్తయి, ట్రెజరీలో బిల్లులు దాఖలు చేసినా... ఫ్రీజింగ్ అమలు కారణంగా చెల్లింపులకు నోచుకోకుండా నిలిచిపోయాయని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి సీహెచ్.రాంమూర్తి తెలిపారు. రెండు శాఖలు కలిపి 799 మందికి సుమారు రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంది. ‘షాదిముబారక్’ అంతే.. ముస్లిం నిరుపేద కుటుంబాల్లోని అవివాహిత యువతుల వివాహానికి ఆర్థికసాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న షాదిముబారక్ పథకం పరిస్థితి కూడా కల్యాణలక్ష్మిలాగే తయారైంది. ఫ్రీజింగ్ కారణంగా చెల్లింపులు నిలిచిపోయాయి. 2014-15లో షాదిముబారక్లో 333 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే.. 332 మందికి సర్కారు బిల్లులు మంజూరు చేసింది. 2015-16లో 570 మంది షాది ముబారక్ పథకం కింద దరఖాస్తు చేసుకోగా.. 394 మందికి మాత్రమే బిల్లులు చెల్లించారు. ఇంకా 169 మంది లబ్దిదారులకు ఫ్రీజింగ్ కారణంగా బిల్లులు చెల్లించలేదు. షాదిముబారక్ కింద లబ్ధిదారులకు చెల్లించాల్సిన సుమారు రూ.86 లక్షలు పెండింగ్లో పడ్డాయి. ఎస్సీ కార్పొరేషన్లో... జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 400 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ అందజేసింది. ఫ్రీజింగ్ అమలు కారణంగా మరో 170 మంది లబ్ధిదారులకు సబ్సిడీ చెల్లించలేదు. లబ్ధిదారులకు సుమారు రూ.1.79 కోట్లు చెల్లించాల్సి ఉంది. బీసీ కార్పొరేషన్లో... జిల్లా బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు ఎంపికైన 830 మంది లబ్ధిదారులకు బ్యాంకులు రుణాల చెల్లిస్తే, బీసీ కార్పొరేషన్ సబ్సిడీ మంజూరు చేయాల్సి ఉంది. నిధుల లేమి కారణంగా బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించకపోవడంతో అటు రుణాలు, ఇటు సబ్సిడీ విడుదల కాక లబ్ధిదారులు బీసీ కార్యాలయంచుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు. లబ్ధిదారులకు సుమారు రూ.2 కోట్లు చెల్లించాలి. ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు కూడా.. జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి జీతాల బిల్లులు కూడా ఫ్రీజింగ్ కారణంగా ట్రెజరీలో నిలిపివేశారు. దీంతో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క కలెక్టరేట్లో ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులు 1,500 మంది ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన వారికి సుమారు రూ.1.27 కోట్లు చెల్లించాలి. -
ఆర్థిక శాఖలో 13 కొత్త పోస్టులు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక శాఖలో 13 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ కేటగిరీల్లో 6 రెగ్యులర్ పోస్టులు, 7 సూపర్ న్యూమరరీ పోస్టులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త వాటిలో రెండు జాయింట్ సెక్రటరీ, ఒక డిప్యూటీ సెక్రటరీ, రెండు అసిస్టెంట్ సెక్రటరీ, పీఎస్ టు సెక్రటరీ పోస్టులున్నాయి. వీటితో పాటు సూపర్ న్యూమరరీ జాబితాలో నాలుగు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, రికార్డు అసిస్టెంట్, జమేదార్, డ్రైవర్ పోస్టులు ఒక్కోటి చొప్పున ఉన్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement