breaking news
Hybrid varieties
-
ఈ మొక్కే ఒక ఎరువుల ఫ్యాక్టరీ!
రైతును ఎటువంటి ఎరువూ అడగకపోగా.. తనే పోషకాల పంట పండించి ఇచ్చే అత్యంత అరుదైన, ఎన్నో సుగుణాలున్న అద్భుతమైన మొక్క ‘కాంఫ్రే’. బోరేజ్ కుటుంబం. సింఫిటమ్ జాతి. యూరప్, ఆసియాలకు చెందినది. ఆ ప్రాంతం అంతటా 40 జాతులు నమోదయ్యాయి. ఇంగ్లండ్లో దీనిపై ఇద్దరు వ్యక్తులు విస్తృతంగా పరిశోధనలు చేశారు.రెండు అడవి కాంఫ్రే జాతుల సంకరంతో ‘రష్యన్ కాంఫ్రే’ (సింఫిటమ్ అప్లాండికమ్) హైబ్రిడ్‡జాతి రూపొందింది. ఈ మొక్కల విశిష్ట ప్రయోజనాలను తొలుత గుర్తించిన వ్యక్తి హెన్రీ డబుల్డే (1810–1902). అతను ఈ మొక్కను ఆహారం, పశువులు, కోళ్ల మేత పంటగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన తర్వాత లారెన్స్ డి హిల్స్ (1911–1991) ఆ కృషిని కొనసాగించారు. 1950వ దశకంలో ఇంగ్లండ్లోని బోకింగ్ అనే గ్రామంలో కాంఫ్రే పరిశోధన కేంద్రంలో 21 రకాల కాంఫ్రే జాతులపై హిల్స్ ప్రయోగాలు చేశారు. పోషకాలు అధికంగా ఉండే మేలైన రకాన్ని గుర్తించి ’బోకింగ్ 14 కాంఫ్రే’ అని పేరు పెట్టారు. ఎన్పీకే ఎరువులతో కూడిన ఆకులుచిన్న దుంప తెచ్చి ఒక్కసారి నాటితే చాలు.. కనీసం పదేళ్లు వేగవంతంగా పెరుగుతూ ముఖ్యమైన పోషకాలతో కూడిన ఆకులను ‘కాంఫ్రే’ మొక్క నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. కాంఫ్రే ఆకుల్లో నత్రజని, ఫాస్ఫరస్, ఫాస్ఫేట్ (ఎన్పీకే ఎరువులు) పుష్కలంగా ఉండటం విశేషం. ఈ మొక్క పెద్ద మొత్తంలో ఆకులను ఉత్పత్తి చేస్తుంది. 20–25 రోజులకోసారి పోషకాలతో నిండిన ఆకులు కోతకు వస్తూనే ఉంటాయి. కోసిన ప్రతిసారీ మొక్క మళ్లీ వేగంగా పెరుగుతుంది. అందుకే దీన్ని ‘డైనమిక్ న్యూట్రియంట్ ఎక్యుములేటర్’ అని పిలుస్తారు. మల్చింగ్ పచ్చిరొట్ట ఉత్పత్తికి ఇది అద్భుతమైన వనరు.ఇదీ చదవండి: మంచులో రీల్స్..క్షణం ఆలస్యమై ఉంటే.. వైరల్ వీడియో16–18 సార్లు ఆకుల కోతమొక్కలకు ఎంత బాగా నీరు పోసి పోషిస్తారు అనే దానిపై ఆధారపడి సంవత్సరానికి 16 నుంచి 18 సార్లు కత్తిరించవచ్చని కాంఫ్రే మొక్కల పెంపకంలో అనేక దశాబ్దాల అనుభవం గల ప్రముఖ పర్మాకల్చరిస్టులు కొప్పుల నరసన్న, పద్మ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తోటల్లో ప్రతి పండ్ల చెట్టు పక్కన ఈ మొక్క నాటితే చాలన్నారు. కాంఫ్రే వేర్లను కొన్ని అడుగుల లోతు వరకు చొప్పిస్తుంది. రెండు మీటర్ల లోతు వరకు దీని వేర్లు వెళ్తాయట. ఇతర మొక్కలకు అందనంత లోతు నుంచి పోషకాలు కాంఫ్రే ఆకుల ద్వారా నేలపైకి వస్తాయి. ఈ ఆకులను మల్చింగ్గా వేయటం లేదా కంపోస్టుగా మార్చి పంటలకు వేయటం ద్వారా ఆ పోషకాలు ఇతర పంటలకు అందించవచ్చు. కాంఫ్రే ఆకులను పొడి చేసి కూరగాయ మొక్కలు, పండ్ల చెట్లకు వేయొచ్చు. పచ్చి ఆకులను నేరుగా ఆచ్ఛాదనగా వేసుకోవచ్చు లేదా కాంఫ్రే ఆకులను తరిగి నీటిలో అనేక వారాల పాటు ఊడబెట్టి ద్రావణాన్ని తయారు చేసి వాడుకోవచ్చు.ఎండ, నీడ, నీరు ఉండాలిఏ రకమైన నేలల్లో అయినా కాంఫ్రే పెరుగుతుంది. అయితే, తేమ ఆరిపోకుండా ఉండే సారవంతమైన నేలలకు అనువైనది. పీహెచ్ 6.5–8.5 మధ్య ఉండాలి. 6–7 మధ్య పీహెచ్ ఉన్న నేలల్లో ఇది బాగా పెరుగుతుందని చెబుతున్నారు. మన ఉష్ణమండలంలో ఇది పెరగాలంటే పాక్షికంగా చెట్టు నీడ అవసరం. కొంతసేపు ఎండ కూడా అవసరమే. అదేమాదిరిగా నీటి తేమ నిరంతరం ఉండేలా చూసుకోవాలి అని నరసన్న, పద్మ తెలిపారు. కూరగాయ తోటలు, పండ్ల తోటలు, కలప తోటల్లో సాళ్ల మధ్య కాంఫ్రేని నాటుకోవచ్చు. నీటి ఎద్దడిని తట్టుకునే కాంఫ్రే వంగడాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వాటిని గుర్తించి మన దేశంలోకి దిగుమతి చేసి, రైతులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవటం ఉపయోగకరం.పశుగ్రాసంగానూ పనికొస్తుంది కాంఫ్రే ఆకులను పశుగ్రాసంగా సుదీర్ఘ కాలంగా ఉపయోగిస్తున్నారు. లారెన్స్ డి హిల్స్ ఈ అంశంపై పుస్తకాలు రాశారు. తాజా ఆకులను పందులు, గొర్రెలు, కోళ్లు ఇష్టంగా తింటాయి. కానీ పశువులు, కుందేళ్ళు, గుర్రాలు వాడిపోయిన ఆకులను మాత్రమే తింటాయని హిల్స్ పేర్కొన్నారు. ఈ మొక్కకు గంట ఆకారంలో పువ్వులు పూస్తాయి. అనేక జాతుల తేనెటీగలు, కందిరీగలు, సాలె పురుగులు ఇతర మిత్ర పురుగులకు ఈ మొక్కలు ఆవాసం కల్పిస్తాయి. బూజు తెగులును నివారించడానికి కాంఫ్రే ఆకుల ద్రావణాన్ని ఉపయోగించవచ్చని పరిశోధన సూచిస్తుంది. ఇంగ్లండ్లో ఒక పర్మాకల్చరిస్టు అంచనా ప్రకారం.. అక్కడి వాతావరణంలో మొక్కకు 5.5 కిలోల బరువైన ఆకులను ఒక ఏడాదిలో కోసుకోవచ్చు. 10 మీటర్ల పొడవు 4 అడుగుల వెడల్పు గల ఎత్తు మడిలో అడుగు– అడుగున్నర దూరంలో 52 మొక్కలు వేస్తే ఏడాదిలో 286 కిలోల ఆకు వస్తుంది. ఈ ఆకు ద్వారా పొటాషియం 2.08 కిలోలు, నత్రజని 104 కిలోలు సమకూరుతుందని అంచనా. వాతావరణాన్ని బట్టి, నేల సారాన్ని బట్టి ఇది మారుతుంది. విరిగిన ఎముకలను కట్టుకునేలా చేసే ఔషధ గుణాలు కాంఫ్రే ఆకుల్లో ఉన్నాయి. ఈ ఆకులను మనుషులు కూడా గతంలో తినేవారు. నొప్పులు తగ్గుతాయని కషాయం తాగేవారు. అయితే, లివర్పై దుష్ప్రభావం ఉంటుందని 20 ఏళ్ల క్రితం పరిశోధనల్లో తేలింది.ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్ సిరప్ బ్యాన్అత్యంత అరుదైన మొక్క కాంఫ్రేకాంఫ్రే అరుదైన అద్భుత మొక్క. భూసారం పెంపొందించటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కోళ్లు ఈ ఆకులను ఇష్టంగా తింటాయి. విరిగిన ఎముకలను కట్టించటానికి కూడా ఇది ఉపయోగమే. చలి దేశాల నుంచి తీసుకొచ్చి 1987 నుంచి కాంఫ్రే మొక్కలను గత ఏడాది వరకు పెంచాం. ఆదిలాబాద్ దగ్గర మా పొలంలో ఒక ఎకరంలో పూర్తిగా కాంఫ్రే ఉండేది. మన వాతావరణానికి ఈ మొక్క అలవాటు పడింది. చాలామంది రైతులకు ఇచ్చాం. చాలామంది రైతులకు ఇచ్చాం. అయితే, మేం వేరే పనిలో ఉండి ఒక సంవత్సరం అంతగా శ్రద్ధ పెట్టలేదు. మొక్కలన్నీ చనిపోయాయి. కాంఫ్రే మొక్కల ఆకులు నేలపై మల్చింగ్ చేసేవాళ్లం. ఆకులతో ద్రావణం తయారు చేసి కూరగాయలు, పండ్ల చెట్ల పోషణ కోసం వాడేవాళ్లం. కంపోస్టులో వాడేవాళ్లం. 6–7 అంగుళాల ఎత్తు పెరుగుతుంది. ఏడాదికి 16–18 సార్లు ఆకులను కత్తిరించి వాడుకోవచ్చు. అల్లం మాదిరిగా దీనికి పాక్షికంగా ఎండ, నీడ కావాలి. నీరు రోజూ ఇవ్వాలి. పావెకరంలో 500 మొక్కలు పెట్టొచ్చు. పండ్ల చెట్లకు పక్కనే పెరుగుతూ పోషకాలు అందించే నర్స్ ప్లాంట్గా కాంఫ్రే పనికొస్తుంది. ఆకు గరుకుగా నూగుతో కూడి ఉండటం వల్ల అతి త్వరగా 3 రోజుల్లోనే కుళ్లి మట్టిలో కలిసిపోతుంది. మనుషులకే కాదు పశువులకూ బోన్సెట్టర్గా ఉపయోగపడుతుంది. వ్యవసాయా నికి, పశుపోషణకు ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఈ మొక్కలను ప్రభుత్వం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాల నుంచి తెప్పించాలి. మన వాతావరణానికి సరిపడే కాంఫ్రే జాతులను దిగుమతి చేసుకొని రైతులకు అందించాలి. మన దేశంలో కూడా ఇటువంటి లక్షణాలున్న మొక్కలు ఉండే ఉంటాయి. మన శాస్త్రవేత్తలు పరిశోధించాలి. చేపలు ఇవ్వటం కన్నా చేపలు పట్టటం నేర్పితే ఎక్కువ మేలు జరుగుతుందన్నది నానుడి. అదే విధంగా రసాయనిక ఎరువులను రైతులకు ఇవ్వటానికి బదులు ‘ఎరువుల ఫ్యాక్టరీ’ వంటి అద్భుత మొక్కలను రైతులకు ఇస్తే ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. ఆ విదేశీ మొక్క పేరే ‘కాంఫ్రే’! చిన్న దుంప తెచ్చి ఒక్కసారి నాటితే చాలు.. కనీసం పదేళ్లు వేగవంతంగా పెరుగుతూ ఎన్పీకే ఎరువులతో కూడిన ఆకులను ‘కాంఫ్రే’ మొక్క నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఆకులు 20–25 రోజులకోసారి కోతకు వస్తూనే ఉంటాయి. అందుకే దీన్ని ‘డైనమిక్ న్యూట్రియంట్ ఎక్యుములేటర్’ అంటారు పంటలు, పండ్ల తోటల్లో గడ్డి పెరగకుండా పోషకాలను పండించే కవర్ క్రాప్గా పెంచుకోవచ్చు. ఆకులు కోసి ఆచ్ఛాదనగా వెయ్యొచ్చు. ఆకులను ఊరబెట్టి ద్రావణాన్ని గ్రోత్ ప్రమోటర్గా వాడొచ్చుపశువులకు, కోళ్లకు, పందులకు పోషకవంతమైన మేతగానూ కాంఫ్రే ఆకులు ఉపయోగపడతాయి జహీరాబాద్కు చెందిన పర్మాకల్చరిస్టులు నర్సన్న, పద్మకు ‘కాంఫ్రే’ సాగులో అనుభవం ఉంది కాంఫ్రే మొక్కల నుంచి ఏడాదికి 16–18 సార్లు ఆకులు కోసుకోవచ్చన్నారు ప్రభుత్వం రసాయనిక ఎరువులకు బదులు అద్భుతమైన ఈ మొక్కను ఇంగ్లండ్/ ఆస్ట్రేలియా నుంచి తెప్పించి ఇస్తే మేలని సూచిస్తున్నారు– కొప్పుల నరసన్న, పద్మ, సహ వ్యవస్థాపకులు, అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ, జహీరాబాద్ మొబైల్: 94408 26722 -
నయా టమాటా
సాక్షి, అమరావతి: కొత్త రకం టమాటా వంగడాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. యూఎస్–6242, అన్సోల్, జువేల్ వంటి హైబ్రీడ్ రకాలను రబీలో పైలట్ ప్రాజెక్ట్ కింద సాగు చేయగా.. సూపర్ సక్సెస్ కావడంతోపాటు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో నూతన వంగడాల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ సన్నాహాలు చేస్తోంది. ఏడాది పొడవునా టమాటాలు పండుతున్నా.. మార్కెట్ ధరల్లో తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటున్నాయి. కొన్ని రోజులు రైతులకు లాభాలు వస్తుండగా.. కొన్ని రోజులు కనీసం పెట్టుబడి కూడా దక్కడం గగనంగా మారుతోంది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ.. స్థానిక వెరైటీలకు ప్రత్యామ్నాయంగా యూఎస్–6242, అన్సోల్, జువేల్ వంటి హైబ్రీడ్ రకాలను ఉద్యాన శాఖ అందు బాటులోకి తెచ్చింది. గుజ్జు ఎక్కువ.. ధర మక్కువ లోకల్ వెరైటీ టమాటా రకాల్లో గుజ్జు శాతం ఎక్కువ లేకపోవడం వల్ల ప్రాసెసింగ్కు పూర్తిస్థాయిలో పనికిరావడం లేదు. విధిలేని పరిస్థితుల్లో రైతుల నుంచి తక్కువ ధరకు ప్రాసెసింగ్ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ గుజ్జు శాతం అధికంగా ఉండి ప్రాసెసింగ్తోపాటు స్థానికంగా వినియోగించుకునేందుకు వీలుగా ఉండే ఈ హైబ్రీడ్ రకాలను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ సంకల్పించింది. ఒకవేళ మార్కెట్లో కనీస ధర లేకపోయినప్పటికీ కిలోకు రూ.6 తక్కువ కాకుండా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా సేకరించి ప్రాసెసింగ్ కంపెనీలకు విక్రయించేలా అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేసవిలో చిత్తూరు జిల్లా పలమనేరు, వి.కోట మండలాల్లో 136 మంది రైతులను గుర్తించి వారి ద్వారా 250 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా హైబ్రీడ్ రకాలను సాగు చేశారు. సాగును ప్రోత్సహించేందుకు వివిధ రూపాల్లో హెక్టార్కు రూ.68,225 సబ్సిడీ ఇచ్చారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా లోకల్ వెరైటీలైన సాహో, సాహితీ రకాలకు ఆశించిన స్థాయిలో పూత రాలేదు. వచ్చిన పూత, పిందె రాలిపోవడంతో ఎకరాకు 15–20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఇదే సమయంలో హైబ్రీడ్ టమాటాలు 35–40 టన్నుల వరకు దిగుబడులొచ్చాయి. వైరస్ను తట్టుకుని తీవ్రమైన ఉష్ణోగ్రతల సమయంలో కూడా ఆశించిన స్థాయిలో దిగుబడులొచ్చాయి. మరోవైపు లోకల్ వెరైటీ టమాటాలు 15 కేజీల బాక్స్ రూ.70–రూ.80 ధర లభించగా.. హైబ్రీడ్ వెరైటీలకు రూ.190–రూ.200 వరకు ధర పలికింది. హైబ్రీడ్ రకాలకు రెట్టింపు ధరలు రావడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించారు. దీంతో రానున్న రబీలోనూ ఈ రకాలను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ సంకల్పించింది. హైబ్రీడ్ రకాలకు ఊతం సంప్రదాయ నాటు వెరైటీలకు ప్రత్యామ్నాయంగా హైబ్రీడ్ వెరైటీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. రబీలో పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో రానున్న రబీలో కూడా హైబ్రీడ్ రకాల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నాం. ధర లేకపోతే ప్రాసెసింగ్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం.– డి.మధుసూదనరెడ్డి, డీహెచ్ఓ, చిత్తూరు జిల్లా -
రంగుల్లో వరి వంగడాలు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రసాయన వ్యవసాయంలో హైబ్రిడ్ రకాల ప్రభావం పెరిగిపోతున్న ఈ రోజుల్లో దేశ వాళీ రకాల పరిరక్షణకు ఓ యువకుడు నడుం బిగించాడు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా.. ఆరంభంలో ఐదు రకాల వరి వంగడాలతో సాగు మొదలుపెట్టి, నేడు 300 పైచిలుకు వరి విత్తనాలను సాగుచేస్తున్నాడు. ఎలాంటి లాభాపేక్షకు పోకుండా.. దేశవాళీ రకాలను దేశమంతా విస్తరింపజేయాలన్న సంకల్పంతో పదిమందికి పంచుతూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు.. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం వ్యవసాయ విస్తరణ అధికారి యాదగిరి శ్రీనివాస్. వ్యవసాయంపై ఉన్న మక్కువకు తోడు సేంద్రియసాగులో పాలేకర్ ప్రభావంతో దేశీయవిత్తనాలను కాపాడాలనే లక్ష్యంతో తనకు ఉన్న మూడెకరాల వ్యవసాయభూమిలో సాగుచేస్తున్నాడు. పండించిన వరిధాన్యాన్ని తన అవసరాలకు పోగా, మిగిలిన వాటిని తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు చేసే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా సాగుతున్నాడు. వివిధ రకాల దేశవాళీ వరి వంగడాలను ఇతర ప్రాంతాల నుండి సేకరించి ప్రకృతి వ్యవసాయ(సేంద్రీయవిధానంలో పండిస్తున్నాడు. ఇంద్రధనస్సు రంగులీనే ఈ వంగడాలు బాలింతల్లో పాల వృద్ధికి, పురుషుల్లో వీర్యవృద్ధికి ఉపయోగపడటం విశేషం. రసాయనాలు లేని సేంద్రియ సాగు చేయాలన్న ఆకాంక్షతో 2009లో పాలేకర్ శిక్షణ శిబిరానికి ఏఈవో శ్రీనివాస్ హాజరయ్యారు. దీనిలో భాగంగా మొదట్లో పరిమళ సన్నా(తమిళనాడు), పంచరత్న (ఈశాన్యరాష్ట్రాల) కాలబట్టి(బెంగాల్, దుదేశ్వర్, అంబేమహర్(మహారాష్ట్ర)లకు చెందిన ఐదు రకాల వరి వంగడాలను తీసుకొచ్చి సాగు మొదలు పెట్టాడు. దేశంలో ఒకప్పుడు ఐదువేలకుపైగా రకాలు సాగులో ఉండేవి. ఇవి మనిషి జీవితంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అన్ని దశల్లోనూ కావాల్సిన పోషకాలను అందించగలవు. చిన్నారుల ఉగ్గు నుండి మొదలుకొని దేవుడి నైవేద్యం వరకు ప్రత్యేక రకాల వరి బియ్యం సాగులో ఉండేవి. ఆ రకాలను కాపాడాలన్న సంకల్పంతో ఇలా ఐదు నుంచి మొదలుపెట్టిన వరిరకాలు నేడు 300 వరివంగడాలకు చేరుకున్నాయి. శ్రీనివాస్ సాగు చేసే రకాలు.. 1) నల్లరంగు వడ్లు: పంచరత్న, కాలాబట్ట, బర్మాబ్లాక్, కరిగేజావలి, ఇల్లపు సాంబా, కరిజిద్దా, రమ్యగళి, నవార, కాకిరెక్కలు, కాలాజీరా, ముడిమురంగి, తలంగూర్, తైవాన్బ్లాక్, చిట్టిగ, కాజీసాల. 2) గోధుమ రంగు వడ్లు: మాపిళైసాంబా, కండసాగర్, ఆప్తోకల్, కస్మకుందా, హల్లబట్టా. 3) ఎరుపు రంగు వడ్లు: సేలం సన్న, చిన్న బైసి ల్మోర్, రాంశ్రీ, అరుకులోయ, కుంకుమసాలి. 4) పొట్టిగింజ వడ్లు: తులసీబాసో, డడ్డీగ, అంబేమోహర్, పరిమళ సన్న, నికో, బాలాజీ, రాధజీగేల్, బేళనాళా, జీరగసాంబా, టిక్కిమిస్రీ, సమేలీ బోగ్, బాస్ బోగ్, ఘని. 5) సువాసన వడ్లు: బాసుమతి(ఢిల్లీ, చంద్రగుప్తా, లోకల్), పరిమళ సన్న, సుగంధి, అంబేమొహర్. 6) సన్నవడ్లు: దూదేశ్వర్, చింతలూరి సన్న, ఛత్తీస్గఢ్, మచ్చ కాంత, డీఆర్కే2, రాణి కంద, సొనకడిక, నారాయణ కామిని, కమల్ సాంగ్రి, రత్న చోడి. 7) పొడవు వడ్లు: మల్లీపూల్, సన్నజాజులు. 8) దొడ్డు వడ్లు: నికో, బహురూపి, రెడ్ జాస్మిన్. సాగు చేసిన వాటిలో కొన్ని రకాల ప్రత్యేకతలు 1) పుంగార్: బాలింతలకు అధిక పాల వృద్ధికి దోహదపడుతుంది. 2) మపిలైసాంబా: యుక్త వయస్సు వారికి వీర్య వృద్ధికి తోడ్పడుతుంది. 3) కులాకార్: గర్బిణులకు సుఖ ప్రసవానికి ఉపయోగపడుతుంది. 4) నవారా: మధుమేహ వ్యాధి గ్రస్తులకు వ్యాధి నియంత్రణకు, నివారణకు ఉపయుక్తంగా ఉంటుంది. 5) బ్లాక్ రైస్: అన్ని రకాల నల్ల బియ్యం రోగనిరోధక శక్తి పెంపొందిస్తాయి. -
విత్తనమే కీలకం!
సాధారణంగా విత్తనాలు సూటి రకాలు, హైబ్రీడ్ రకాలుగా ఉంటాయి. సూటి రకాలంటే రైతులు ప్రతి సంవత్సరం తమ పంట నుంచి వచ్చిన విత్తనాన్ని తరువాత పంటగా వేసుకోవచ్చు. విత్తనాలను మార్చుకునేటప్పుడు ధ్రువీకరించిన వాటినే వేసుకోవడం మంచిది. హెబ్రిడ్ రకాలంటే ఏటా సంకర పర్చి తయారు చేసిన విత్తనాలు. ప్రతి పంట కాలానికి కొత్త విత్తనం వాడాల్సి ఉంటుంది. పాత విత్తనాలను వాడినట్లయితే దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ధ్రువీకరణ విత్తనం జన్యుపరమైన అసలు లక్షణాలు కలిగి, చీడపీడలను తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది. ఇతర వంట విత్తనాలు కానీ కలుపు మొక్కల విత్తనాలు లేకుండా పరిశుభ్రంగా ఉంటాయి. వ్యర్థ పదార్థాలు లేకుండా ధ్రుడమైన విత్తనాలు ఎక్కువ శాతం కల్గి ఉంటాయి. బాగా మొలకెత్తే ఎక్కువ మొలక సాంద్రత కల్గిన విత్తనాలు అధిక దిగుబడికి దోహదపడతాయి. విత్తనం ద్వారా వ్యాపించే శిలీంధ్రాల నుంచి రక్షణ ఎక్కువగా ఉంటుంది. విత్తనంలో నిర్ణీత తేమ శాతం వల్ల ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. నాణ్యమైన విత్తన లక్షణాలు నాణ్యమైన విత్తనమంటే వంద శాతం జన్యు స్వచ్ఛత మొలక శాతం కలిగి ఉండాలి. మేలైన విత్తనం 20 నుంచి 25 శాతం అవసరాల్లో 8 నుంచి 9 శాతం దిగుబడిని పెంచుతుంది. అంతర్గత చీడపీడలు లేని ఆరోగ్యకరమైన విత్తనమే నాణ్యంగా ఉన్నట్లు లెక్క. విత్తనాలు తయారు చేసుకోవడం ఇలా.... ప్రతి రైతు తనకు కావాల్సిన విత్తనాలను తన పంట నుంచి లేదా బాగా పండిన ఇతర రైతుల పంట నుంచి సేకరించాలి. భద్రంగా దాచుకోవాలి. స్వపరాగ సంపర్కం జరిగే పంటలలో రైతులు ఎవరి విత్తనాన్ని వారు తయారు చూసుకుంటే విత్తనంపై పెట్టే పెట్టుబడి తగ్గడమే కాకుండా నాణ్యమైన విత్తనాన్ని పొందే అవకాశం ఉంటుంది. విత్తనోత్పత్తి చేసే పొలం సారవంతమైనదిగా ఉండాలి. నీటి వసతితో పాటు మురుగునీరు పోయేలా ఏర్పాట్లు ఉండాలి. విత్తనం కోసం పండించే పొలానికి అదే పంటకు చెందిన ఇతర రకాల పొలానికి మధ్య కనీస దూరం ఉండాలి. విత్తనోత్పత్తి చేయదల్చిన పొలంలో నీటితడి ఇచ్చినట్లయితే అంతకు ముందు పండించిన రకం విత్తనాలు మొలకెత్తుతాయి. తరువాత గొర్రు, గుంటుకతో దుక్కి చేయిస్తే పొలంలో ఉండే కల్తీ మొక్కులతో పాటు కలుపు మొక్కలు నాశనం అవుతాయి. విత్తనోత్పత్తి చేసే పొలంలో బెరుకులు (కేశీలు) ఏరి వేయాలి. మొక్క ఎదుగుదల దశలో పంట పూత దశలో గింజ గట్టిపడే దశలో మూడు సార్లు కలుపు మొక్కలు లేకుండా చూడాలి. మొదటి దశ ఎత్తులో తేడా ఉన్న మొక్కలను పీకేయాలి. ఆకుల రంగు, ఆకారం, అమరికలో తేడా లేకుండా చూడాలి. రెండో దశలో కంకుల్లో తేడా ఉన్న మొక్కలను తొలగించాలి. రెమ్మల అమరిక, పుప్పొడి రంగులో తేడా పుప్పొడి తిత్తుల్లో తేడా లేకుండా చూసుకోవాలి. మూడోదశలో గింజ ఆకారం, పరిమాణం, గింజ రంగు వీటన్నింటినీ రెండు మూడు సార్లు విత్తన క్షేత్రమంతా తిరిగి ఏరి వేయాలి. -
విత్తనం మనదైతే.. ఆ దిగుబడే వేరబ్బా!
ఒంగోలు టూటౌన్ : రైతులు విత్తనాల కోసం ప్రైవేట్ కంపెనీలను ఆశ్రయించడం.. అవి సరిగ్గా మొలకెత్తకపోవడం.. ఒకవేళ మొలకెత్తినా దిగుబడి లేకపోవడం వెరసి అన్నదాత తీవ్రంగా నష్టపోతున్నాడు. ఈ నేపథ్యంలో రైతులే నాణ్యమైన విత్తనాలు తయారు చేసుకుంటే ఆశించిన దిగుబడి దక్కుతుందని వ్యవసాయశాఖ జిల్లా సంచాలకుడు జే ముర ళీకృష్ణ పేర్కొన్నారు. మేలైన విత్తనం వాడితే.. జన్యు, స్వచ్ఛత, అధిక మొలక శాతం కలిగి ఉండటంతో పాటు అధిక దిగుబడిని ఇవ్వగలిగే శక్తి ఉండాలి. మేలైన విత్తనం వాడితే 20 శాతం నుంచి 25 శాతం అధిక దిగుబడిని పొందే అవకాశముంటుంది. విత్తనాల్లో రకాలు విత్తనాల్లో సూటి, హైబ్రిడ్ రకాలు ఉంటాయి. సూటి రకాలంటే రైతులు ఏటా తమ పంట నుంచి వచ్చిన విత్తనాన్ని తర్వాత పంటగా వేసుకోవచ్చు. ఈ పద్ధతిలో రైతులు తమ విత్తనాలను ప్రతి మూడు, నాలుగేళ్లకోమారు మార్చుకోవాల్సి ఉంటుంది. విత్తనాలను మార్చే సమయంలో ధ్రువీకరించిన విత్తనాలు ఎంచుకోవాలి. హైబ్రిడ్ రకాలంటే ఏటా ఆడ, మగ రకాలను సంకరపరిచి తయారు చేసిన విత్తనాలు. ప్రతి పంట కాలానికి కొత్త విత్తనం వాడాల్సి ఉంటుంది. పాత విత్తనాలు అంతగా పనికిరావు. దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. విత్తనం తయారీ ఇలా.. స్వపరాగ సంపర్కం జరిగే పంటలో రైతులు ఎవరి విత్తనాన్ని వారు తయారు చేసుకుంటే విత్తనంపై పెట్టుబడి తగ్గడంతో పాటు మేలు రకాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. విత్తనోత్పత్తి చేసే పొలం సారవంతమైనదై ఉండాలి. మురుగు నీరు నిల్వ ఉండకూడదు. విత్తనం కోసం పండించే పొలానికి అదే పంటకు చెందిన ఇతర రకాలు సాగవుతున్న పొలానికి మధ్య కనీస దూరం ఉండాలి. విత్తనోత్పత్తి చేయదలచిన పొలానికి నీరు పెడితే అంతకు ముందు పండించిన పంట రకం మొలకెత్తుతుంది. వాటిని గొర్రు, గుంటకతో నాశనం చేయాలి. పొలంలో బెరుకులు లేకుండా చూసుకోవాలి. మొక్క ఎదిగేటప్పుడు పూత, గింజ గట్టిపడే దశలో ఏరిపాయాలి. ఎత్తులో తేడాలున్నా ఆకుల రంగు, ఆకారం, అమరిక సరిగా లేకున్నా వెంటనే గుర్తించి తొలగించాలి. ఏ విత్తనమైనా నారు పోసే ముందు విత్తన శుద్ధి తప్పని సరి. రైతులు తమ పంట నుంచి గానీ లేదా బాగా పండించిన ఇతర రైతుల నుంచి గానీ విత్తనాలు సేకరించి నిల్వ చేసుకోవాలి.


