-
పాకిస్తాన్లో హిందూ జనాభా ఎంతో తెలుసా?
పెషావర్: పాకిస్తాన్లో 22,10,566 మంది హిందువులు నివసిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. దేశంలో నమోదైన మొత్తం 18,68,90,601 మంది జనాభాలో మైనారిటీ హిందువుల వాటా 1.18% మాత్రమేనని సెంటర్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పాకిస్తాన్ వెల్లడించిన నివేదిక పేర్కొంది. దేశ జనాభాలో మైనారిటీల వాటా 5% కాగా, వీరిలో హిందువులే అత్యధికులని ఈ నివేదిక ఉటంకించింది. దేశంలో 1,400 మంది నాస్తికులు సహా 17 వేర్వేరు మతాలు, ఆచారాలను గుర్తించినట్లు మార్చిలో వెల్లడించిన ఎన్ఏడీఆర్ఏ డేటా పేర్కొంది. హిందూ జనాభాలో 95% మంది సింధ్ ప్రావిన్స్లోనే నివసిస్తున్నారంది. పేదరికంలో మగ్గుతున్న మైనారిటీల ప్రాతినిధ్యం పాక్ చట్టసభల్లో దాదాపుగా లేనట్లేనని వెల్లడించింది. మైనారిటీలపై వేధింపులు సర్వసాధారణమని ఈ నివేదిక తెలిపింది. చదవండి: అణు నిఘాను ఇరాన్ అడ్డుకుంటోంది -
ముస్లింలకో న్యాయం, హిందువులకో న్యాయమా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘ముస్లింలను మెప్పించడం కోసం కాకుండా మైనారిటీలు సమాజంలో గౌరవప్రదంగా జీవించడం కోసం కృషి చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోంది. అందుకని ముస్లింల హజ్ యాత్రకు ఏటా కేటాయిస్తున్న దాదాపు 700 కోట్ల రూపాయలను ఇక నుంచి ముస్లిం మహిళల విద్యాభివద్ధికి ఖర్చు చేస్తాం’ అని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం నాడు ప్రకటించడం ఎంతైనా ముదావహం. ఇదేమి బీజేపీ ప్రభుత్వం సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు. హజ్ యాత్రకు కేంద్రం కల్పిస్తున్న సబ్సిడీని పదేళ్ల కాలంలో పూర్తిగా ఎత్తివేయాలని సుప్రీం కోర్టు 2012లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సొమ్మును ముస్లింల విద్యా, సామాజికాభివద్ధికి ఖర్చు పెట్టాలని కూడా సుప్రీం కోర్టు సూచించింది. నాలుగేళ్లకు ముందుగానే సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం హజ్ యాత్రకు ఇస్తున్న సబ్సిడీని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం సున్నితమైన అంశమే. ఏ సెక్యులర్ ప్రభుత్వం అయినా సరే ప్రజల మత కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులను ఖర్చు పెట్టరాదు. మన రాజ్యాంగంలోని సెక్యులర్ అనే పదానికి అదే అర్థం. అందుకనే కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల హజ్ యాత్రకు సబ్సిడీని ప్రకటించడాన్ని బీజేపీ ‘సూడో సెక్యులరిజమ్’ అంటూ విమర్శించింది. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబే. మరి కుంభమేళా లాంటి హిందూ మతపరమైన కార్యక్రమాలకు కోట్లాది రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెట్టడాన్ని ఆపేస్తుందా? భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చే కార్యక్రమాల సందర్భంగా వారికి తగిన సౌకర్యాలు కల్పించడం, శాంతి భద్రతల పరిరక్షణకు తగిన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వం బాధ్యతని ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు సమర్థించుకోవచ్చు. కైలాస మానససరోవర్ యాత్ర సందర్భంగా టిబెట్ వెళ్లే హిందూ భక్తుల ప్రయాణానికి, వారి బసకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులను విడుదల చేస్తోంది? వీటిని కూడా తక్షణం నిలిపివేయాలి కదా! కేంద్రమే కాకుండా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మత కార్యక్రమాలకు నిధులను విడుదల చేయడమే కాకుండా, దగ్గరుండి కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి? బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలు కూడా ప్రభుత్వ నిధులతో హిందూ మత కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇక బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వమైతే అయోధ్య, మధురలతోపాటు కేరళలోని సెయింట్ థామస్ చర్చిని సందర్శించే వృద్ధులకు, వారి సహాయకులకు సబ్సిడీలను ఇస్తోంది. అంతేకాకుండా పాకిస్థాన్, చైనా, కాంబోడియా, శ్రీలంకలో హిందూ పుణ్యక్షేత్రలను దర్శించుకునే భక్తులకు కూడా రాయితీలు ఇస్తోంది. ఇక మానస సరోవర యాత్రకు ఇస్తున్న నిధులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవలనే రెట్టింపు చేశారు. భక్తుల బస కోసం ‘మానససరోవర్ భవన్’ను నిర్మించాలని కూడా ఆయన నిర్ణయించారు. హజ్యాత్ర విషయంలో తీసుకున్నట్లుగానే హిందూ మత కార్యక్రమాల విషయంలో కూడా కేంద్ర, బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. లేకపోయినట్లయితే బీజేపీ ప్రభుత్వాలదే సూడో సెక్యులరిజమ్, హిందూ అప్పీజ్మెంట్ అవుతుంది. వారికో న్యాయం, వీరికో న్యాయం అన్నట్లు ఉంటుంది. -
ముస్లింల గురించి మాట్లాడటం మానితే మేలు కదా!
హిందుత్వకు హిందువులపై కంటే ముస్లింలపైనే ఆసక్తి ఎక్కువ. ప్రతికూలాత్మక అంశాలతోనే అది రూపొందింది. ముస్లింల పట్ల ప్రతికూలాత్మకతవల్ల హిందువులకు ఒరిగేదేమీ లేదు. అది అర్థశాస్త్రానికి చేసిన దోహదమేమీ లేదు. తమ భావజాల కర్త దీన్దయాళ్ ఉపాధ్యాయ సోషలిస్టు అని తెలిస్తే చాలా మంది హిందుత్వవాదులు ఆశ్చర్యపోతారు. మన్మోహన్సింగ్ ఉదారవాద విధానాల తదుపరి బీజేపీ ఉపాధ్యాయ ఆర్థిక భావనలను పూర్తిగా విడిచిపెట్టేసింది. ఇక విజ్ఞాన శాస్త్రానికి హిందుత్వ చేసిన దోహదం శూన్యం. హిందుత్వవాదులకు తమ భావజాలాన్ని సవాలు చేసే విద్యావేత్తలను చూస్తే కంపరమెత్తుతుంది. వారిని హత్య గావిస్తుంటారు. ‘సంస్కృతి’కి మించి అందులో సారాంశంగా చెప్పుకోదగినదేమీ లేదు. అందులోనూ దానిది మితవాద కథనం మాత్రమే. మధ్యతరగతి హిందువులలో చాలా మందిలాగే, ప్రత్యే కించి గుజరాతీ హిందువులలాగే నేనూ జాతీయవాదం, మతాలపట్ల కొన్ని ప్రత్యేక భావాలతో పెరిగాను. హిందుత్వ అనే భావన సారం అత్యంత మౌలికమై నది, నిరపేక్షమైనది. కాబట్టి ఎవరైనాగానీ చిన్నతనంలో దాని పట్ల సులువుగా ఆకర్షితులవుతారు. అది దేశం పట్ల, సంస్కృతి పట్ల పెల్లుబికే ప్రేమ పునాదులపై నిలిచినట్టనిపి స్తుంది. ఆ రెండూ ఒక్కటిగా కలగలిసినదే హిందూ మతం. కాబట్టి హిందూ అనే పదం మతానికే కాదు జాతీయతకు, సంస్కృతికి కూడా సంకేతం. ఇది అతి గొప్ప వ్యక్తులు చెప్పి నది కాబట్టి మనం దాన్ని సత్యంగా అంగీకరిస్తాం. మన భారతీయులకు చదవడం కంటే ఎక్కువగా పూజించడం అలవాటు కాబట్టి ఆ వ్యక్తుల పేర్లు పదే పదే వినిపించడం వల్ల సహజంగానే మీరు వారిని గొప్పవారుగా భావిస్తారు. ఉద్వేగం ఎక్కువ... మేధోపర అంశాలు తక్కువ వాస్తవానికి నేను ఇరవైల ప్రాయంలో ఉండగా సావర్కర్ రాసిన ‘హిందుత్వ’ పుస్తకాన్ని చదివాను. అది నన్ను నిరు త్సాహపరచింది. ఆయనను అంత గొప్పవాడిగా ఎందుకు భావిస్తారో అంతుబట్టలేదు. అది అత్యంత సర్వసాధారణ మైన పుస్తకం. అందులో కొత్తదనమేమీ లేదు. నిజానికి సావర్కర్ ఎక్కువగా చదివిన వాడేమీ కాదు. ఇతరుల రచ నల నుంచి ఉల్లేఖింపులు లేదా ప్రస్తావనలు అందులో తక్కువగానే ఉన్నాయి. దేశం పట్ల బేషరతు ప్రేమ అనేదే ఆయన ప్రధాన భావ న. అయితే ముందే నేను చెప్పినట్టుగా అది మన దేశంలో చాలా మందికి సులువుగా అబ్బేదే. వివేకానందుని సమగ్ర రచనలను (ప్రధానంగా ఉప న్యాసాలు, ఉత్తరాలతో కూడిన 8 సంపుటాలు) చదివాక కూడా నాకా సందేహం తీరలేదు. గోల్వాల్కర్ రచనలను (ప్రధానంగా ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలే), ఆర్ఎస్ఎస్ ప్రధాన భావజాల కర్త దీన్దయాళ్ ఉపాధ్యాయ రచనలను కూడా చదివిన తర్వాతగానీ హిందుత్వలో ఉన్నదంతా ఇం తేనని నాకు కనువిప్పు కలుగలేదు. అది, ఆలోచనాలోచనా లను మూసేసుకున్న వారికై ఉద్దేశించిన భావజాలం. అం దులో మేధోపరమైన దానికంటే ఉద్వేగపరమైనదే ఎక్కువ. ప్రతికూలాత్మకతే హిందుత్వ పునాది అప్పటికే హిందుత్వ సారాన్ని అయిష్టపడటం ప్రారంభిం చిన నాకు ఈ విషయాన్ని కనిపెట్టడం గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. ప్రతికూలాత్మక అంశాలతో ఎలా హిందుత్వ రూపుదిద్దుకుందో నేను గ్రహించడం మొదలుపెట్టాను. దాని ప్రధాన డిమాండ్లు మూడు: ఒకటి: రామ జన్మభూమి (ముస్లింల మసీదు అక్కడ ఉండటానికి వీల్లేదు.) రెండు: ఉమ్మడి పౌరస్మృతి (ముస్లింలకు వారి స్వంత కుటంబ చట్టం ఉండరాదు.) మూడు: జమ్మూకశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370ను తొలగించాలి (ముస్లింలకు రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తి ఉండటానికి వీల్లేదు). ఈ మూడూ ముస్లింలకు ప్రతికూలమైననే తప్ప వాటి వల్ల హిందువులకు ఒరిగేదేమీ లేదు. హిందుత్వ భావ జాలం చేయగలిగిందల్లా ఆగ్రహాన్ని, ద్వేషాన్ని రగల్చడం మాత్రమే. ఇతరుల వైపు వేలెత్తి చూపుతూ, వారిని తప్పు పట్టేది మాత్రమే. మనది ఎప్పటికీ గొప్ప దేశమనే భావ నతో... ఇతరులు, మనం కాదు, తిరిగి భారతదేశాన్ని గొప్ప దేశంగా చేయడానికి కృషి చేసి తీరాలని అది ఊహిస్తుంది. పిల్లల జగడాలమారి తనం నా దృష్టిలో ఇది నేనే మాత్రం ఆమోదించలేని పిల్లకాయ తనం. భారతదేశానికి, భారతీయులకు హిందుత్వ భౌతికం గా అంత ఎక్కువ నష్టం కలిగించకపోయి ఉంటే నేను దాన్నీ, దాని వకాలతుదార్లను విస్మరించేవాడినే. హిందుత్వ చాలావరకు సంస్కృతికి చె ందినది కాబట్టే కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి మహేష్ శర్మ ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు. అది అర్థశాస్త్రానికి చేసిన దోహద మేమీ లేదు. తమ భావజాల కర్త దీన్దయాళ్ ఉపాధ్యాయ సోషలిస్టు అని తెలిస్తే చాలా మంది హిందుత్వవాదులు ఆశ్చర్యపోతారు. మన్మోహన్సింగ్ ఉదారవాద విధానాల తదుపరి బీజేపీ ఉపాధ్యాయ ఆర్థిక భావనలను పూర్తిగా విడిచిపెట్టేసింది. ఇక విజ్ఞానశాస్త్రానికి హిందుత్వ చేసిన దోహదం శూన్యం. హిందుత్వవాదులకు తమ భావజా లాన్ని సవాలు చేసే విద్యావేత్తలను చూస్తే కంపరమెత్తు తుంది. వారిని హత్య గావిస్తుంటారు. ‘సంస్కృతి’కి మించి అందులో సారాంశంగా చెప్పుకోదగినదేమీ లేదు. అందు లోనూ దానిది మితవాద కథనం మాత్రమే. ముస్లింలపైనే ఆసక్తి కాబట్టే మహేశ్ శర్మ వంటి వారు పతాక శీర్షికలకు ఎక్కు తారు తప్ప, శాస్త్రవిజ్ఞాన శాఖ మంత్రి (ఎవరైతే వారు) పేరు ప్రముఖంగా వినపడదు. హిందుత్వకు అందులో ఆసక్తిలేదు. పేరును తప్పిస్తే దానికి ఉన్న ఆసక్తి అంతా ముస్లింలపైనే తప్ప హిందువులపైన కాదు. భగవద్గీతలాగా బైబిల్, ఖురాన్లు భారతీయ ఆత్మకు కేంద్రం కావు అని శర్మ మొదట అన్నారు. ఆ తదుపరి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గురించి ఇలా అన్నారు: ‘‘ఔరంగజేబు రోడ్డు పేరును మార్చి, ముస్లిమే అయి నా మహా మనీషి అయిన ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహ నీయుని పేరు పెడుతున్నాం.’’ ఒక హిందుత్వవాది ఇలాంటి వ్యర్థ ప్రేలాపనకు దిగ డం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. కాకపోతే ఆ మంత్రికి ఇంకా చిన్న పిల్లాడి మనస్తత్వం ఎందుకు వదలలేదా అనేది మాత్రం నాకు కొంత అర్థంకాని సమస్యగానే ఉంది. ఆయన చిన్నతనంలో మత దురభిమానానికి గురికావడం నేను అర్థం చేసుకోగలిగేదే. నేనూ కౌమార్యంలో దానికి ఆకర్షి తుడినైన వాడినే. కౌమార్యంలో పక్షపాతంతో, ఆలోచనకు తలుపులు మూసుకున్న వైఖరితో ఉండటం సులువే. అయి తే పెద్దవాళ్లు ప్రపంచాన్ని పెద్దలుగానే చూడాలి తప్ప బడి పిల్లల జగడాలకోరు దృష్టితో కాదు. హిందుత్వ...ముస్లింల గురించి మాట్లాడటం మానేసి, హిందువుల వైపు చూస్తే హిందువులకు గొప్పమేలు చేసినట్ట వుతుంది. అలాంటి భావజాలాన్నయితే నేనూ అనుసరించే విషయాన్ని యోచిస్తాను. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత, aakar.patel@icloud.com - ఆకార్ పటేల్ -
డీఎన్ఏ పరంగానైనా భారతీయులంతా హిందువులే
నాగ్పూర్: దేశంలో మెజారిటీ, మైనారిటీ అనే భావనే సరైంది కాదని, భారతీయులంతా హిందువులేనని ఆరెస్సెస్ పేర్కొంది. సాంస్కృతిక పరంగా, జాతీయపరంగా, చివరకు డీఎన్ఏ పరంగా చూసినా భారతీయులంతా హిందువులేనని సంఘ్ సీనియర్ నేత దత్తాత్రేయ హోసబలే అన్నారు. నాగపూర్లోని సంఘ్ ప్రధాన కేంద్రంలో శుక్రవారం ప్రారంభమైన అఖిలభారతీయ ప్రతినిధి సభలో మేధోమథనం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 రాజ్యాంగ అధికరణాన్ని రద్దు చేయాలన్న తమ సైద్ధాంతిక కట్టుబాటులో సడలింపు లేదన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement