breaking news
freight rates
-
వారం రోజులుగా ఖాళీగా ఉంటున్న ట్రక్కు డ్రైవర్లు
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణ నిర్ణయం ట్రక్కు డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వస్తున్న నేపథ్యంలో కీలక రంగాల్లోని తయారీదారులు, డీలర్లు.. ముఖ్యంగా ఆటోమొబైల్స్, వైట్ గూడ్స్ పంపిణీలను తాత్కాలికంగా నిలిపివేశారు. దాంతో దేశవ్యాప్తంగా లక్షలాది ట్రక్కులు ఖాళీగా ఉన్నాయి. కొత్త జీఎస్టీ అమలు తర్వాత వస్తువుల ధరలు తగ్గుతాయని నమ్ముతున్న తరుణంలో ఈమేరకు సరఫరా స్తంభించినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 22 తర్వాత తిరిగి ఈ వస్తువుల రవాణా ప్రారంభమవుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.వేచి ఉండాల్సిందే..జీఎస్టీ 2.0 అమలు దగ్గరపడుతుండడం, త్వరలో ధరలు తగ్గుతాయనే భావనతో కొత్త కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో గత వారంలో సరుకు రవాణా రేట్లు 30-35% పడిపోయాయి. సాధారణంగా చెన్నై తయారీ కేంద్రాల నుంచి భారతదేశం అంతటా కొన్ని కంపెనీల కార్ల రవాణా జరుగుతోంది. ఇది గతవారం రోజులుగా గణనీయంగా తగ్గుముఖం పట్టిందని జోగిందర్ సింగ్ అనే ట్రక్కు డ్రైవర్ తెలిపారు. ‘కంపెనీ ఉత్పత్తుల డెలివరీలు నిలిపేశారు. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చే వరకు వేచి ఉండాలని రవాణా ఏజెన్సీలు చెప్పాయి’ అన్నారు.సరుకు రవాణా పెరిగే అవకాశందిల్లీకి చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ చేతక్ గ్రూప్ డైరెక్టర్ సచిన్ జేకేఎస్ హరితాష్ మాట్లాడుతూ..‘త్వరలో కొత్త జీఎస్టీ అమలు నేపథ్యంలో దాదాపు 90 శాతం ట్రక్కులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. సరఫరాదారులు, రిటైలర్లు వస్తువుల ఇన్వాయిస్లను నిలిపేశారు. నవరాత్రి-దీపావళి సీజన్లో వాహన తయారీదారులు, రిటైలర్లు బ్యాక్లాగ్లను క్లియర్ చేయడానికి, వస్తువులను పంపిణీ చేయడానికి వేగంగా పని చేస్తారు. దాంతో సెప్టెంబర్ 22 నుంచి వస్తు సరఫరాలో రష్ మొదలవుతుంది. డిమాండ్ అకస్మాత్తుగా పెరగడం, వాహనాల పరిమిత లభ్యత కారణంగా జీఎస్టీ అమలు తర్వాత సరుకు రవాణా రేట్లు 30-40 శాతం పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.డీలర్ల ఎదురుచూపుడీలర్లు సవరించిన జీఎస్టీ బిల్లింగ్ మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నందున ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. బుకింగ్స్ కొనసాగుతున్నప్పటికీ ఈ వారం డెలివరీలు జరగడం లేదని ఒక ప్రధాన ఆటో డీలర్ షిప్ ప్రతినిధి ధ్రువీకరించారు. ‘ఈ రోజు బుకింగ్ చేసినప్పటికీ కొత్త జీఎస్టీ నిర్మాణం ప్రకారం బిల్లింగ్ ప్రారంభిస్తాం. సెప్టెంబర్ 22 తర్వాత డెలివరీలు షెడ్యూల్ అవుతున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: సాఫ్ట్ డ్రింక్స్పై ‘హార్డ్’ నిర్ణయం.. డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన -
సామాన్యుడిపై మరో పిడుగు
ఇప్పటికే చమురు ధరలు మండిపోతుండటంతో అవస్థలు పడుతున్న సామాన్యూడిపై మరో పిడుగు పడే ప్రమాదం ఉంది. పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగా రవాణా ఛార్జీలు 25శాతం వరకు పెరగవచ్చని ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టు వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్ ప్రదీప్ సింఘాల్ పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా డీజిల్ ధరలు 30 నుంచి 35 శాతం పెరిగాయి. దీని కారణంగా రవాణా ఛార్జీలను 25 శాతం నుండి 30 శాతం పెంచడం తప్ప మాకు మరో మార్గం లేదు అని సింఘాల్ అన్నారు. సాధారణంగా ఇటువంటి ఒప్పందాలు కంపెనీల మధ్య వార్షిక, అర్థ సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. ఇప్పటికే మార్కెట్ లో నెలకొన్న తీవ్రమైన పోటీ కారణంగా మధ్యలో రేట్లు పెంచడానికి సాధ్యపడదు. ఆ భారాన్ని మేమే భరించాలి అని అన్నారు. మార్కెట్ ధరలు అనుగుణంగా ధరలను పెంచకపోతే ఆ ప్రభావం రవాణ సంస్థల లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మా మూలధన వ్యయాలు పెరుగుతాయి. అందుకే డీజిల్ ధరలను తగ్గించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇది అన్ని పరిశ్రమలపై ప్రభావం చూపుతుంది. అందుకే చమురు ధరలు భారతదేశం అంతటా ఒకేలా ఉండాలి. అప్పుడే అన్ని ప్రదేశాలకు మా ట్రక్కులను పంపిస్తాము. చమురు ధరల సవరింపు అనేది కూడా నెలకు ఒకసారి మాత్రమే చేయాలనీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని ప్రదీప్ అన్నారు. ఒకవేల రవాణా ఛార్జీలు పెంచినట్లయితే ఈ ప్రభావం ప్రతి వస్తువు ధర పెరిగే అవకాశం ఉంది. చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక! రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ -
బొగ్గు రవాణా చార్జీల మోత!
ముంబై: రైల్వే ఆదాయాలను పెంచుకునే లక్ష్యంతో బొగ్గు రవాణా చార్జీలను రైల్వే బోర్డ్ సవరించింది. ఇంధన ద్రవ్యోల్బణం పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ రేల్వే బొగ్గు రవాణా చార్జీలను పెంచింది. 19శాతం చార్జీలను పెంచుతున్నట్టు మంగళవారం వెల్లడించింది. కేవలం బొగ్గు రవాణా పై మాత్రమే 19 శాతం వరకు చార్జీలను పెంచుతున్నట్టు రైల్వే బోర్డ్ సభ్యులు వివరణ ఇచ్చారు. 100 కి.మీ పరిధిలోపు ఎలాంటి పెంపులేదని., 200-700 మధ్య 8-14 శాతం, 700 కి.మీ పైన మరింత పెంపు ఉండనుందని స్పష్టం చేసింది. దీని ప్రభావం సిమెంట్ , పవర్ కంపెనీలపై పడనుందని ఎనలిస్టులు అభిప్రాయపడ్డారు. మరోవైపు మార్కెట్లో స్టీల్, సిమెంట్ రంగాలు నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా సిమెంట్ దిగ్గజం,అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, ఏసీసీ, స్టీల్ రంగంలో జెఎస్డబ్ల్యు స్టీల్ లిమిటెడ్ నష్టపోయాయి.