-
ఇరువర్గాల ఘర్షణ
- ఒకరికి గాయాలు - ఐదుగురిపై కేసు నమోదు హాలహర్వి : గూళ్యం రథోత్సవాల్లో ఇరువర్గాల మధ్య ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరు గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. గూళ్యం గ్రామంలో జరుగుతున్న గాదిలింగేశ్వరుడు రథోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన జె.హోసళ్లి గ్రామానికి చెందిన భీమన్నపై బళ్లారి జిల్లా బెణకల్కు చెందిన పరమేష్, బసవరాజు, రామకృష్ణ, రాముడు, దొబ్బురవాహన దాడి చేశారు. తోపులాటలో భీమన్న కాలుతొక్కాడంటూ వాగ్వాదానికి దిగారు. మాటమాట పెరగడంతో దాడి చేయడంతో భీమన్న గాయపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. -
రమణీయం..జోడు రథోత్సవం
- భక్తజన సంద్రమైన గూళ్యం - భారీ పోలీస్ బందోబస్తు మధ్య వేడుకలు గూళ్యం (హాలహర్వి): కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం గూళ్యం. ఈ గ్రామంలో సిద్ధేశ్వర, గాదిలింగేశ్వర జోడు రథోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. రథోత్సవానికి ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవంలో గొరవయ్యల నృత్యాలు అలరించాయి. ముందుగా గ్రామపెద్ద రఘునందనగౌడ్, ఆలయ అధికారి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకి కొలువుంచారు. ఊరేగింపుగా తీసుకెళ్లి రథాలపై అధిష్టింపజేశారు. అనంతరం భక్తుల జయజయ ధ్వనుల మధ్య రథాలు ముందుకు కదిలాయి. గాదిలింగేశ్వరస్వామి ఆలయానికి 800 మీటర్ల దూరంలోని ఎదురు బసవన్న దేవాలయం వరకు జోడు రథాలు సాగాయి. అక్కడ బసవన్నకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రథాలను యథాస్థానానికి చేర్చారు. గ్రామ సర్పంచ్ రాజశేఖర్గౌడ్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీడీవో లోకేష్, ఎంపీపీ బసప్ప, వైఎస్ ఎంపీపీ కల్యాణ్గౌడు వైఎస్సార్సీపీ నాయకులు భీమప్పచౌదరి, దిబ్బలింగ, గడినాడ కన్నడ సంఘం నాయకులు కుమారస్వామి, నీలాధర్, బజారప్ప, గాదిలింగప్ప, చిన్నమైలారప్ప, మోకా మైలారప్ప తదితరులు పాల్గొన్నారు. అన్నదానం రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన వేలాది మంది భక్తులకు నియోజకవర్గ పరిధిలోని ఆలూరు, బాపురం, హాలహర్వి, కర్ణాటకలోని బసరకోడు, అడ్లిగి, సింధువాళం తదితర గ్రామాల భక్తులు 40కి పైగా అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి గూళ్యం గ్రామానికి 20, గుంతకల్, ఆదోని తదితర డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపారు. భారీ బందోబస్తు సిద్ధలింగేశ్వర, గాదిలింగేశ్వర స్వాముల జోడు రథోత్సవాలను పురస్కరించుకుని ఆలూరు సీఐ అబ్దుల్గౌస్, హాలహర్వి ఎస్ఐ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరు గురు సీఐలు, 20 మంది ఎస్ఐలు, 100 మంది కానిస్టేబుళ్లు, 50 మంది హోంగార్డులు, 30 మంది స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement