breaking news
five state results
-
విజయ్ పవర్ స్ట్రోక్.. తెర వెనుక ఐదుగురు!
తమిళనాట ఎన్నికల పర్వం ముగిసింది. భారీ మెజార్టీతో టీవీకే విజయం సాధించారు. ద్రవిడ దిగ్గజ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు విజయ్ చుక్కలు చూపించి అధికారం చేజిక్కించుకున్నారు. అయితే, టీవీకే సాధించిన ఆకస్మిక విజయం వెనుక ఐదుగురు సీక్రెట్ సభ్యులు నిర్ణయాత్మక పాత్ర పోషించారు. దీంతో, వారి గురించే ఇప్పుడు ప్రత్యేక చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరంటే..తమిళనాడులో విజయ్కు ఇప్పటికే బలమైన అభిమానగనం ఉంది. అభిమానుల విధేయతను ఎన్నికల బలంగా మార్చగలిగే ఒక శక్తివంతమైన ఆన్లైన్ సైన్యం విజయ్ వద్ద అప్పటికే అందుబాటులో ఉంది. ఇక అవసరమైంది కేవలం ఒక పార్టీ నిర్మాణాన్ని రూపొందించుకోవడం మాత్రమే. అందులో భాగంగానే.. విజయ్ కోసం ఐదుగురు సభ్యుల సీక్రెట్ టీమ్.. ఎన్. ఆనంద్, అరుణ్రాజ్, CTR నిర్మల్ కుమార్, ఆధవ్ అర్జున, KA సెంగుట్టువన్ రంగంలోకి దిగారు. ఈ కీలక బృందం టీవీకే సందేశాన్ని రూపొందించడంలోనూ, క్షేత్రస్థాయి కార్యకలాపాలను నిర్వహించడంలోనూ కీలక పాత్ర పోషించింది. వీరందరూ కలిసి విజయ్ సినీ ప్రపంచంలో ఒక భాగంగా ఉంటూ టీవీకే విజయ రథాన్ని విజయం వైపు నడిపించారు.ఆనంద్ (Bussy ఆనంద్)ఆనంద్ 2006లో పుదుచ్చేరిలోని 'Bussy' నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుండి, ఈయన 'Bussy' ఆనంద్గా ప్రాచుర్యం పొందారు. విజయ్ తరపున క్షేత్రస్థాయిలో వ్యవహరించే ప్రధాన వ్యక్తి ఈయనే. విజయ్ను 'దళపతి' అని సంబోధించే ఆయన, విజయ్ అభిమాన సంఘమైన 'విజయ్ మక్కల్ ఇయక్కం'ను నేటి టీవీకేగా తీర్చిదిద్దడంలో కేంద్ర బిందువుగా నిలిచారు. విజయ్ పార్టీ పేరును ప్రకటించి, పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంలో ఆయన విధేయత స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత, కళ్లలో నీళ్లతో, భావోద్వేగానికి లోనైన ఆనంద్.. విజయ్ పక్కన కూర్చుని కనిపించారు. 2026 ఎన్నికల్లో టీనగర్ నియోజకవర్గం నుండి ఆనంద్ విజయం సాధించారు.అరుణ్రాజ్..ఎంబీబీఎస్ పట్టా కలిగి మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన అరుణ్రాజ్ తన పరిపాలనా నైపుణ్యాన్ని టీవీకే పార్టీకి అందించారు. పన్ను దాడులు, విచారణలను నిర్వహించడంలో విశేష అనుభవం ఉన్న అరుణ్రాజ్.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో పాలుపంచుకోవడానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. కొద్ది కాలంలోనే ఆయన TVK అంతర్గత కోర్ కమిటీలో ఒక కీలక సభ్యుడిగా ఎదిగారు. విజయ్ అనుసరించే స్వతంత్ర రాజకీయ వైఖరి తనను ఆకర్షించిందని అరుణ్రాజ్ గతంలో పేర్కొన్నారు. డీఎంకే పార్టీని తీవ్రంగా విమర్శించే ఆయన, 2026 ఎన్నికల్లో తిరుచెంగోడ్ నియోజకవర్గం నుండి విజయం సాధించారు.CTR నిర్మల్ కుమార్నిర్మల్ కుమార్.. TVK పార్టీకి డేటా, సోషల్ మీడియా నిపుణుడిగా వ్యవహరించారు. 2025లో టీవీకేలో చేరడానికి ముందు బీజేపీలో పనిచేసి రాజకీయ మెలకువలను నేర్చుకున్నారు. వాస్తవానికి, తమిళనాడులో టీవీకే డిజిటల్ ఉనికిని పెంచడంలో నిర్మల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అయితే, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో ఏర్పడిన తీవ్ర విభేదాల కారణంగా ఆయన కాషాయ పార్టీని వీడి, అన్నాడీఎంకేలో చేరారని వార్తలు వచ్చాయి. కానీ, అన్యూహంగా ఆయన టీవీకే చేరారు. నిర్మల్.. టీవీకేలో చేరిన తర్వాత సర్వేలు, ఓటర్ల డేటా విశ్లేషణ, పోలింగ్ బూత్ స్థాయి విశ్లేషణలపై ప్రత్యేక దృష్టి సారించారు. టీవీకే పార్టీకి 30% ఓట్ల వాటా లభిస్తుందని ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నారు. అంతిమంగా పార్టీ 35% ఓట్ల వాటాను సాధించింది. ఆయన అందించిన వ్యూహాత్మక సూచనలే విజయ్ ఎన్నికల ప్రచార నిర్ణయాలను ప్రభావితం చేశాయి. ఈ ఎన్నికల్లో ఆయన తిరుప్పరంకుండ్రం నియోజకవర్గం నుండి విజయం సాధించారు.ఆధవ్ అర్జునఆధవ్ అర్జున భారతదేశ లాటరీ రాజుగా ప్రసిద్ధి. శాంటియాగో మార్టిన్ అల్లుడైన ఆధవ్ రాజకీయ ప్రస్థానం పలు రాజకీయ పార్టీల గుండా సాగింది. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని 'Voice of Commons' అనే రాజకీయ సలహా సంస్థను స్థాపించడం ద్వారా ప్రారంభించారు. త్వరలోనే ఆయన పనితీరు డీఎంకే పార్టీ దృష్టిని ఆకర్షించింది. దాంతో 2021లో ఆయన డీఎంకేలో చేరారు. వాస్తవానికి డీఎంకే కోసం పనిచేసేలా ప్రశాంత్ కిషోర్ను ఒప్పించి తీసుకురావడంలో ఆధవ్ కీలక పాత్ర పోషించారని చెబుతారు. అయితే, డీఎంకేలో తనకు ఆశించిన కీలక పదవి లభించకపోవడంతో ఉదయనిధి స్టాలిన్తో ఆయనకు విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన తిరుమావలవన్ నేతృత్వంలోని VCK పార్టీలో చేరారు, అక్కడ ఆయనకు ఉప ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. అనంతరం, టీవీకే గూటికి చేరారు. 2026 ఎన్నికల్లో ఆయన విల్లివాక్కం నుండి గెలుపొందారు.కేఏ సెంగోట్టయ్యన్సీనియర్ నాయకుడైన సెంగోట్టయ్యన్.. టీవీకేకి అత్యంత అపారమైన రాజకీయ అనుభవాన్ని అందించారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా (గోబిచెట్టిపాలయం నుండి) ఎన్నికైన ఆయన, ఎంజీ రామచంద్రన్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. అలాగే, జయలలితకు గట్టి మద్దతుదారుగా ఉండేవారు. నిజానికి, జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రి పదవికి ఎడప్పాడి కే పళనిస్వామి మరియు సెంగోట్టయ్యన్ ఇద్దరూ పోటీదారులుగా ఉన్నారు. శశికళ, టీటీవీ దినకరన్, పన్నీర్సెల్వంలను తిరిగి పార్టీలోకి తీసుకునే విషయంలో ఈపీఎస్తో విభేదాల కారణంగా సెంగోట్టయ్యన్ అన్నాడీఎంకేను వీడారు. పార్టీ నుండి విడిపోయిన తర్వాత, ఆయన 2025లో టీవీకేలో చేరి విజయ్కు మార్గదర్శిగా మారారు. ఈ క్రమంలోనే గోబిచెట్టిపాలయంపై అతని విజయం ఆయన శాశ్వత ప్రభావాన్ని మరోసారి బలపరిచింది. -
గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?
Goa Assembly Election 2022 Results: పంజాబ్లో ఘన విజయం సాధించి దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గోవాలో బోణి కొట్టింది. పర్యాటక రాష్ట్రం గోవాలో రెండు స్థానాలను గెల్చుకుంది. బెనాలియ్, వెలిమ్ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. బెనాలిమ్ స్థానం నుంచి కెప్టెన్ వెంజీ విగాస్ గెలుపొందారు. క్రజ్ సిల్వా.. వెలిమ్ సీటును కైవసం చేసుకున్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు. తమ పార్టీ అభ్యర్థుల విజయంతో గోవాలో నిజాయితీ రాజకీయాలకు శ్రీకారం చుట్టామని ట్వీట్ చేశారు. బెనాలిమ్ నియోజకవర్గంలో కెప్టెన్ వెంజీ విగాస్కు 6267 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్ధి అయిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చర్చిల్ అలెమావోకు 4996, కాంగ్రెస్ అభ్యర్థి ఆంటోనియో ఫెలిసియానోకు డయాస్ 4609 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దామోదర్ (సమీర్) బందోద్కర్కు కేవలం 821 ఓట్లు మాత్రమే దక్కించుకున్నాయి. వెంజీ విగాస్ స్థానం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసిన క్రజ్ సిల్వాకు 5279 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి డిసిల్వా సావియోకు 5067 ఓట్లు, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి బెంజమిన్ సిల్వా 4039 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సావియో రోడ్రిగ్స్ కు 1312 ఓట్లు వచ్చాయి. (క్లిక్: యూపీ ఫలితాలు: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్) -
ఇది చారిత్రాత్మక విజయం: మోదీ
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన 202 స్థానాలకు పైగా సీట్లు కైవసం చేసుకున్న అనంతరం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన యూపీ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు తమ ప్రభుత్వంపై ఎంతో నమ్మకం ఉంచారని, అందుకే విశేషమైన మద్దతు లభించిందన్నారు. యూపీ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకమయ్యామని ఇతర రాష్ట్రాల్లోనూ యువత బీజేపీ వైపు మొగ్గు చూపిందని చెప్పారు. ఉత్తమ పాలన, అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా సానుకూల దృక్పథంతో ఉన్నారని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయన్నారు. నమ్మకం, నిజాయితీలకే దేశం మొత్తం ఓటేసిందని, అందువల్లే బీజేపీ విజయం సాధ్యమైందని మోదీ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో బీజేపీ జయకేతనం ఎగరవేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో మరికొన్ని స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. సమాజ్ వాదీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేసినా ఆ కూటమి కేవలం 50 సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తుండగా, మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ పట్టుమని 20 సీట్లు వచ్చేలా కనిపించడం లేదు.


