-
ఫాలోఆన్ దిశగా శ్రీలంక
-
పట్టు బిగించారు
►ఫాలోఆన్ దిశగా శ్రీలంక ►భారత్ తొలి ఇన్నింగ్స్లో 600 ఆలౌట్ ►శ్రీలంక 154/5 గాలే టెస్టులో లంక విలవిలలాడుతోంది. భారత్ జోరు రెండో రోజూ కొనసాగింది. మొదట బ్యాట్తో తర్వాత బంతితో ఆతిథ్య జట్టుపై పైచేయి సాధించింది. అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా, పేసర్ షమీ బ్యాటింగ్లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. బౌలింగ్లోనూ షమీ కీలక వికెట్లు పడగొట్టడంతో లంక జట్టు ఫాలోఆన్ ప్రమాదంలో పడింది. రెండో రోజు తరంగ రనౌట్ హైలైట్. రెప్పపాటు కాలంలోనే ఫీల్డర్ ముకుంద్, కీపర్ సాహా సమన్వయం ఆతిథ్య జట్టును పెద్ద దెబ్బ తీసింది. గాలే: కోహ్లి సేన ఆల్రౌండ్ జోరు చూస్తుంటే తొలి టెస్టు చేతిలోకి వచ్చినట్టే కనబడుతోంది. మొదటి రోజు బ్యాటింగ్లో భారీస్కోరు చేసిన భారత్... రెండోరోజు బౌలింగ్లో లంకను చావుదెబ్బ తీసింది. దీంతో ఇప్పుడు శ్రీలంక ఫలితం కోసం కాకుండా ‘ఫాలోఆన్’ను తప్పించుకునేందుకే పోరాడుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 133.1 ఓవర్లలో 600 పరుగులు చేసి ఆలౌటైంది. సెంచరీ హీరో చతేశ్వర్ పుజారా (265 బంతుల్లో 153; 13 ఫోర్లు) త్వరగానే ఔటైనా... రహానే (130 బంతుల్లో 57; 3 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (49 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. లంక బౌలర్ నువాన్ ప్రదీప్ 6, లాహిరు కుమార 3 వికెట్లు తీశారు. తర్వాత శ్రీలంక ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఉపుల్ తరంగ (93 బంతుల్లో 64; 10 ఫోర్లు), మాథ్యూస్ (91 బంతుల్లో 54 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. షమీకి 2 వికెట్లు దక్కాయి. ఇప్పుడు రనౌట్... అక్టోబర్ నుంచి నాటౌట్! చివరి సెషన్లో కుదురుగా ఆడుతున్న తరంగ రనౌట్ అనూహ్యం... అద్భుతం! ఫీల్డర్ ముకుంద్, కీపర్ సాహా మెరుపు సమన్వయానికి నిదర్శనం. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 34వ ఓవర్ చివరి బంతిని తరంగ సిల్లీ పాయింట్ వైపు ఆడాడు. అక్కడే ఉన్న ముకుంద్ ఆలస్యం చేయకుండా కీపర్కు అం దించగా... సాహా బెయిల్స్ను పడగొట్టాడు. అప్పటికే తరంగ బ్యాట్ క్రీజ్లోకి చేరినా... సాహా బెయిల్స్ పడేసే సమయానికి బ్యాట్ గాల్లోకి లేచింది. దీంతో తరంగ అవుట య్యాడు. అక్టోబర్ 1 నుంచి మారే కొత్త నిబంధనల ప్రకారం బంతి వికెట్లను తాకే సమయానికి బ్యాట్ క్రీజ్లోకి చేరితే చాలు. బెయిల్స్ పడే సమయంలో బ్యాట్ గాల్లో ఉన్నా నాటౌట్గానే పరిగణిస్తారు. సెషన్–1 రాణించిన అశ్విన్ ఓవర్నైట్ బ్యాట్స్మెన్ పుజారా, రహానేలను లంక బౌలర్లు నిలువరించారు. ఆట ఆరంభంలోనే పుజారాను ప్రదీప్ అవుట్ చేయడంతో నాలుగో వికెట్కు 137 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే అర్ధసెంచరీ తర్వాత రహానే... లాహిరు బౌలింగ్లో నిష్క్రమించాడు. ఈ దశలో అశ్విన్ (60 బంతుల్లో 47; 7 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (16) జట్టు స్కోరును 500 పరుగులకు చేర్చారు. లంచ్ విరామానికి ముందు వీరిద్దరూ నిష్క్రమించడంతో భారత్ 503/7 స్కోరుతో సెషన్ను ముగించింది. ఓవర్లు: 27, పరుగులు: 104, వికెట్లు: 4 సెషన్–2 పాండ్యా దూకుడు ఈ సెషన్ మొదలైన కాసేపటికే రవీంద్ర జడేజా అవుటయ్యాడు. ఈ దశలో హార్దిక్ పాండ్యాకు జతయిన షమీ ఆతిథ్య బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. హెరాత్ బౌలింగ్లో షమీ, ప్రదీప్ బౌలింగ్లో పాండ్యా చెరో 3 సిక్సర్లు బాదారు. వేగంగా తొమ్మిదో వికెట్కు 8.3 ఓవర్లలోనే 62 పరుగులు జతచేరాయి. పాండ్యా 48 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తర్వాతి బంతికే అతను ఔటవ్వడంతో 600 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. ఓవర్లు: 16.1, పరుగులు: 97, వికెట్లు: 3 (భారత్) ఓవర్లు: 7, పరుగులు: 38, వికెట్లు: 1 (శ్రీలంక) సెషన్–3 షమీ జోరు చివరి సెషన్లో ఈ సారి షమీ బంతితో దెబ్బ తీశాడు. తొలుత గుణతిలక (16)ను, మెండిస్ (0)ను నాలుగు బంతుల వ్యవధిలో పెవిలియన్ చేర్చాడు. ఈ ఇద్దరి క్యాచ్లు ధావన్ చేతికి చిక్కాయి. 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను మాథ్యూస్, తరంగ ఆదుకున్నారు. వీరిద్దరూ నిలదొక్కుకుంటున్న తరుణంలో అర్ధసెంచరీ పూర్తయ్యాక తరంగ రనౌటయ్యాడు. ఓవర్లు: 37, పరుగులు: 116, వికెట్లు: 4 -
కెప్టెన్ కోహ్లీ సెంచరీ, ఔట్
-
కెప్టెన్ కోహ్లీ సెంచరీ, ఔట్
గాలే: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 191 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 11 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. జట్టు స్కోరు 252/2, వ్యక్తిగత స్కోరు 98 వద్ద ఫోర్ కొట్టి టెస్లుల్లో 11వ శతకాన్ని నమోదు చేశాడు. కానీ సెంచరీ చేసిన అనంతరం కౌశల్ బౌలింగ్లో జట్టు స్కోరు 255 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా మూడో వికెట్ రూపంలో నిష్ర్కమించాడు. మరో ఎండ్ లో శిఖర్ ధావన్ 121 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. కోహ్లీ ఔటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే కౌశల్ బౌలింగ్ లోనే ఎల్బీడబ్ల్యూ అయి డకౌట్ గా వెనుదిరిగాడు. కేవలం ఫుట్వర్క్ లోపంతోనే భారత టాపార్డర్ బ్యాట్స్మన్స్ ఇలా ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో కౌశల్ 2 వికెట్లు, ప్రసాద్, ఎంజెలో మాథ్యూస్ చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం ధావన్ 121పరుగులు (237 బంతులు, 12 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (0) పరుగులతో క్రీజులో ఉన్నారు. శ్రీలంకతో టెస్టులో మూడో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం 227 పరుగులు విరాట్ కోహ్లీ, ధావన్ నెలకల్పారు. గతంలో వినోద్ కాంబ్లి, సచిన్ టెండూల్కర్ జోడి చేసిన 162 పరుగుల రికార్డును కోహ్లీ-ధావన్ జంట తిరగరాశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
Actor Nani HD Stills: వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement