భారత్ వేదికగా మహిళల చాంపియన్స్ ట్రోఫీ
మహిళల క్రికెట్లో తొలిసారి నిర్వహించనున్న చాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారత్కు ఆతిథ్య హక్కులను జారీ చేస్తూ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ముంబై, వడోదర వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీలో టాప్-6 టీమ్స్ తలపడనున్నాయి. అయితే తొలుత మహిళల తొలి చాంపియన్స్ ట్రోఫీకి శ్రీలంక ఆతిథ్యమివ్వాల్సింది. కానీ ప్రస్తుతం శ్రీలంక పాలనా పరమైన సమస్యలతో సతమతమవుతున్న వేళ ఐసీసీ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక నుంచి భారత్కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో టోర్నీ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో జూలైలో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో లంకకు బదులుగా టోర్నీని బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, భారత్ రూపంలో మూడు ప్రతిపాదనలు చేసింది. తాజాగా ఐసీసీ బుధవారం భారత్కు ఆతిథ్య హక్కులు కట్టబెడుతూ తుది నిర్ణయం తీసుకుంది. జూలై 6 అర్హత కటాఫ్ తేదీ నాటికి ఐసీసీ మహిళల టీ20ఐ టీమ్ ర్యాంకింగ్స్లో తమ స్థానాల ప్రకారం అర్హత సాధించిన ఆ ఆరు జట్లు రౌండ్-రాబిన్ లీగ్లో పోటీపడతాయి. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్కు చేరుకుంటాయి. కటాఫ్ ర్యాంకింగ్స్ ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంకలు తొలి చాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నాయి.India set to host the inaugural ICC Women's Champions Trophy 2027 from 14 to 28 February.The Cricket Club of India (CCI) in Mumbai and the Vadodara International Cricket Stadium will be the venues for the landmark tournament.More details here - https://t.co/PlDTCL9adC pic.twitter.com/NwM4zPrZk8— BCCI (@BCCI) September 2, 2026 A landmark moment for women’s cricket awaits. The dates and venues for the inaugural Women’s Champions Trophy in 2027 are now confirmed, as India prepares to welcome the world’s best teams from 14-28 February.Read more ➡️ https://t.co/QrY2iyDwyU pic.twitter.com/m7cWLxY8I8— ICC (@ICC) September 2, 2026Read: ఆసీస్తో సిరీస్కు పక్కనబెట్టారు.. కట్చేస్తే ట్రిపుల్ సెంచరీ