-
అధికారం మాది.. నీ అంతుచూస్తా
శ్రీకాకుళం,ఇచ్ఛాపురం: పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో కాంట్రాక్టు వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్న పొట్టా శ్రీనివాసరావుపై పట్టణ టీడీపీ కార్యదర్శి ప్రతాపం చూపారు. ఆస్పత్రిలో చేరిన రోగికి వైద్యం అందించే విషయంలో జోక్యం చేసుకుని.. అధికారం మాది.. నీ అంతుచూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. చంపుతానంటూ హెచ్చరించడంతో భయభ్రాంతులకు గురైన వైద్యుడు రాజీనామా చేశారు. వైద్యం అందించారా లేదా? ఒక ప్రమాదంలో గాయపడిన రత్నాల బీమమ్మ.. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్సకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇచ్ఛాపురం ప్రభుత్వాస్పత్రిలో చేరారు. బీమమ్మ చేరిన విషయాన్ని కుటుంబసభ్యులు టీడీపీ పట్టణ కార్యదర్శి నందిక జానీకి తెలిపారు. వెంటనే ఆయన.. ఆస్పత్రికి వచ్చి.. వైద్యం అందించారా? లేదా అని వైద్యుడు శ్రీనివాసరావుతో పాటు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇలాంటివి ఆస్పత్రిలో చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని శ్రీనివాసరావు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన జానీ.. బుధవారం సాయంత్రం వైద్యుడు ఇంటి వద్దకు వెళ్లి దుర్భాషలాడారు. ‘మా పార్టీ అధికారంలో ఉంది. నీ అంతు చూస్తా, చంపుతా’ అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో డాక్టర్ కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. వీటిని తట్టుకోలేని శ్రీనివాసరావు.. తన రాజీనామా పత్రాన్ని ఆస్పత్రి వైద్యాధికారి దామోదర్ ప్రదాన్కు గురువారం అందజేశారు. అనంతరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైద్యసేవలు కరువయ్యే ప్రమాదం వైద్యులు శ్రీనివాసరావు ఆస్పత్రిలో ఐదేళ్లుగా సేవలందిస్తున్నారు. ఆయన చేసిన సేవలకు గాను జనవరి 26న కలెక్టర్ ధనంజయరెడ్డి ఉత్తమ డాక్టర్గా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఉత్తమ వైద్యుడిగా అవార్డు పొందిన డాక్టర్.. రాజీనామాను ఆమోదిస్తే వైద్యసేవలకు అంతరాయం కలుగుతుందని ఆస్పత్రి వైద్యాధికారి దామోదర్ప్రదాన్ తెలిపారు. ఇప్పటికే ఆస్పత్రిలో వైద్యులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటివి జరగడం వల్ల ఆస్పత్రిలో వైద్యసేవలు కరువయ్యే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. టీడీపీ పట్టణ కార్యదర్శిపై కేసు నమోదు పొట్టా శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిక జానీపై పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి రూరల్ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. వీరు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం డాక్టర్ ఇంటికి వెళ్లి దుర్భాషలాడుతూ బెదిరించారని, గతంలోనూ ఆస్పత్రిలో తన విధులకు ఆటంకం కలిగించినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. -
అర్బన్ హెల్త్సెంటర్లకు మెరుగులు
కరీంనగర్ హెల్త్ : పట్టణ పేదలకు వైద్య సేవలందించే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల రూపురేఖలు మారనున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించడంతోపాటు పట్టణంలోని పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న సర్కారు ఆస్పత్రులకు తోడు పట్టణాలు, నగరాల్లోని పేదల కోసం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. యాభై వేలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో పట్టణ ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్సీ), రెండు లక్షల జనాభా ఉన్న నగరాల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(యూసీహెచ్సీ) నిర్మిస్తారు. ప్రస్తుతం జిల్లాలోని పట్టణాల్లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లు నామమాత్రంగా మారాయి. ఈ సెంటర్ల బాధ్యతలు స్వచ్చంద సంస్థలు నిర్వహిస్తుండటంతో వీటి పనితీరు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. జాతీయ ఆరోగ్యమిషన్ ఆధ్వర్యంలో జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్ అర్బన్ పీహెచ్సీల నిర్వాహణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలో ఏయే ప్రాంతాల్లో అర్బన్ పీహెచ్సీలు ఏర్పాటు చేయవచ్చు అనే విషయంపై చర్యలు ప్రారంభించింది. జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల, మెట్పల్లితోపాటు పట్టణాల తరహాలో ఉన్న మేజర్ గ్రామపంచాయతీల జనాభా, అక్కడి మురికివాడలు, ఆరోగ్య సమస్యలు, సౌకర్యాలపై జిల్లా అధికారులు ఇప్పటికే సమగ్ర నివేదిక తయారు చేసి పంపించారు. అవసరమైతే అద్దె భవనాల్లో... కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు వెంటనే భవన నిర్మాణాలు చేపట్టాలని, ఒకవేళ నిర్మాణ పనులు ఆలస్యమైతే అద్దెకు తీసుకుని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. ఒక్కో సెంటర్ను రూ.25 లక్షలతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటిని త్వరగా ప్రారంభించాలనే యత్నాల్లో భాగంగా అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్వహణ బాధ్యతల నుంచి స్వచ్ఛంద సంస్థలను తప్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇకనుంచి అర్బన్ పీహెచ్సీ బాధ్యతలు డీఎంహెచ్వోకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. స్వచ్ఛంద సంస్థల ద్వారా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిబ్బందికి ప్రభుత్వం డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్ నుంచి వేతనాలు చెల్లించి ఆయా సంస్థలకు చెక్ పెట్టింది. అందుకు సిబ్బంది నుంచి బ్యాంకు అకౌంట్ ఖాతాలు తెరిపించి వాటిలో వేతనాలు జమ చేసింది. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న వాటిలో మార్చి వరకు వేతనాలు బ్యాంకు ఖాతా ద్వారా చెల్లించింది. జిల్లాలో కరీంనగర్ 3, రామగుండంలో 6, జగిత్యాలలో 3, సిరిసిల్ల 2, కోరుట్ల 1, మెట్పల్లిలో 1 మొత్తం 16 అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. వీటిలో కరీంనగర్, రామగుండంలోని యూహెచ్పీల స్థానంలో కమ్యూనిటీ హెల్త్సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. పీహెచ్సీల తరహాలోనే ఇక్కడ పూర్తి స్థాయి వైద్యులు, సిబ్బందిని నియమిస్తారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంతోపాటు వైద్య సేవల్లో మోడల్ జిల్లాగా కరీంనగర్ను తీర్చిదిద్దడంలో భాగంగా వీటిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతిపాదనలకు ఆమోదం లభించగానే పనులు మొదలు కానున్నాయి.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
పెట్టుబడుల పేరుతో లక్షల వంచన
పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలి
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు
పాడి రైతులు లబ్ధి పొందాలి
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కామేశ్వర రావు ప్రమాణం
గురుకులాల్లోనే ఉపాధ్యాయులు బస చేయాలి
భక్తిశ్రద్ధలతో హనుమ జయంతి
బావిలో పూడిక తీస్తూ నీట మునిగి మృతి
నన్ను గెలిపిస్తే సమస్యలపై స్పందిస్తా
బ్లాక్ బస్టర్ గ్యారెంటీ: హీరో శర్వానంద్
Advertisement