breaking news
infosys co-founder
-
ఆ పరీక్ష మిస్ అవ్వడం వల్లే.. సక్సెస్ అయ్యా!: నందన్ నీలేకని
జరిగేదంతా మన మంచికే అనే మాట.. చాలామంది తమ నిత్యజీవితంలో అనేక సందర్భాల్లో వినే ఉంటారు. కానీ జరిగిపోయింది కూడా మంచికే అంటున్నారు.. ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ 'నందన్ నీలేకని' (Nandan Nilekani). ఇంతకీ ఎందుకిలా అంటున్నారు?, దాని వెనుక ఉన్న కారణం ఏమిటనేది.. ఇక్కడ చూసేద్దాం.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT Bombay) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నీలేకని.. ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM)లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకున్నారు. కానీ అదే సమయంలో తనకు ఆరోగ్యం సరిగ్గాలేకపోవడంతో.. పరీక్ష రాయలేకపోయారు. అంతే కాకుండా.. SAT లేదా GMATకు అప్లై చేసుకోవడానికి తాను బద్దకించినట్లు ఆయన పేర్కొన్నారు.ఆ తరువాత ముంబైలో ఉన్న ఒక చిన్న టెక్ సంస్థ పట్ని కంప్యూటర్ సిస్టమ్స్ కంపెనీ గురించి తెలుసుకుని నందన్ నీలేకని అక్కడ చేరారు. ఆ సమయంలోనే ఎన్ఆర్ నారాయణమూర్తి (NR Narayana Murthy)ని కలిశారు. అప్పుడే తన జీవితం ఒక మలుపు తిరిగింది. సొంతంగా కంపెనీ స్థాపించాలని నారాయణమూర్తి ఆలోచన నచ్చింది. దీంతో నా అడుగులు.. ఆయన వెంట సాగాయని నీలేకని వెల్లడించారు. మా ప్రయాణంలో.. మాలాంటి ఆలోచన కలిగిన మరో ముగ్గురుని కలిశాము. ఆ తరువాత ఇన్ఫోసిస్ స్థాపించామని వివరించారు.ఇన్ఫోసిస్ ప్రారంభించినప్పుడు.. చాలా ఇబ్బందులను ఎదురుకున్నారు. కానీ పట్టుదలతో శ్రమించడం వల్లనే.. ఆ కంపెనీ దిగ్గజ ఐటీ కంపెనీల జాబితాలో ఒకటిగా నిలిచింది. 2002 మార్చి నుంచి 2007 ఏప్రిల్ వరకు ఇన్ఫోసిస్ సీఈఓగా పనిచేశారు. ఆ సమయంలో కంపెనీ గణనీయమైన వృద్ధిని సాధించింది.నిజానికి ఆ రోజు పరీక్ష రాయకపోవడమే మంచిదైందని నీలేకని చెబుతారు. ఒకవేళ పరీక్ష రాసుంటే.. విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఆ పరీక్ష రాయకపోవడం వల్ల.. నారాయణమూర్తిని కలిసి కంపెనీ స్థాపించారు. ఇదంతా చూస్తుంటే.. ఆ రోజు జరిగిన పని నందన్ నీలేకని జీవితాన్నే మార్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి -
ఇన్ఫోసిస్ అంటే బృహస్పతినా?
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య సర్వేపై ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి చేసిన విమర్శలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిప్పికొట్టారు. ఈ సర్వే వెనుకబడిన తరగతులకు సంబంధించినది కాదని పదేపదే చెప్పినా నారాయణమూర్తి దంపతులకు అర్థంకాలేదని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇది (సర్వే) వెను కబడిన కులాలకు సంబంధించినదనే అపోహ కొందరిలో ఉంది. ఇది వెనుకబడిన కులాల సర్వే కాదు. దీని గురించి రాసేవాళ్లు ఏమై నా రాసుకోనీయండి. ఈ సర్వే ఎందుకోసమనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటే చాలు. వాళ్లకు (నారాయణమూర్తి దంపతులకు) దీనిగురించి అర్థంకాకపోతే నేనేం చేయాలి?’అని ప్రశ్నించారు.వాళ్లు సర్వజ్ఞులా?ప్రభుత్వ సర్వేపై నారాయణమూర్తి దంపతులు గురువారం విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. వారి ఇంటికి సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లకు వారు సహకరించలేదని తెలిసింది. తాము వెనుకబడిన వర్గానికి చెందినవారము కాదని, అందువల్ల సర్వేలో పాల్గొనబోమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నారాయణమూర్తి దంపతుల తీరుపై సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. ‘ఇన్ఫోసిస్ అంటే ఏమైనా బృహస్పతినా (మేధావి)? ఇది వెనుకబడిన వర్గాల సర్వే కాదని, అందరి సర్వే అని మేం 20 సార్లు చెప్పాం. మా ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి శక్తి పథకాన్ని ప్రారంభించింది. గృహలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2,000 ఇస్తున్నాం. శక్తిపథకాన్ని వినియోగించుకుంటున్నవారిలో అగ్రకుల మహిళలు, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారు లేరా? గృహలక్ష్మి పథకంలో అగ్రకుల మహిళలు లేరా? కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేపడుతోంది. మూర్తి దంపతులు ఆ సర్వేలో ఏం చెప్తారు? బహుషా తప్పుడు సమాచారం ఇస్తారేమో! నేను మళ్లీమళ్లీ చెప్తున్న ఇది వెనుకబడిన వర్గాల సర్వే కాదు. ఏడు కోట్లమంది కన్నడిగులకు సంబంధించిన సర్వే’అని స్పష్టంచేశారు.మార్పు అనేది విప్లవం కాదురాష్ట్రంలో సీఎం మార్పుపై కూడా ఆయన స్పందించారు. ‘కొందరు నవంబర్ క్రాంతి అంటున్నారు. అది క్రాంతి కాదు. క్రాంతి అంటే విప్లవం. మార్పు అనేది విప్లవం కాదు’అని పేర్కొన్నారు. నాయకత్వ మార్పు అంశం సమయం సందర్భం లేకుండా చర్చకు వస్తోందని, దీనిని పెద్దగా పట్టించుకోవా ల్సిన అవసరం లేద ని అన్నారు. ప్రభుత్వ భూములు, స్కూళ్లు, కాలేజీల్లో ఆరెస్సెస్ కార్యకలాపాలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. ‘ఇది ఒక్క ఆర్ఎస్ఎస్కు సంబంధించిన నిర్ణ యం కాదు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ సంస్థ కూడా కార్యకలాపాలు నిర్వహించటం కుదరదు. నిజా నికి ఈ నిర్ణయం గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగదీశ్ షెట్టర్ సర్కారు తీసుకుంది’అని పేర్కొన్నారు. -
Nandan Nilekani: ఎఎ నెట్వర్క్తో కోట్ల కొద్దీ ఉద్యోగాలకు ఊతం
న్యూఢిల్లీ: ఆర్థిక వివరాల డేటా షేరింగ్ ప్లాట్ఫాం అయిన అకౌంట్ అగ్రిగేటర్ (ఎఎ) నెట్వర్క్తో వ్యాపారాలను అనుసంధానించడం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు రుణలభ్యత సులభతరమవుతుందని ఐటీ సంస్థ ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని తెలిపారు. దీనితో కోట్ల కొద్దీ ఉద్యోగాలకు కూడా ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ’జీఎస్వీ + ఎమెరిటస్ ఇండియా సదస్సు’లో పాల్గొన్న సందర్భంగా నీలేకని ఈ విషయాలు చెప్పారు. వ్యక్తులు .. ఒక ఆర్థిక సంస్థ దగ్గరున్న తమ వివరాలను వేరే సంస్థలతో సురక్షితంగా పంచుకునేందుకు ఎఎ నెట్వర్క్ ఉపయోగపడుతుంది. ఇది ఆర్బీఐ నియంత్రణలో ఉంటుంది. (ఇదీ చదవండి: లిథియం బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.37,260 కోట్లు కావాలంట!) -
మన ఐటీ కంపెనీలను చూసి నేర్చుకోండి
న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలను చూసి దేశంలోని ఇతర కంపెనీలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్ సూచించారు. మన ఐటీ కంపెనీలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారాయన. దేశంలోని పలు కంపెనీలు రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, ఐటీ కంపెనీలు మాత్రం ఎలాంటి రుణభారం లేకుండా ఉన్నాయని తెలిపారు. కంపెనీలన్నీ పరిశోధన, అభివృద్ధిలపై అధికంగా పెట్టుబడులు పెట్టాలన్నారు. ఇక్కడ జరిగిన సీఐఐ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత కంపెనీలు విదేశీ స్టాక్ మార్కెట్లలో కూడా లిస్ట్ కావాలని ఆయన సూచించారు. ‘‘చాలా దేశీయ కంపెనీలకు పోటీ అంటే భయం’’ అన్నారాయన. కంపెనీలు కార్పొరేట్ గవర్నెన్స్ను మెరుగుపరచుకోవాలని, అంతర్జాతీయంగా పోటీపడాలని సూచించారు. 1980లో 16,000 కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 2.8 లక్షల కోట్ల డాలర్లకు ఎగసిందని క్రిస్ తెలిపారు. 2025 కల్లా 5 లక్షల కోట్లడాలర్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు. 2025 లేదా 2030 నాటికి ఈలక్ష్యాన్ని సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. -
ఇపుడున్న ఉద్యోగాలు భవిష్యత్తులో ఉండవట..!
హైదరాబాద్: ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని యువకులకు షాకిచ్చే సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఉనికిలో ఉన్న ఉద్యోగాలు చాలా వరకు భవిష్యత్తులో ఉండకపోవచ్చని చెప్పారు. దీనికి పరిష్కారంగా ఏదో ఒకటి చేయాలని, విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. నిరుద్యోగుల్లో నైపుణ్యాల శిక్షణలోనూ, విద్యావ్యవస్థలో పూర్తి మరమ్మతుల అంశాల సమగ్ర పరిశీలనపై దృష్టిపెట్టాలని ఆయన కోరారు. ఎడ్యుకేషన్ సిస్టంలో వినూత్నమైన మార్పులతోపాటు, సృజనాత్మకత ఆధారిత నైపుణ్యాలను పెంచుకోవాలని సోమవారం పీటీఐకి చెప్పారు. ఈ తరహా నైపుణ్యాల పెంపు ద్వారా భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఇండియా (యుఐడిఎఐ) మాజీ చైర్మన్ నీలేకని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజలు జీవితాంతం నేర్చుకునే పనిలో ఉంటూనే, కొత్త కొత్త నైపుణ్యాలు, ఆలోచనలను పెంచుకోవాలని సూచించారు. ఈ మేరకు విద్యావ్యవస్థలో మార్పులు రావాలని కోరారు. ఈ విషయంలో ఒక పెద్ద మార్పు అవసరం ఉందని నీలేకని వ్యాఖ్యానించారు. ఆటోమేషన్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంజిలిజెన్స్ , బాట్స్ లాంటివి సాఫ్ట్ వేర్, బీపీఓ రంగంలో దూసుకొస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో మరిన్ని కొత్త ఉద్యోగావకాశాలు రాబోతున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న నైపుణ్యాలతో ఉద్యోగావకాశాలు పొందడం గతంలో ఉన్నంత తేలిక కాదన్నారు. ఆ వైపుగా దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. భారతదేశం యొక్క 7-8 శాతంగా జీడీపి వృద్ధి రేటు నిరుద్యోగానికి కారణమా అన్న ప్రశ్నకు దేశీయ సేవలపై దృష్టిపెట్టాలని నీలేకని చెప్పారు.


