-
స్వచ్ఛంద సేవకులు
వీపనగండ్ల : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలతో కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల సహకారంతో పథకాలు పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇస్తాయన్న విశ్వాసం తక్కువ. కానీ విద్యార్థులు ఐక్యమత్యంతో గ్రామాలు శుభ్రంగా ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయని భావించి సేవా కార్యక్రమాలకు పూనుకున్నారు. స్వచ్ఛంద శ్రామికులు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ద్వారా ఐదు రోజులపాటు గోపల్దిన్నెలో శ్రమదానం చేస్తున్నారు. గ్రామంలోని మురుగు కాల్వలు శుభ్రం చేయడం, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీలోని వీధుల్లో చెత్తాచెదారం, ముళ్లకంపలు, పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. అంతేకాక మరుగుదొడ్ల నిర్మాణంతో కలిగే ఉపయోగాలు, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల సేవా దృక్పథం చూసిన మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థులు పలువురిలో స్ఫూర్తి నింపారని ప్రశంసించారు. యువకులు సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. భాగస్వాములను చేయాలి గ్రామాల్లో నెలకొన్న సమస్యల పట్ల విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సమాజ సేవలో భాగస్వాములను చేశాం. గ్రామాల ప్రజలు కూడా సమాజం కోసం పని చేయాలన్న దృక్పథాన్నినింపాలని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. విద్యార్థుల చేత ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తున్నాం. – లక్ష్మినారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆనందంగా ఉంది విద్యార్థులు మా గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం అభినందనీయం. గ్రామంలో చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్యం చేస్తున్నారు. విద్యార్థుల స్ఫూర్తి తో రానున్నరోజుల్లో అభివృద్ధి పనులు చేపడతాం. – లక్ష్మిదేవమ్మ, ఎంపీటీసీ -
రామన్పాడ్ గేట్లు ఎత్తివేత
–గోపల్దిన్నె రిజర్వాయర్కు నీటివిడుదల వీపనగండ్ల: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు ఆదివారం కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పెబ్బేటి రామచంద్రారెడ్డి, వీపనగండ్ల జెడ్పీటీసీ సభ్యులు మేడిపల్లి లోకారెడ్డిలు రామన్పాడ్ రిజర్వాయర్ వద్దనున్న హౌజ్ఫాల్ షట్టర్స్ను పూర్తిగా పైకి ఎత్తించారు. గత పది రోజులుగా గోపల్దిన్నె రిజర్వాయర్ నుంచి జూరాల పంపిణీ కాలువలకు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో రైతులు వేసుకున్న పంటలకు సరిగా నీరు అందడం లేదు. దీన్ని దష్టిలో ఉంచుకుని నాయకులు మంత్రికి ఈ విషయాన్ని వివరించగా జూరాల డ్యామ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ను వెంటనే హౌజ్ఫాల్ షట్టర్లను ఎత్తించాలని మంత్రి ఆదేశించడంతో మంత్రి ఆదేశానుసారం ప్రజాప్రతినిధులు రామన్పాడ్కు వెళ్లి గేట్లను ఎత్తించారు. ఆ తర్వాత గోపల్దిన్నె రిజర్వాయర్లో కూడా షట్టర్లను ఎత్తించారు. జూరాల పంటకాల్వలకు నీటి ప్రవాహం ఒకటి, రెండు రోజుల్లో పెరగవచ్చని ప్రజాప్రతినిధులు తెలిపారు. జూరాల నుంచి రామన్పాడ్కు రావాల్సిన నీటి శాతం తగ్గిపోవడం వల్లే కాలువలకు సరైన నీరు రావడం లేదని, రైతులు దీన్ని దష్టిలో ఉంచుకుని నీరు వథా కాకుండా చూసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు కష్ణప్రసాద్యాదవ్, సర్పంచ్ బీచుపల్లి యాదవ్, మాజీ సర్పంచ్ జి.రాముడు, స్వామిరెడ్డి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement