breaking news
government residential school
-
గోడలపై పిచ్చిరాతలు.. 30 మంది బాలికలపై దాడి
పట్నా : ప్రభుత్వ బాలికల వసతి గృహంపై మూకుమ్మడి దాడి జరిగింది. 20 మందికి పైగా యువకులు కర్రలతో బాలికల హాస్టల్పై దాడిచేశారు. 30 బాలికలను తీవ్రంగా గాయపరిచి వారిపై లైంగిక దాడికి యత్నించారు. ఈ ఘటన బిహార్లోని సుపౌల్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. సమీప గ్రామంలోని కొందరు యువకులు హాస్టల్ గోడలపై అశ్లీల రాతలు రాస్తున్నారు. విద్యార్థినిలు విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. హాస్టల్ గోడలపై అభ్యంతరకర రాతలు రాస్తున్న ఓ యువకుడికి బాలికలు శనివారం దేహశుద్ధి చేశారు. బాలికల దాడికి ప్రతీకారంగా ఆ గ్రామంలోని 20 మందికి పైగా యువకులు హాస్టల్పై దాడికి దిగారు. ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్న సమయంలో 30 మంది బాలికలను కర్రలతో చావబాదారు. వారిపై లైంగిక దాడికి యత్నించారు. దాదాపు గంటపాటు పిల్లలను చిత్రవధ చేశారని హాస్టల్ వార్డెన్ రయీమా రాజ్ తెలిపారు. స్కూల్లోని వస్తువులను కూడా ధ్వంసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఘటన గురించి తెలుసుకున్న స్థానిక నాయకులు గాయపడిన బాలికలను ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. కాగా, బిహార్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నితీష్కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని నెలల క్రితం ముజఫర్పూర్లోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 34 మంది బాలికలు లైంగిక దాడికి గురైన ఘటన.. విద్య పేరుతో గయలో 15 మంది బాలురపై లైంగిక దాడికి యత్నించిన బౌద్ధ గురువు ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. -
విద్యార్థులకు టీచర్ ప్రేమపాఠాలు!
విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచర్ గాడి తప్పింది. పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు ప్రేమ పాఠాలు చెప్పడం వివాదానికి కారణమైంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొండపి గురుకుల పాఠశాలల్లో కలకలరేపుతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుగు టీచర్ .. 8వ తరగతి విద్యార్థినులకు ప్రేమలు పాఠాలు బోధించింది. ఈ విషయం కాస్తా ప్రధానోపాధ్యాయుడి దృష్టికి వెళ్లడంతో సదరు టీచర్ను నిలదీశాడు. దీంతో మనసు నొచ్చుకున్న ఆ టీచర్, ప్రధానోపాధ్యాయుడు వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థులను విచారించిన పోలీసులకు.. ఉపాధ్యాయురాలు ప్రేమ పాఠాలు చెప్పినట్లు తెలిసింది. విద్యార్థులే ప్రేమికుల దినోత్సం ప్రస్తావన తేవడంతో ప్రేమ గురించి మాట్లాడానంటోంది ఉపాధ్యాయురాలు.