breaking news
Infosys co-chairman
-
స్టార్టప్లకు ఫండమెంటమ్ నిధులు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కోచైర్మన్ నందన్ నీలేకని సహవ్యవస్థాపకుడిగా ఏర్పాటైన ఫండమెంటమ్ పార్టనర్షిప్ దేశీయంగా తొలి దశ స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు వీలుగా 22.7 కోట్ల డాలర్లు(రూ. 1,793 కోట్లు) సమీకరించినట్లు వెల్లడించింది. తద్వారా ప్రాథమికస్థాయి వృద్ధిలోగల స్టార్టప్లకు నిధులు అందించనున్నట్లు తెలియజేసింది. రానున్న ఐదేళ్లలో సిరీస్–బి రౌండ్ ద్వారా స్టార్టప్లకు పెట్టుబడులు సమకూర్చనున్నట్లు ఫండమెంటమ్ సహవ్యవస్థాపకుడు, జనరల్ పార్టనర్ ఆశిష్ కుమార్ పేర్కొన్నారు. ఏదైనా ఒక స్టార్టప్ కొన్ని మైలురాళ్లకు చేరడం, వృద్ధి బాట పట్టడం వంటి పరిస్థితుల్లో రెండో రౌండ్ ద్వారా నిధులను అందించే సంగతి తెలిసిందే. ఇది రెండో ఫండ్ అని పేర్కొన్న ఆశిష్ ఏడాదికి 4–5 స్టార్టప్లకు 2.5–4 కోట్ల డాలర్ల మధ్య పెట్టుబడులు సమకూర్చనున్నట్లు వివరించారు. 10 కోట్ల డాలర్లతో తొలి ఫండ్ను నిర్వహించిన ఫండమెంటమ్.. ప్రస్తుతం యూనికార్న్ హోదాను పొందిన ఫార్మ్ఈజీ, స్పిన్నీ తదితరాలకు నిధులు అందించిన విషయం విదితమే. -
బోర్డు, వ్యవస్థాపకులను ఒక్కతాటిపైకి తెస్తా
బెంగళూరు: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, మేనేజ్మెంట్ను ఒక్క తాటిపైకి తేవడం, విభేదాలు లేకుండా అంతా కలిసికట్టుగా పనిచేసేలా చూడటమే తన ప్రధాన లక్ష్యమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ చైర్మన్ రవి వెంకటేశన్ తెలిపారు. ఇది ’సాధ్యపడే’ విషయమేనని, తాను నాన్ ఎగ్జిక్యూటివ్ కో–చైర్మన్ అయినప్పటికీ వారంలో నాలుగైదు రోజులు దీనికే సమయం కేటాయిస్తున్నానని ఆయన వివరించారు. టాప్ మేనేజ్మెంట్ వ్యవహార శైలిపై ఇన్ఫీ ప్రమోటర్లు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రవి వెంకటేశన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కంపెనీ గానీ ఐకమత్య స్ఫూర్తిని రగిల్చగలిగితే పరిస్థితులు వాటంతటవే సర్దుకోగలవని ఆయన తెలిపారు. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు మొదలైన వాటిపై సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి స్థాయి వ్యక్తి మాట్లాడారంటే అంతా కచ్చితంగా దానిపై దృష్టి పెట్టాల్సిందేనని రవి చెప్పారు. మరోవైపు, ఇన్ఫీ నుంచి తాను తప్పుకోకుండా ఉండాల్సిందంటూ మూర్తి ఇటీవల బాధపడటంపై స్పందిస్తూ.. తాను వాటి గురించి మాట్లాడబోనని, దీనిపై వివరణనిచ్చేందుకు ఆయనే సరైన వ్యక్తి అని తెలిపారు. ప్రస్తుత సీఈవో విశాల్ సిక్కాను ఎంపిక చేసిందే నారాయణ మూరి అని రవి వివరించారు. సిక్కా అనేక సానుకూల మార్పులు తీసుకొచ్చారని, ఆయన ఐడియాలను ఉద్యోగులు, క్లయింట్లతో పాటు మూర్తి కూడా మెచ్చుకునే ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు.