Gautam Vasudev Menon
-
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా
తెలుగులో కమర్షియల్ సినిమాలు ఎక్కువగా వస్తాయి. తమిళ, మలయాళంలో మాత్రం కంటెంట్ ఓరియెంటెడ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండే చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. అలా రెండు నెలల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఓ మూవీ.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులోచ చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్.. 'మధువిధు' తెలుగు రివ్యూ)తెలుగులోనూ అల వైకుంఠపురములో, క్రాక్ తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని లీడ్ రోల్ చేసిన తమిళ మూవీ 'కార్మేని సెల్వం'. గౌతమ్ మేనన్ మరో కీలక పాత్ర చేశారు. ఏప్రిల్ 3న థియేటర్లలో తెలుగులోనూ రిలీజైన ఈ చిత్రం.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలంటే ఇష్టముంటే దీనిపై లుక్ వేయొచ్చు.'కార్మేని సెల్వం' విషయానికొస్తే.. సెల్వం(సముద్రఖని).. సంపత్(గౌతమ్ మేనన్) దగ్గర కారు డ్రైవరుగా పనిచేస్తుంటాడు. సెల్వం భార్య శాంతి (లక్ష్మి) ఇడ్లీ బండి నడుపుతూ ఉంటుంది. చాలా డబ్బు సంపాదించి సొంతిల్లు కట్టుకోవాలన్నది సెల్వం దంపతుల కల. దీనికోసం రోజూ కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. ఓ సందర్భంలో బంధువులే వీళ్లని తీవ్రంగా అవమానిస్తారు. తర్వాత అనుకోని సంఘటనలు జరుగుతాయి. దీంతో సెల్వం.. తన యజమాని సంపత్ని మోసం చేస్తాడు. తర్వాత అంతకుమించి అప్పులు కూడా చేస్తాడు. వాటిని తీర్చే క్రమంలో సెల్వం కుటుంబం ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.మరోవైపు ఓటీటీలో ఈ వారం ధురంధర్ 2, పేట్రియాట్, కేడీ, 29, మా బెహన్, ద రైజ్ ఆఫ్ అశోక.. లాంటి తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా) -
స్టార్ హీరో సినిమాకు మోక్షం.. ఎట్టకేలకు పదేళ్ల తర్వాత..!
కోలీవుడ్ స్టార్ విక్రమ్ సినిమాకు దాదాపు పదేళ్ల తర్వాత మోక్షం లభించింది. ఆర్థిక వివాదాలతో వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ రిలీజ్కు మార్గం సుగమమైంది. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ధృవనక్షత్రం రిలీజ్కు మద్రాస్ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 15 లోపు విడుదల చేసుకునేలా వీలు కల్పించింది. కొండాడువోమ్ ఎంటర్టైన్మెంట్ పేరిట బ్యాంకు ఖాతాను తెరవాలని సూచించింది. దీని ద్వారానే ఈ సినిమాకి సంబంధించిన లావాదేవీలు జరగాలని కోర్టు ఆదేశించింది.దీంతో 2016లో ప్రారంభమైన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మొదట 2017లోనే విడుదల చేయాలని డైరెక్టర్ గౌతమ్ మేనన్ యత్నించారు. కానీ ఆర్థిక పరమైన చిక్కులతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఆ తర్వాత 2023లోనూ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. శింబు హీరోగా గౌతమ్ మీనన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రూ.2.40 కోట్లు తీసుకున్నారని ఆల్ ఇన్ పిక్చర్స్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ డబ్బు తమకు తిరిగి ఇవ్వలేదని.. ఆయన ధృవ నక్షత్రం సినిమా విడుదలపై నిషేధం విధించాలని నిర్మాణ సంస్థ కోర్టును కోరింది. ఈ వివాదంతో ధృవనక్షత్రం మరోసారి వాయిదా వేయాల్సి ఉంది.ఆ తర్వాత కూడా 2024లో జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉందని చిత్ర బృందం మరోసారి సంకేతాలిచ్చింది. కానీ అప్పుడు కూడా ఆ విడుదల కాలేదు. అలా ఇప్పటికే పలుసార్లు పోస్ట్పోన్ చేస్తూ వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ఈ మూవీలో విక్రమ్, వినాయకన్, రీతూ వర్మ, పార్థిబన్, సిమ్రాన్, రాధికా శరత్కుమార్ కీలక పాత్రలు పోషించారు. -
'ఏ మాయ చేశావే నాగచైతన్యతో కాదు.. ఆ స్టార్ హీరోతో చేయాలని': డైరెక్టర్
ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచింది. నాగచైతన్య, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ సమంత ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ లవ్ ఎంటర్టైనర్ చిత్రంలో జెస్సీ పాత్రలో మెరిసింది. 2010లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. దీంతో ఈ సినిమా రిలీజై జూలై 18 నాటికి 15 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రం గురించి మాట్లాడారు. అయితే మొదటి ఏ మాయ చేశావే చిత్రానికి హీరోగా నాగచైతన్యను అనుకోలేదని తెలిపారు. స్టార్ హీరో మహేశ్ బాబుతోనే తీద్దామని ఈ కథను రాసుకున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో క్లైమాక్స్లో చిరంజీవి గెస్ట్ రోల్గా పెట్టాలని అనుకున్నట్లు గౌతమ్ వాసుదేవ్ తెలిపారు. క్లైమాక్స్ భిన్నంగా ఉండాలని మెగాస్టార్తో ప్లాన్ చేశానని పేర్కొన్నారు.కాగా.. జూలై 18న 'ఏమాయ చేసావె' రీ రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో కూడా విడుదలైంది. అక్కడ 'విన్నైతాండి వరువాయా' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో శింబు, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. కానీ ఈ సినిమా హిందీలో 'ఏక్ థా దీవానా' పేరుతో రీమేక్ అయింది. అక్కడ మాత్రం పరాజయం చవి చూసింది. Gautam Vasudev Menon explaining how the #YMC story developed keeping Mahesh babu @urstrulyMahesh in mind , and initial climax he planned was different planning to cast Chiranjeevi as guest role pic.twitter.com/iC2gXj3uhu— #Coolie varaaru 🌟 (@yourstrulyvinay) July 1, 2025 -
మెగాస్టార్ యాక్షన్ థ్రిల్లర్.. 'బజూక' ట్రైలర్ వచ్చేసింది!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తోన్న తాజా చిత్రం బజూక. డినో డెన్సిస్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్లో మమ్ముట్టి యాక్షన్ సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు.ట్రైలర్లో ఫైట్స్ సీక్వెన్స్, మమ్ముట్టి యాక్షన్ చూస్తుంటే అభిమానుల్లో మరింత అంచనాలు పెంచేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజున అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. అజిత్ మూవీతో మమ్ముట్టి బజూక సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది. -
ఏమాయ చేసావేకి’ నెక్ట్స్ లెవల్
నాగచైతన్య, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఏమాయ చేశావె’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. మంజిమా మోహన్ కథానాయిక. మిర్యా సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలవుతోంది. గౌతమ్ మీనన్ మాట్లాడుతూ -‘‘ ‘ఏమాయ చేసావే’ నెక్ట్స్ లెవల్ మూవీ ఇది. ఆ చిత్రంలోని అబ్బాయి మగాడు అయిన తర్వాత అతడి ప్రవర్తన ఎలా ఉంటుందన్నది ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు. ‘‘గౌతమ్ మీనన్గారి దర్శకత్వంలో సినిమా చేస్తున్న ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నా. నన్ను సరికొత్త స్టయిల్లో చూపిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అని నాగచైతన్య చె ప్పారు. నిర్మాతలు ‘దిల్’రాజు, బెల్లంకొండ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


