firecracker unit
-
కేరళంలో భారీ పేలుడు, పలువురు మృతి
కేరళంలోని త్రిస్సూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. త్రిస్సూర్ రానున్న పూరం ఉత్సవానికి ఏర్పాటు చేసిన బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందారు. నలభై మందికి పైగా గాయపడినట్లు సమాచారం. బారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తిరువంబడి డివిజన్కు చెందిన బాణసంచా ముడిసరుకులను నిల్వ ఉంచే ముండతికొట్టెలోని బాణసంచా ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ భారీ పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి వినిపించినట్లు తెలిసింది. పేలుడుకు గల కచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. మృతుల సంఖ్యను ధృవీకరిస్తూ, త్రిస్సూర్ నగర పోలీస్ కమిషనర్ నకుల్ రాజేంద్ర దేశ్ముఖ్ ఐపీఎస్, ఫ్యాక్టరీ లోపల ఇంకాఎంతమంది కార్మికులు చిక్కుకున్నారో తెలియదన్నారు. అయితే మధ్యాహ్నం ఫ్యాక్టరీకి సరఫరా చేసిన భోజన ప్యాకెట్ల ఆధారంగా, అక్కడ సుమారు 40 మంది కార్మికులు ఉన్నారని స్థానికులు అంచనా వేశారు. శుక్రవారం జరగనున్న తిరువంబడి సెక్షన్ నమూనా ప్రదర్శన కోసం ఈ యూనిట్ బాణసంచాను తయారు చేస్తున్నట్లు సమాచారం.కొనసాగుతున్నసహాయక చర్యలుఅగ్నిమాపక సిబ్బంది మంటలనార్పేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ పేలుళ్లు ఎడతెరిపి లేకుండా కొనసాగడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాద స్థలానికి దారితీసే రహదారులు ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అగ్నిమాపక, సహాయక బృందాలు సమీపంలోని గోడను పగలగొట్టి లోపలికి ప్రవేశించి మంటలను అదుపులోకి తెచ్చాయి.గాయపడిన వారిని త్రిస్సూర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరోఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారికి త్రిస్సూర్ జనరల్ ఆసుపత్రితో సహా సమీపంలోని ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారందరికీ నిపుణుల వైద్య సంరక్షణ అందేలా చూడాలని ఆరోగ్యశాఖా మంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు. 108 అత్యవసర సేవల అంబులెన్స్లతో సహా, తగినన్ని అంబులెన్స్లను సంఘటనా స్థలానికి పంపాలని, అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సమీపంలోని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆమె ఆదేశించారు. -
కోనసీమలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. క్షతగాత్రుల్ని అనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో బుధవారం ఉదయం సిబ్బంది బాణాసంచా తయారు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆరుగురు మృతుల్లో ఐదుగురిని పోలీసులు గుర్తించారు. వెలుగుబంటి సత్యసనారాయణ(55) యజమాని, పాకా అరుణ (30), చిట్టూరి శ్యామల, కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నంగా గుర్తించారు.బాణాసంచా తయారీ కేంద్రం నుంచి మంటలు ఎగసి పడుతుండగా.. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పేలుడు తీవ్రతకు బాణసంచా తయారీ కేంద్రానికి 50 మీటర్ల దూరంలో ఉన్న రిటైల్ కేంద్రం కూడా దగ్ధమైంది. పేలుడు తీవ్రతకు షెడ్డు కుప్పకూలింది. సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ,ఎస్పి రాహుల్ మీనా పరిశీలించారు. జిల్లాలో 35 బాణాసంచా తయారీ కేంద్రాలకు అనుమతులు ఇచ్చామని.. బాణాసంచి కేంద్రాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. -
కాంచీపురంలో ఘోర ప్రమాదం
చెన్నై: తమిళనాడు కాంచీపురం జిల్లాలో ఇవాళ ఘోరం జరిగింది. కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనం కాగా, మరో ఐదుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగేలా కనిపిస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో పాతిక మంది పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇదీ చదవండి: ఏకం అయ్యేందుకే ఆశ పడుతున్నా! -
తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం
చెన్నై: తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాణా సంచా తయారు చేసే పరిశ్రమలో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. టపాసులకు మంటలు అంటుకోవడంతో క్షణాల్లో భారీపేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కీజా నిలాయి కొట్టాయిలో చోటుచేసుకుంది.


