Health @: 1000
-
ఎండల్లో... కొబ్బరి నీళ్లతో గేమ్స్ వద్దు!
ఎండ వేడిని తట్టుకోవడానికి, ఎండా కాలంలో సత్తువతో ఉండడానికి కొబ్బరి నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంతమంచిది అనుకుంటారు చాలామంది. అయితే ఇది సరిౖయెనది కాదు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే...కొబ్బరి నీళ్లలో ΄పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయులు పెరుగుతాయి. శరీరంలో లవణాల సమతూకం దెబ్బతింటుంది. కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుంది.కొబ్బరినీళ్లలో అధిక పొటాషియం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కొబ్బరి నీళ్లలో అధిక చక్కెర కంటెంట్ వల్ల బరువు పెరగడానికి దారి తీయవచ్చు. డయాబెటిస్, గుండె జబ్బులు, దంత క్షయ ప్రమాదం పెరగవచ్చు.కొబ్బరితో అలర్జీలు అసాధారణమేమీ కాదు. కొంతమందికి కొబ్బరి నీటి వల్ల అలెర్జీలు రావచ్చు. దద్దుర్లు, వాపుతోబాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు.హైబీపి ఉన్న వారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, పేగు పూత వ్యాధి ఉన్న వాళ్లు కొబ్బరినీళ్లకు దూరంగా ఉండటమే మంచిది. (చదవండి: వేగాన్ వర్సెస్ నాన్వెజ్ డైట్: ఈ కవల సోదరుల ప్రయోగంలో వేటిలో విటమిన్లు ఎక్కువంటే..?) -
ఆరోగ్యం @: 1000
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించిన వైద్యవరాల్లో ఒక్కటైన అమ్మ మాస్టర్ హెల్త్ చెకప్ పథకానికి రూ.1000 ఫీజుగా నిర్ణయించారు. చెన్నైలోని రాజీవ్గాంధీ ప్రజా ప్రభుత్వ ఆసుపత్రి (జీహెచ్)లో ఈ పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. ఈనెల 25వ తేదీన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జయలలిత కొత్తగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వరుసగా ప్రకటించారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో మాస్టర్ హెల్త్ చెకప్కు రూ.5 వేల నుంచి రూ.12వేల వరకు ఫీజు వసూలు చేస్తుండగా, జీహెచ్లో అతితక్కువ ధరకే అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. మాస్టర్హెల్త్ చెకప్కు కేవలం రూ.1000 చెల్లించి 15 రకాల వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని సీఎం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయివేటు ఆసుపత్రులతో పోల్చుకుంటే ఈ మొత్తం ఐదు శాతం మాత్రమేనని తెలిపారు. అలాగే 385 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మాస్టర్ హెల్త్ చెకప్ పథకం కోసం తొలుత రూ.10 కోట్లు మంజూరు చేయగా, మరో రూ.15 కోట్లు విడుదల చేసినట్లు సీఎం తెలిపారు. జీహెచ్లో మరో రెండు నెలల్లో ఈ పథకం అమల్లోకి వస్తుందని జయ వివరించారు.