-
మూర్ఛ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు
హోమియో కౌన్సెలింగ్ మా పాపకు ఆరేళ్లు. తనకు తరచు ముక్కునుంచి రక్తం వస్తుంటుంది. ఇటీవల కొంతకాలంగా మలంలో కూడా ర క్తం పడుతోంది. డాక్టర్కు చూపించి, మందులు వాడుతున్నాము కానీ పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - ఎన్.పుష్పకుమారి, ఆదోని పిల్లలలో ముక్కు నుంచి రక్తం పడటమనేది తరచు కనిపించేదే. ఈ సమస్య ముఖ్యంగా వేసవి, చలికాలాలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని ఎపిస్టారిస్ అంటారు. ఇంటి వాతావరణం వేడిగా లేదా చల్లగా పొడిగా తయారైనప్పుడు ముక్కురంధ్రాలు పొడిబారి చర్మం చిట్లుతుంది. చిన్నపిల్లలు ముక్కులో వేళ్లుపెట్టి కెలుక్కుంటూ ఉంటారు. దీనివల్ల ముక్కురంధ్రాలలో ఉన్న సున్నితమైన రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం జరగవచ్చు. అదేవిధంగా అలర్జీలు వచ్చినప్పుడు లేదా జలుబు చేసినప్పుడు గట్టిగా తుమ్మటం, ముక్కు చీదటం, ముక్కుకు బలమైన దెబ్బ తగలటం, ముక్కులో బలపాలు, పెన్సిళ్లు వంటివి పెట్టుకోవడం వల్ల కూడా ఇలా జరగవచ్చు. నివారణ: ఇటువంటప్పుడు కంగారు పడి, ముక్కులో గుడ్డలు అవీ పెట్టడం, కదలకుండా పడుకోబెట్టడం వల్ల సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది. మాడు మీద చెయ్యి పెట్టి గట్టిగా ఒత్తిపట్టుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. ముక్కులో వేళ్లు పెట్టుకోనివ్వకూడదు. గోళ్లు పెరగకుండా చూడాలి. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు కొబ్బరినూనె రాయడం మంచిది. మలంలో రక్తం పడటానికి కారణాలు మలద్వారం వద్ద చీలిక (ఫిషర్): ముఖ్యంగా చిన్నపిల్లల్లోనూ, పెద్దవాళ్లలోనూ ఇలా జరగడానికి కారణం మలబద్ధకం. గట్టిగా ముక్కడం వల్ల కింది భాగంలోని పేగుల నుంచి రక్తస్రావం జరగవచ్చు. అలాగే పిండదశలో ఉన్నప్పుడు తల్లి బొడ్డునుంచి గర్భస్థ శిశువు పేగుల్లోకి వెళ్లే నాళ్ల మూసుకు పోవడం వల్ల పేగుల్లో తిత్తులు ఏర్పడవచ్చు. చిన్నపేగుల్లో అల్సర్స్, పేగు చొచ్చుకురావడం, ఒక పేగులోని కొంత భాగం మరో పేగులోకి చొచ్చుకుపోతుంది. జువైనల్ పాలిప్స్: పేగుల్లో పిలకలు; రక్తనాళాల్ల లోపాలు, పేగుల్లో వాపు. హోమియోవైద్యం: చిన్నపిల్లల్లో రక్తస్రావ సమస్యలకు హోమియోలో అద్భుతమైన మందులున్నాయి. వ్యాధి కారణాలు, లక్షణాలు, పిల్లల మానసిక, శారీరక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా వైద్యం చేస్తారు. దీనివల్ల ఎటువంటి దుష్ఫలితాలూ తలెత్తకుండా ఎలాంటి శస్త్రచికిత్సలూ అవసరం లేకుండా వ్యాధి సమూలంగా తగ్గిపోతుంది. సమీపంలో ఉన్న మంచి అనుభవజ్ఞుడైన హోమియో వైద్యుని సంప్రదించండి. -డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ న్యూరో కౌన్సెలింగ్ మా అబ్బాయికి 15 ఏళ్లు. వాడికి చిన్నప్పట్నుంచీ మూర్ఛ వ్యాధి ఉంది. చికిత్స చేయిస్తున్నాం. అయితే గత ఆరు నెలలుగా మూర్ఛ రావడం ఆగిపోయింది. దాంతో మందులు నిలిపివేశాం. ఇటీవల మా బాబుకు స్కూల్లో మళ్లీ మూర్ఛ వచ్చింది. ఒకసారి తగ్గిన తర్వాత కూడా మూర్ఛ వ్యాధి మళ్లీ వస్తుందా? మా బాబుకు సరైన, శాశ్వతమైన పరిష్కారం చూపించగలరు. - లక్ష్మి, విజయవాడ మీ బాబుకు మూర్ఛ తగ్గిందనుకొని మీరు మందులు వాడటం ఆపివేశారు. కానీ మీ బాబుకు మూర్ఛ వ్యాధి పూర్తిగా నయం కాలేదు. వ్యాధి కొద్దిగా తగ్గినట్లు అనిపించగానే చాలామంది మందులు వాడటం ఆపేస్తుంటారు. కానీ అది మంచిది కాదు. మూర్ఛవ్యాధికి దీర్ఘకాలిక చికిత్స అవసరం. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ మందులు వాడటం ద్వారా మూర్ఛను అదుపులో ఉంచుకోవచ్చు. మూర్ఛలో చాలా రకాలు ఉంటాయి. వ్యాధి తత్వం, రోగి వయసు, ఇతర పరిస్థితులపై... దానికి అందించాల్సిన చికిత్స ఆధారపడి ఉంటుంది. మూర్ఛ ఉన్నవారు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ, క్రమం తప్పకుండా మందులు వాడాలి. మీ బాబుకు మూర్ఛవ్యాధి ఎందుకు వస్తుందో తెలుసుకొని, అందుకు అనుగుణంగా చికిత్స పొందడం ఎంతో ముఖ్యం. ఒకవేళ మీ బాబుకు ఉన్న మూర్ఛ రకానికి సర్జరీ అవసరమని వైద్యులు సూచిస్తే, అప్పుడు శస్త్రచికిత్సతో దానికి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. సర్జరీ అవసరం లేకుండా మందులు వాడమని సలహా ఇస్తే, వారు సూచించిన విధంగా, మందులు మానేయకుండా, డాక్టర్లు చెప్పేవరకు వాటిని వేసుకోవాలి. ఒకవేళ ఒకపూట మందులు వేసుకోవడం మరచిపోయినా, ఏదైనా కారణాలతో వేసుకోలేకపోయినా, గుర్తుకు రాగానే రెట్టింపు మందులు (ఇది డాక్టర్ సూచన మేరకు మాత్రమే) వేసుకోవాలి. వైద్యులను సంప్రదించకుండా మీ అంతట మీరు మందులను ఎట్టిపరిస్థితులలోనూ నిలిపివేయవద్దు. మూర్ఛ అనేది అదుపులో ఉంచుకోదగిన వ్యాధి. క్రమం తప్పకుండా మందులు వాడితే మూర్ఛ ఉన్నవారు కూడా అందరిలాగే సాధారణ జీవితం గడపగలుగుతారు. మూర్ఛ వ్యాధి ఉన్నవారు కాంతిమంతమైన వెలుగు ఉన్న చోట ఉండకూడదు. కంప్యూటర్, ల్యాప్టాప్ ముందు ఎక్కువ సమయం గడపడం మంచిది కాదు. ధ్వనులకు దూరంగా ఉండాలి. కార్లు, ద్విచక్రవాహనాలు నడపకూడదు. స్విమ్మింగ్ చేయకూడదు. ఎత్తులకు ఎక్కడం అంత మంచిది కాదు. -డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం సీనియర్ న్యూరో సర్జన్ యశోద హాస్పిటల్స్,సికింద్రాబాద్ యాండ్రాలజీ కౌన్సెలింగ్ నాకు 20 ఏళ్లు. నేను ఏడేళ్ల నుంచి హస్తప్రయోగం చేస్తున్నాను. రోజుకు కనీసం ఒకసారైనా హస్తప్రయోగం చేసుకుంటాను. ఈమధ్య ఎంతగా ప్రయత్నించినా నాకు అంగస్తంభన కలగడం లేదు. సెక్స్ మూడ్ కూడా రావడం లేదు. పైగా పురుషాంగం మీద నరాలు పైకి తేలి కనిపిస్తున్నాయి. సెక్స్కు, పెళ్లికి పనికిరానేమో అని ఆందోళనగా ఉంది. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - ఆర్.వి.కె.ఎమ్., చిట్యాల పురుషాంగం మీద నరాలు కనిపించడానికీ, అంగస్తంభనకూ ఎలాంటి సంబంధం లేదు. వాస్తవానికి పురుషాంగం లోపల ఉండే కండరాల్లోకి రక్తం ప్రవహించడం వల్ల అంగస్తంభన జరుగుతుంది. ఆ ప్రక్రియకూ, పురుషాంగం పైన కనిపించే నరాలకు అస్సలు సంబంధం లేదు. మీలాగే దాదాపు యువకులందరూ యుక్తవయసుకు రాగానే హస్తప్రయోగం మొదలుపెడతారు. అది చాలా స్వాభావికమైన చర్య. అయితే పోనుపోనూ అది యాంత్రికం అవుతుంది. అలా అవుతున్న కొద్దీ మొదట్లో ఉన్నంత థ్రిల్ కనిపించకపోవచ్చు. మీరు కెరియర్పై దృష్టి పెట్టండి. ఏదో ఒక సమయంలో మీకు మూడ్ వచ్చినప్పుడు మీది కేవలం అపోహ అన్న విషయం మీకే అర్థమవుతుంది. మీరు వివాహానికి పూర్తిగా అర్హులు. సంతృప్తికరమైన సెక్స్ జీవితాన్ని అనుభవించగలరు. నాకు 60 ఏళ్లు. రెండేళ్ల క్రితం వరకు బాగానే సెక్స్ చేస్తుండేవాణ్ణి. ప్రస్తుతం సెక్స్ చేయాలనే కోరిక ఉన్నా అంగస్తంభన సరిగా లేకపోవడంతో సెక్స్ చేయలేకపోతున్నాను. దీనికి తోడు రాత్రిళ్లు మూత్రానికి ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తోంది. నిద్రసరిగా పట్టడం లేదు. నాకు తగిన సలహా ఇవ్వండి. - డి.కె.ఎమ్., కొత్తగూడెం అరవై ఏళ్లు పైబడ్డ వాళ్లలో సెక్స్ సంబంధిత, మూత్ర సంబంధిత సమస్యలు కనిపించవచ్చు. వయసు పెరుగుతుండటంతో చాలా మందిలో కనిపించే సాధారణమైన సమస్యలే ఇవి. ప్రోస్టేట్ గ్లాండ్ పెరగడం వల్ల మూత్ర సంబంధిత సమస్య, రక్తనాళాలు కొంత బలహీనం కావడం వల్ల అంగస్తంభన సమస్యలు వచ్చి ఉండవచ్చు. ఈ రెండింటినీ మందులతో కొంత నయం చేయవచ్చు. దాంతోపాటు శారీరక, మానసిక దారుఢ్యం (ఫిట్నెస్) కోసం కృషి చేయడం ద్వారా మరికొంత సెక్సువల్ పెర్ఫార్మెన్స్ను పెంచుకోవచ్చు. షుగర్, కొలెస్ట్రాల్ వంటి పరీక్షలు చేయించుకుని అవి ఉంటే వాటిని నియంత్రించుకునేందుకు అవసరమైన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకసారి మీ యూరాలజిస్ట్/యాండ్రాలజిస్ట్ను కలవండి. - డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్ ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి హైదరాబాద్ -
హోమియో వైద్యంతో పార్శ్వపు నొప్పి మాయం
ప్రతి వంద మందిలో 15 నుండి 20 మంది ఈ వ్యాధితో బాధ పడుతున్నారు. ఇది సాధారణంగా 15 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పార్శ ్వపు నొప్పితో (Migraine) బాధ పడుతున్నారా అని తెలుసుకోవటం ఎలా =నెలలో 5 కంటే ఎక్కువసార్లు తలనొప్పి రావటం =తలనొప్పి 4 గంటల నుండి 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది =కనీసం రెండు సార్లు అయినా తలలో ఏదో ఒక వైపు నొప్పి రావటం =వాంతులు అవటం, శబ్దం లేక వెలుతురు భరించలేకపోవటం వంటి లక్షణాలు తలనొప్పితో పాటు కానీ తలనొప్పి ముందు కానీ ఉండడటం =AURAతో కూడిన తలనొప్పి- అంటే... తలనొప్పి వచ్చే ముందు... కళ్లు మసకబారటం, కళ్ల ముందు వెలుతురు కనిపించటం, మెరుపులు ప్రకాశవంతమైన జ్యోతుల లాంటివి కనిపించటం మొదలగు లక్షణాలను కలిపి అ్ఖఖఅ అని అంటారు. పార్శ్వపు నొప్పి అనగా చాలా తీవ్రమైన తలనొప్పి ఉండటం మరియు ఏదో ఒక వైపు తలనొప్పి రావటం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. సాధారణంగా ఇది మెడ వెనుక భాగంలో ప్రారంభమై కంటి వరకు వ్యాపిస్తుంది. తలనొప్పి వచ్చే ముందు కళ్లు మసక బారటం, తల తిరగటం వంటి లక్షణాలతో తలనొప్పి వస్తుంది. కడుపులో వికారంగా ఉండటం లేదా వాంతులు కావటం వంటి లక్షణాలు పార్శ్వపునొప్పిలో సాధారణం. పార్శ్వపు నొప్పికి కారణమైన నిర్దిష్టమైన జీవప్రక్రియ వ్యవస్థ గురించి తగిన శాస్త్రీయ ఆధారాలు ఇప్పటికీ అందుబాటులో లేవు. కానీ తలలోని నరాలలో కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావటం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. పార్శ్వపు నొప్పి రావటానికి గల కారణాలు =శారీరక మరియు మానసిక ఒత్తిడి =నిద్ర లేకపోవటం =ఎక్కువసేపు ఆకలిగా ఉండటం మరియు సమయానికి భోజనం చేయక పోవటం =స్త్రీలలో హార్మోన్ హెచ్చు తగ్గుల వల్ల కూడా పార్శ్వపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా నెలసరి సమయంలోను, గర్భిణీ స్త్రీలలోను మరియు మెనోపాజ్ సమయంలో చూస్తూ ఉంటాము =అతి వెలుగు, గట్టి శబ్దాలు మరియు ఘాటైన సువాసనలు పార్శ్వపునొప్పికి కారణాలు కావచ్చు =పొగతాగటం లేదా ఇంట్లో పొగతాగే వారుండటం =మద్యం సేవించటం లేదా ఇతర మత్తు పదార్థాలు కూడా పార్శ్వపునొప్పికి కారణం కావచ్చు. పైన పేర్కొన్న కారణాలకు దూరంగా ఉండటం వల్ల కొంతవరకు తలనొప్పిని రాకుండా చేయటం లేదా అదుపులో ఉంచటం చేయవచ్చు. లక్షణాలు: పార్శ్వపు నొప్పిలో చాలా రకాల లక్షణాలు ఉంటాయి. వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు. =పార్శ్వపునొప్పి వచ్చే ముందు కనిపించే లక్షణాలు (PRODROME & AURA) ఈ లక్షణాలు పార్శ్వపునొప్పి వచ్చే కొన్ని గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. =చిరాకు, నీరసం, అలసట, నిరుత్సాహం. =కొన్ని రకాల తినుబండారాలను ఎక్కువగా ఇష్టపడటం =వెలుతురు మరియు శబ్దాన్ని తట్టుకోలేకపోవటం =కళ్లు మసక బారటం, కళ్ల ముందు మెరుపులు లేదా వెలుతురు కనిపించటం జరుగవచ్చు. వీటినే అ్ఖఖఅ అంటారు. 2. పార్శ్వపు నొప్పి సమయంలో వచ్చే లక్షణాలు (paInphase) =సాధారణం నుండి అతి తీవ్రమైన తలనొప్పి =తలలో ఒక వైపు ఎక్కువగా తలనొప్పి ఉండటం =పని చేస్తున్నప్పుడు నొప్పి తీవ్రత ఎక్కువ అవటం =నొప్పి సాధారణంగా 4 గంటల నుండి 72 గంటల వరకు ఉండవచ్చు. =కడుపులో వికారం లేదా వాంతులు అవటం 3. పార్శ్వపునొప్పి వచ్చిన తరువాత లక్షణాలు =చిరాకు ఎక్కువగా ఉండటం నీరసంగా ఉండటం =వికారం, వాంతులు, విరోచనాలు కావటం హోమియో కేర్ ఇంటర్ నేషనల్ నందు జెనెటిక్ కాన్స్టిట్యూషన్ వైద్య విధానం ద్వారా మరియు ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన కచ్చితమైన చికిత్స ద్వారా పార్శ్వపు నొప్పి తీవ్రతనే కాకుండా పార్శ్వపునొప్పిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఎటువంటి దుష్ఫలితాలు లేని మరియు వ్యాధిని సమూలంగా నిర్మూలించే ప్రత్యేక వైద్యం కేవలం హోమియోకేర్ ఇంటర్నేషనల్కే సొంతం. రోగ నిర్థారణ పరీక్షలు పార్శ్వపునొప్పిని నిర్థారించుకోవటానికి ఖచ్చితమైన రోగనిర్థారణ పరీక్షలు లేవు. రోగ లక్షణాలను బట్టి ఎక్కువసార్లు పార్శ్వపునొప్పిని నిర్థారించటం జరుగుతుంది. ఈసీజీ, సీటీ-బ్రెయిన్, ఎమ్మారై-బ్రెయిన్ మొదలగు పరీక్షలు చేయటం ద్వారా ఇతరత్రా తీవ్రమైన వ్యాధులు లేవని నిర్థారించుకోవటం వల్ల మైగ్రేన్ తలనొప్పిని నిర్థారించుకోవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేప్ కేసు నిందితుడిపై పోలీసు కాల్పులు
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement