breaking news
Genco projects
-
కొత్తగూడెంలో మరో విద్యుత్ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు కానుంది. కొత్తగూడెంలో 800 మెగావాట్ల (ఎంవీ) సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నిర్ణయించింది. అధిక కాలుష్యాన్ని విడుదల చేస్తున్న కాలం చెల్లిన పాత విద్యుత్ కేంద్రాలను మూసివేయాలని కేంద్ర విద్యుత్ శాఖ గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీఎస్)లోని 720 మెగావాట్ల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఏబీసీ) ప్లాంట్ను ఈ ఏడాది చివరిలోగా మూసివేస్తామని జెన్కో హామీ ఇచ్చింది. సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఆధారంగా నాలుగు 60 మెగావాట్ల యూనిట్లు, మరో నాలుగు 120 మెగావాట్ల యూనిట్లు కలిపి 720 మెగావాట్ల ఏబీసీ విద్యుత్ కేంద్రాన్ని నాలుగు దశాబ్దాల కిందట దశల వారీగా జెన్కో నిర్మించింది. ఈ విద్యుత్ కేంద్రాల జీవిత కాలం ముగిసిపోవడంతో నిర్వహణ భారంగా మారింది. ఈ ప్లాంట్లు బొగ్గును అధికంగా వినియోగించుకుని తక్కువ విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. పెద్ద మొత్తంలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 800 మెగావాట్ల కేటీపీఎస్ 7వ దశ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ఈ ఏడాది చివరిలోగా పూర్తి కానున్న నేపథ్యంలో కాలం చెల్లిన ఏబీసీ విద్యుత్ ప్లాంట్లను మూసివేసేందుకు జెన్కో సిద్ధమైంది. మరికొన్ని నెలల్లో ఏడో దశ విద్యుత్ ప్లాంట్ పనులు పూర్తయి విద్యుదుత్పత్తి ప్రారంభం కానుంది. దీంతో 720 మెగావాట్ల ఏబీసీ విద్యుత్ ప్లాంట్లోని ఎనిమిది యూనిట్లను మూసివేసి వాటి స్థానంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ సహాయంతో కొత్తగా 800 మెగావాట్ల ఒకే యూనిట్ నిర్మించాలని జెన్కో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్లో ఏడో దశ ప్లాంట్లో ఉత్పత్తి కేటీపీఎస్ 800 మెగావాట్ల ఏడో దశ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి గత నెల చివరికి వి ద్యుదుత్పత్తి ప్రారంభించాలని జెన్కో గడువు పెట్టుకు న్నా ఇంకా పూర్తి కాలేదు. జూన్ చివరికల్లా ఈ ప్లాంట్ సింక్రనైజేషన్ ప్రక్రియ పూర్తి కానుందని, సెప్టెంబర్ నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభించే అవకాశాలున్నాయని జెన్కో ప్రాజెక్ట్స్ అధికారులు తెలిపారు. కూల్చివేతకు ఏడాదిన్నర.. కొత్తగూడెం ఏబీసీ విద్యుత్ కేంద్రం మూసివేసి అదే స్థలంలో కొత్త విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత జెన్కో చర్యలు ప్రారంభించనుంది. పాత విద్యుత్ ప్లాంట్లోని ఎనిమిది యూనిట్లను కూల్చివేసేందుకు దాదాపు ఏడాదిన్నర వరకు సమయం పట్టనుందని జెన్కో అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు పాత విద్యుత్ కేంద్రాలను కూల్చివేసి వాటి స్థానంలో కొత్త కేంద్రాల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు సులువుగా, సత్వరంగా లభించనున్నాయి. మూసివేయనున్న విద్యుత్ ప్లాంట్కు సంబంధించిన స్థలం, నీటి వనరులు, బొగ్గు లింకేజీలనే కొత్త విద్యుత్ కేంద్రం అవసరాలకు వినియోగించనుండటంతో అనుమతుల ప్రక్రియ త్వరగా పూర్తి కానుంది. -
‘కరెంటు’తో జాగ్రత్తగా ఉండాలి
పీపీఏల రద్దు విషయంలో తెలంగాణ ఆచితూచి వ్యవహరించాలి. ఏపీ విద్యుత్తే వద్దనడం సరికాదు. విభజన చట్టంలో ఉన్న అంశాల మేరకు, ఏపీలో మిగులు విద్యుత్తు ఉంటే, అది మొదట తెలంగాణకే అమ్మాలి. ప్రస్తుతం ఏపీలో మిగులు విద్యుత్తు ఉంది. తెలంగాణకు మరో రెండేళ్లపాటు విద్యుత్ కొరతలు, కోతలు తప్పవు. అత్యంత ఖరీదైన నాఫ్తా ఆధారిత విద్యుత్తును మార్కెట్లో కొనేకన్నా, ఏపీ నుంచి తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంటే దాన్ని వినియోగించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అవసరం తమకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన విద్యుత్తు రావడం లేదంటూ, రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు ఇదే కారణమంటూ ఇప్పటి వరకూ వాదించిన తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి వైఖరి మార్చుకోవడం వెనుక కారణాలను విశ్లేషించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు, 2014లో విద్యుత్తు పంపకాలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా పన్నెండవ షెడ్యూలులో ఉన్నాయి. జెన్కో ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయి. గతంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) యథా తథంగా కొనసాగుతాయి. ప్రస్తుత ప్రాజెక్టులకు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కూడా ఇది వర్తిస్తుంది. రెండు రాష్ట్రాల్లో... ఏదైనా ఒక రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉంటే, రెం డవ రాష్ట్రానికి ఆ విద్యుత్తును కొనుగోలు చేసే మొదటి హక్కు ఉంటుం ది. పక్క రాష్ట్రం తిరస్కరిస్తేనే ఇతరులకు అమ్మే హక్కు ఉంటుంది. వివాదం ఎక్కడ? పీపీఏలు కొనసాగింపుపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. జెన్కో ప్రాజెక్టులతో పోలిస్తే మిగతా ప్రాజెక్టులపై, అంటే కేంద్ర విద్యుత్ సంస్థలు (ఎన్టీపీసీ), ప్రైవేట్ సహజ వాయు ఆధారిత ప్రాజెక్టులు వంటి వాటిపై వివాదాలు అంతగా లేవు. జెన్కో ప్రాజెక్టులతో ఉన్న పీపీఏలకు ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం లేని కారణంగా వీటికి చట్టబద్ధత లేదని ఏపీ వాదించింది. పీపీఏలకు ఏపీఈఆర్సీ అనుమతి లేకున్నా, ఇప్పటికే అనేక సంవత్సరాలుగా అమలులో ఉన్నాయి కాబట్టి, వాటికి చట్టబద్ధత ఉన్నట్టే ననీ... కాబట్టి తెలంగాణకు పీపీఏల ప్రకారం విద్యుత్ రావాల్సిందేనని తెలం గాణ పట్టుబట్టింది. వివాదం ముదరడంతో, కేంద్రం జోక్యం చేసుకొని సెం ట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని జూలై, 2014లో నియమించింది. విభజన చట్టం మేరకు జెన్కో ప్రాజెక్టులపై హక్కు ప్రాంతాల వారీగా ఆయా రాష్ట్రాలకు ఉన్నా, విద్యుత్ సరఫరా మాత్రం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మేరకే సరఫరా కావాలి. జెన్కో ప్రాజెక్టుల సామర్థ్యం తెలంగా ణలో కన్నా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ. ప్రాజెక్టుల నిజ సామర్థ్యాన్ని (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణకు ఏపీ నుంచి ఇప్పటికే నిర్మాణం అయిన ప్రాజెక్టుల ద్వారా సుమారు 370 మెగావాట్ల విద్యుత్తు వస్తుంది. ఇది తెలంగాణకు అందుబాటులో ఉన్న అన్ని రకాల విద్యుత్తు ప్రాజెక్టుల సామర్థ్యంలో సుమారు 8 శాతం. ఏపీలో ఇటీవల, అంటే రాష్ట్ర విభ జన తరువాత, నిర్మాణం పూర్తి చేసుకోనున్న రెండవ యూనిట్ సామర్థ్యం మరో 800 మెగావాట్లను కలుపుకుంటే ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా తెలంగాణ సామర్థ్యంలో సుమారు 25 శాతం ఉంటుంది. మారుతున్న తెలంగాణ వైఖరి కానీ కొరతను ఎదుర్కొంటున్న తెలంగాణ ఏపీ విద్యుత్తును ఎందుకని వద్దంటున్నది? తెలంగాణ ప్రాజెక్టుల విద్యుత్తు ధరతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల ఉత్పత్తి ధర ఎక్కువ. తక్కువ ధరకు ఏపీకి విద్యుత్తును ఇచ్చి, అధిక ధరకు ఏపీ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయడం తెలంగాణకు దీర్ఘ కాలంలో పెనుభారమవుతుంది. తెలంగాణలో రెండు ప్రధానమైన ప్రాజెక్టులు త్వరలో నిర్మాణాన్ని పూర్తి చేసుకోనున్నాయి. మొదటిది వరంగల్ జిల్లా భూపాలపల్లి వద్ద నిర్మిత మవుతున్న కేటీపీపీ రెండవ దశ 600 మెగావాట్ల ప్రాజెక్టు. రెండవది సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలో నిర్మిత మవుతున్న 2గీ600 మెగావాట్ల ప్రాజెక్టు. వీటి నుంచి వచ్చే ఏడాది మార్చి నెలలోగా ఉత్పత్తి మొదలవుతుందని తెలంగాణ అంచనా. దీనితో కొరత చాలా వరకు తీరిపోనున్నది. అంటే రెండేళ్ల కాలాన్ని తీసు కుంటే, తెలంగాణలో వచ్చే విద్యుత్తు 1,800 మెగావాట్లు కాగా ఏపీలో వచ్చే విద్యుత్తు 2,200 మెగావాట్లు (కృష్ణపట్నం 2 గీ 800 మెగావాట్లు, ఆర్టీపీపీ 4వ దశ-600 మెగావాట్లు) ఇందులో ఆర్టీపీపీ ప్రాజెక్టు ధర మార్కెట్లో లభించే విద్యుత్తు ధర కన్నా చాలా ఎక్కువ. ఈ మూడేళ్లలో ఇతర దక్షిణాది రాష్ట్రాలలో మొదలవుతున్న ఎన్టీపీసీ ప్రాజెక్టుల నుంచి సుమారు 1,000 మెగావాట్ల విద్యుత్తు తెలంగాణకు రానుంది. ఈ ప్రాజెక్టులే కాక మరో 6,000 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణాన్ని తెలం గాణ ప్రభుత్వం మరో 3-4 ఏళ్లల్లో పూర్తి చేయాలని భావిస్తోంది. ఏపీలో తలపెట్టిన ప్రాజెక్టులకన్నా ఇవే ముందు ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. మూడేళ్ల తరువాత ఛత్తీస్గఢ్ నుంచి కనీసం 1,000 మెగావాట్ల విద్యుత్తు తెలంగాణకు రానుంది. విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ 4,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును తెలంగాణలో నిర్మించాలి. ఇది కూడా 5 ఏళ్లలో వచ్చే అవ కాశం ఉంది. సుమారు 5,000 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ ప్రాజెక్టులను 5 ఏళ్లలో పూర్తి చేయాలని తెలంగాణ భావిస్తోంది. మరో రెండేళ్లలో చాలా వరకు తెలంగాణలో విద్యుత్ కష్టాలు తీరను న్నాయి. మిగిలిన అన్ని ప్రాజెక్టులు కూడా నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటే తెలం గాణ పూర్తి మిగులు విద్యుత్తు రాష్ట్రంగా అవతరిస్తుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కొనసాగితే రెండేళ్ల పాటు తెలంగాణకు లాభం ఉన్నా, దీర్ఘ కాలంలో ఏపీ విద్యుత్తు తెలంగాణకు భారంగా మారుతుంది. ముఖ్యంగా, విద్యుత్తు లాంటి అంశాలలో పీపీఏలు కొనసాగితే, 25 ఏళ్లపాటు రెండు రాష్ట్రాలు పంపకాలు కొనసాగించాల్సి వస్తుంది. అనవసరమైన దీర్ఘకాలిక వివాదాలకు ఇది దారి తీసే ప్రమాదం ఉంది. అసలు ఏపీ విద్యుత్తే వద్దా? 2014, ఖరీఫ్లో విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న తెలం గాణ రైతాంగం, గత అనుభవం దృష్ట్యానో, ప్రభుత్వ విజ్ఞప్తుల మేరకో ఆరు తడి పంటలను ఎక్కువగా వేయలేదు. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇది గత ఏడాదిలో 60 శాతమే. దీంతో ఈ వేసవిలో కోతలు తక్కువగా కనిపిస్తు న్నాయి. కానీ ఇదే పరిస్థితి భవిష్యత్తులో ఉండక పోవచ్చు. వచ్చే ఖరీఫ్ నుంచి మళ్లీ వ్యవసాయ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అందుకే పీపీఏల రద్దు విషయంలో తెలంగాణ ఆచితూచి వ్యవహ రించాలి. ఏపీ విద్యుత్తే వద్దనడం సరికాదు. విభజన చట్టంలో ఉన్న అంశాల మేరకు, ఏపీలో మిగులు విద్యుత్తు ఉంటే, అది మొదట తెలంగాణకే అమ్మాలి. ప్రస్తుతం ఏపీలో మిగులు విద్యుత్తు ఉంది. తెలంగాణకు మరో రెండేళ్లపాటు విద్యుత్ కొరతలు, కోతలు తప్పవు. అత్యంత ఖరీదైన నాఫ్తా ఆధారిత విద్యు త్తును మార్కెట్లో కొనేకన్నా, ఏపీ నుంచి తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంటే దాన్ని వినియోగించుకోవాలి. మరో వైపు విశాఖలో పూర్తి కావస్తున్న 1,040 మెగావాట్ల హిందూజా ప్రాజెక్టు ఏపీలో ఉన్నా, ఇది ప్రైవేట్ ప్రాజెక్టు కావడంతో దీనిలో తెలంగాణకు 560 మెగావాట్ల వాటా వస్తుంది. 2013లో అప్పటి డిస్కంలు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టు పీఈఆర్సీ పరిధిలోకి వస్తుంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ ప్రాజెక్టు ఉత్పత్తి ధర నిర్ణయ మవుతుంది. ఇంకా ఈ ప్రాజెక్టుకు స్వదేశీ బొగ్గు కేటాయింపులు ఉన్నాయి కాబట్టి, ధర కూడా ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఏపీలో నిర్మాణం పూర్తి కావస్తున్న కృష్ణపట్నం ప్రాజెక్టు జెన్కో ప్రాజెక్టు కాదు. దీనిని ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీపీడీసీఎల్) ఆధ్వ ర్యంలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు పెట్టుబడిలో తెలంగాణకు ఇప్పటికే సుమా రు 24 శాతం వాటా ఉంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు సుమారు 51 శాతం వాటా వచ్చే అవకాశం ఉంది. 51 శాతం వాటా రావాలన్న వివాదం ప్రస్తుతం కేంద్రం నియమించిన కమిటీ పరిశీలనలో ఉంది. పీపీఏలు కొనసాగకున్నా తెలంగాణకు పెట్టుబడి ఆధారంగా వాటా కోరవచ్చు. పెట్టు బడి విషయమే కాకుండా... ఈ ప్రాజెక్టు 1,000 మెగావాట్ల సామర్థ్యం మించి ఉండటంతో దీన్ని కేంద్రం మెగా పవర్ ప్రాజెక్టుగా (ఎంపీపీ) గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కనీసం 10 శాతం విద్యుత్తును ప్రాజెక్టు ఉన్న రాష్ర్టం అవతల అమ్మాలి. ఆ విద్యుత్తు తెలంగాణకు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి పీపీఏలు రద్దయినా ఏపీ నుంచి విద్యుత్తు వచ్చే అవకాశాలు అనేకం. వాటిని తెలంగాణ కోల్పోకూడదు. పీపీఏల రద్దుతో ప్రయోజనమే పీపీఏల రద్దుతో రెండు రాష్ట్రాలకూ అనేక ప్రయోజనాలున్నాయి. అనవసర మైన వివాదాలకు పరిష్కారమే కాకుండా, వందల కోట్ల అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీల భారం కూడా తప్పుతుంది. గతంలో హైదరాబాద్ నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మొత్తం విద్యుత్తులో తెలంగాణకు అధిక వాటాను (54 శాతం) కేటాయించారు. పీపీఏల రద్దుతో తెలంగాణకు ఏపీ నుంచి వస్తున్న కొంత విద్యుత్తు ఆగిపోతుంది. మరోవైపు ఉమ్మడి రాజ ధాని విద్యుత్ అవసరాలను తెలంగాణ తీర్చాల్సిన అవసరం మాత్రం కొనసాగు తుంది. ఈ అంశం కారణంగా, పదేళ్లు కాకున్నా, మరో రెండు - మూడేళ్లు తెలంగాణకు 500 మెగావాట్లు అదనంగా కేటాయించమని కేంద్రాన్ని కోరాలి. చివరగా, రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్తు వివాదాలపై కేంద్రం నియమించిన కమిటీ తన నివేదికను ఏప్రిల్ 30, 2015లోగా సమర్పించనున్నది. ఈ లోగా, మారిన వైఖరికి అనుగుణంగా తెలంగాణ తక్షణం తన ప్రతిపాదనలను కేం ద్రానికి సమర్పించాలి. ఏపీ కూడా పీపీఏల రద్దు కోరుతుంది కాబట్టి, రెండు రాష్ట్రాలూ చర్చించుకుని ఒక అంగీకారానికి వస్తే, మంచి సంకేతాన్ని అందరికీ పంపినట్లవుతుంది. (వ్యాసకర్త తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయ కర్త) మొబైల్: 94901 54023