-
ఐదుగురు అక్కాచెల్లెళ్లు.. అంతులేని కష్టాలు
అమ్మ అనురాగం, నాన్న మమకారం దూరమయ్యాయి. జీవనాధారం లేదు.. జీవితాలకు వెలుగూ లేదు. నా అన్న వాళ్లు లేరు. కష్టమొచ్చినా కన్నీరు రాల్చడం తప్ప..ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. బతుకు దుర్భరంగా కాలం వెళ్లదీస్తున్నారు. దయనీయ జీవితాలకు దర్పణంగా నిలుస్తున్నారు గుమ్మఘట్ట మండలం గొల్లపల్లికి చెందిన అక్కాచెల్లెళ్లు. గుమ్మఘట్ట (అనంతపురము): మండలంలోని గొల్లపల్లి ఎస్సీ కాలనీలో పీజీ హంపన్న, సాకమ్మ దంపతులు కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. వీరికి శశికళ, తిప్పక్క, రాధ, లక్ష్మి, శైలజ సంతానం. పెద్దమ్మాయి శశికళకు పదేళ్ల వయసున్నప్పుడే తల్లి సాకమ్మ క్షయ వ్యాధితో చనిపోయింది. పెద్దమ్మాయి సాయంతో మిగిలిన నలుగురు ఆడపిల్లల ఆలనాపాలనను తండ్రి చూసుకుంటూ వచ్చాడు. కూతుళ్లు మంచి ప్రయోజకులు కావాలని కష్టపడి చదివించాడు. పెద్దమ్మాయి (ఐదో తరగతి) మినహా మిగిలిన నలుగురూ చదువులో ముందుకెళ్లారు. రెండో అమ్మాయి తిప్పక్క బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) పూర్తి చేసింది. మూడో అమ్మాయి రాధ డిప్లొమా కోర్సులో చేరి డ్రాపౌట్ అయ్యింది. నాల్గో అమ్మాయి లక్ష్మి ఇంటర్ పూర్తి చేసింది. ఐదో అమ్మాయి శైలజ డిగ్రీ ఫస్టియర్ చదివి ఆపేసింది. కాగా వీరి జీవితంలో మరొకసారి కుదుపు వచ్చింది. తండ్రి తరచూ అనారోగ్యం బారిన పడుతుండటంతో ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఒక్కరైనా బాగా చదవాలని... తండ్రి అనారోగ్యం నేపథ్యంలో నలుగురు అక్కాచెల్లెళ్లు ఒక నిర్ణయానికి వచ్చారు. తిప్పక్క బీటెక్ కోర్సు పూర్తి చేసేలా, అందుకు అవసరమైన ఖర్చుల కోసం కూలి బాట పట్టారు. ఇంతలోనే ఈ ఏడాది మే నెలలో తండ్రికి తీవ్ర జ్వరం, జలుబు, చలి లాంటి లక్షణాలు కనిపించాయి. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందాడు. ఇన్నాళ్లూ అండగా నిలిచిన తండ్రి కూడా దూరం కావడంతో అమ్మాయిలకు కష్టాలు రెట్టింపయ్యాయి. చౌకదుకాణం ద్వారా వచ్చే రేషన్ సరుకులతో పాటు కూలి పనుల ద్వారా వచ్చే సంపాదనతో బతుకు నెట్టుకొస్తున్నారు. ఆర్థికసాయం చేయాలనుకునే వారు.. పేరు : పి.జి.జి.తిప్పక్క అకౌంట్ నంబర్ : 520101212861618 యూనియన్ బ్యాంకు, రాయదుర్గం బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ : యూబీఐఎన్ 0900362 ఉద్యోగం ఇప్పించండి బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసి ఇంటికే పరిమితమయ్యాను. ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తే మా కుటుంబాన్ని ఆదుకున్న వారవుతారు. అమ్మానాన్న లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మా యోగక్షేమాలు చూసుకునేవారు ఎవరూ లేరు. ఏ కష్టం వచ్చినా మాకు మేమే ధైర్యం చెప్పుకుంటూ బతుకుతున్నాం. దయార్ద్ర హృదయులు స్పందిస్తే మా బతుకులు బాగుపడతాయి. - తిప్పక్క విధిలేక కూలి పనులకు.. బ్రహ్మసముద్రం గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశా. అనంతపురంలో డిప్లొమా కోర్సులో చేరా. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేశా. సర్టిఫికెట్లు ఇవ్వమంటే డబ్బు చెల్లించలేదని కళాశాల వారు నిరాకరించారు. వాటిని అక్కడే వదిలేసి విధిలేక కూలి పనులకు వెళ్తున్నా. - రాధ, డిప్లొమా విద్యార్థిని -
అరవిందో ఆశ్రమానికి చెందిన మహిళల ఆత్మహత్య
పుదుచ్చేరి : పుదుచ్చేరి అరవిందో ఆశ్రమానికి చెందిన అయిదుగురు మహిళలు, వారి తల్లిదండ్రులు గురువారం తెల్లవారుజామున కళాపేట గ్రామ సమీపంలో సముద్రంలో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. తల్లీ, ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు. తండ్రీ, ముగ్గురు కుమార్తెల పరిస్థితి విషమంగా ఉంది. బీహార్ రాష్ట్రానికి చెందిన ఒకే కుటుంబంలోని అక్కాచెల్లెళ్లు అయిదుగురు జయశ్రీ (54), అరుణశ్రీ (50), రాజశ్రీ (45), నివేదిత (42), హేమలత (40)లు చాలా కాలం నుంచి ఈ ఆశ్రమంలో ఉంటున్నారు. వారి తల్లిదండ్రులు గదాధర్ ప్రసాద్ (80), శాంతిదేవీ (70)లు పుదుచ్చేరిలోనే వేరుగా నివసిస్తున్నారు. ఆశ్రమంలో ఉంటున్న అక్కాచెల్లెళ్లలో కొందరిపై ఐదేళ్ల క్రితం ఆశ్రమ నిర్వాహకులు లైంగికవేధింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. లైంగికవేధింపులపై పుదుచ్చేరి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దాంతో వారు కోర్టు ద్వారా ఫిర్యాదు నమోదు చేయించారు. నిబంధనలకు విరుద్దగా పోలీసులకు ఫిర్యాదు చేసినందున ఆశ్రమాన్ని విడిచివెళ్లిపోవాలని నిర్వాహకులు హుకుం జారీచేశారు. ఆ తరువాత ఆ అక్కాచెల్లెళ్లు స్థానిక కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అన్ని చోట్ల ఆశ్రమానికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. ఆ మహిళలు వారం రోజుల లోపల ఆశ్రమం విడిచి వెళ్లిపోవాలని సుప్రీం కోర్టు ఈ నెల 9న తీర్పు చెప్పింది. ఈ తీర్పును అనుసరించి బుధవారం వారిని బలవంతంగా ఆశ్రమం నుండి పంపించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో వారిలో ఒక మహిళ భవనం పైకి ఎక్కి తమను బలవంతంగా బయటకు పంపడానికి ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అయితే పోలీసులు ఆ అక్కాచెల్లెళ్లకు నచ్చజెప్పి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ పరిస్థితిని అవమానంగా భావించిన ఆ కుటుంబ సభ్యులు ఏడుగురు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో నడుచుకుంటూ సముద్రంలోకి వెళ్లిపోయారు. సమీపంలోని మత్య్సకారులు వారిని గమనించి రక్షించడానికి ప్రయత్నించారు. తండ్రి ప్రసాద్, కుమార్తెలు నివేదిత, జయశ్రీ, హేమలతలను రక్షించారు. వారిని ఒడ్డుకు తీసుకువచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. కొన్నిగంటల తరువాత తల్లి శాంతాదేవి, కుమార్తెలు అరుణశ్రీ, రాజశ్రీల మృతదేహాలు తండ్రాయన్పేట, చిన్న మొదలయార్చివాడి గ్రామాల వద్ద ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. **
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement