breaking news
The Family Man 3
-
పిక్నిక్ వెళ్లిన ద ఫ్యామిలీ మ్యాన్ టీమ్! (ఫోటోలు)
-
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3.. ఓటీటీలో క్రేజీ రికార్డ్..!
బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్పాయ్ కీలక పాత్రలో వచ్చిన సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్. ఇప్పటికే వచ్చిన రెండు సీజన్స్ సూపర్ హిట్గా నిలిచాయి. దీంతో తాజాగా మూడో సీజన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3 అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ సిరీస్ క్రేజీ రికార్డ్ను సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధికమంది వీక్షించిన వెబ్సిరీస్గా నిలిచింది. ఈ క్రమంలో గత రెండు సీజన్ల వ్యూస్ను అధిగమించింది. అంతే కాకుండా భారత్ సహా 35 దేశాల్లో టాప్-5లో ట్రెండింగ్లో ఉంది. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్, మలేషియా దేశాల్లోనూ ఆదరణ దక్కించుకుంది.రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 21 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్లో జైదీప్ అహ్లావత్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. -
అమెజాన్ ఓటీటీపై ఘోరంగా ట్రోలింగ్.. ఏంటి విషయం?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 'పైరసీ' అనే భూతంపై పెద్ద చర్చే నడుస్తోంది. ఎప్పటినుంచో దీని గురించి అందరికీ తెలుసు. కానీ 'ఐ బొమ్మ' సైట్ నిర్వహకుడు రవి అరెస్ట్ కావడంతో మరోసారి చర్చకు కారణమైంది. సామాన్యులు చాలామంది రవికే తమ సపోర్ట్ అని అంటున్నారు. దానికి కారణాలు బోలెడు. నిర్మాతలు ఇష్టమొచ్చినట్లు టికెట్ రేట్లు పెంచేస్తున్నారని, దానికి తోడు థియేటర్లలోనూ పార్కింగ్, తినుబండరాల ధరలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. వీటికి తోడు ఇప్పుడు మరో సమస్య కూడా చేరినట్లు కనిపిస్తుంది.గత శుక్రవారం 'ద ఫ్యామిలీ మ్యాన్' అనే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్, అమెజాన్ ప్రైమ్లో రిలీజైంది. తొలి రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి ఓకే ఓకే అనిపించుకుంది. అయితే 50 నిమిషాలుండే ప్రతి ఎపిసోడ్లోనూ నాలుగైదు యాడ్స్ వస్తున్నాయని, దీంతో సిరీస్ చూడాలంటే చిరాకు వస్తుందని చాలామంది యూజర్స్.. సోషల్ మీడియాలో తన అసహనం బయటపెడుతున్నారు. యాడ్స్ భరిస్తూ కొందరు చూస్తున్నప్పటికీ.. మరికొందరు మాత్రం నిర్ధాక్షిణ్యంగా ఈ కారణం వల్లే పైరసీ సైట్లో సిరీస్ చూశానని, అందులో ఒక్క యాడ్ కూడా రాలేదని పోస్టులు పెడుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)కొన్నేళ్ల క్రితం జనాలు యూట్యూబ్లో వీడియోలు, సినిమాలు చూసేవారు. విపరీతమైన యాడ్స్ రావడంతో.. వాళ్లలో చాలామంది ఓటీటీలకు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అమెజాన్, హాట్స్టార్ లాంటి ఓటీటీల్లోనూ యాడ్స్ వస్తున్నాయి. దీంతో డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాసరే ఈ యాడ్స్ గోలేంట్రా బాబు అని చిరాకు పడుతున్నారు. మరీ 40-50 నిమిషాల ఎపిసోడ్కి 4-5 యాడ్స్ రావడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇది ఇలానే జరిగితే ఓటీటీల్లోనూ జనాలు సినిమాలు చూడటం తగ్గించేయడం గ్యారంటీ. అప్పుడు కూడా నష్టపోయేది నిర్మాతలే.ఓటీటీలు వచ్చిన తర్వాత కొంతమేర పైరసీ తగ్గిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు డబ్బుల కోసం వాళ్లు కూడా యాడ్స్ వేస్తున్నారు. ఇలాంటి అత్యాశ.. మరిన్ని పైరసీ సైట్ల పెంచి పోషించేందుకు కారణమయ్యే అవకాశాలే ఎక్కువ. అమెజాన్ ప్రైమ్ వీడియోనే తీసుకుంటే.. కొన్ని సినిమాల్ని నేరుగా రిలీజ్ చేస్తారు. కొన్నింటిని మాత్రం రెంటల్ బేసిస్(అద్దె విధానం) అని చెప్పి మళ్లీ కొంత డబ్బు చెల్లిస్తేనే చూడటం కుదురుతుందని అంటారు. చాలా ఛానెల్స్ చూపిస్తారు. మళ్లీ వాటిల్లో సినిమాలు చూడాలి అంటే సెపరేట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటారు. ఇవన్నీ గత కొన్నిరోజుల నుంచి ఉన్నప్పటికీ.. తాజాగా 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ వల్ల మరోసారి వెలుగులోకి వచ్చాయి. (ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ) -
ఫ్యామిలీ మ్యాన్-3.. ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
ఓటీటీ వెబ్ సిరీస్లతో ‘ఫ్యామిలీ మ్యాన్’ క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకద్వయం రాజ్-డీకే తీసిన ఈ సిరీస్ తొలి భాగం 2019లో రిలీజై..బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇండియన్ వెబ్ సిరీస్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన సిరీస్గా రికార్డుకెక్కింది. 2021లో రెండో సీజన్ రాగా..అది కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మూడో సీజన్(The Family Man 3 ) కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (చదవండి: ‘ద ఫ్యామిలీ మ్యాన్ 3’ రివ్యూ)ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్లో పాకిస్థాన్-మయన్మార్తో కలిసి భారత్పై చైనా చేస్తున్న కుట్రలు, భారత్ -మయన్మార్ సరిహద్దుల్లోని ఉద్రిక్త పరిస్థితులను చూపించారు. సీజన్ 3 ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ రిలీజ్ తర్వాత మనోజ్ బాజ్పేయి తో పాటు ప్రధాన పాత్రల్లో నటించిన వారి పారితోషికంపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఎవరెంత పుచ్చుకున్నరనేదానిపై రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సీజన్ 3కి గాను శ్రీకాంత్ తివారి పాత్ర పోషించిన మనోజ్ బాజ్పేయి రూ. 20-22కోట్ల మేరకు పారితోషికం పుచ్చుకున్నారట. ఇక ఈ సిరీస్లో విలన్ పాత్ర చేసిన జైదీప్ అహ్లావత్ రూ.9 కోట్లు తీసుకున్నాడట. మనోజ్ బాజ్పేయికి జోడీగా నటించిన ప్రియమణి ఈ సీజన్కి రూ. 7 కోట్ల వరకు అదించినట్లు సమాచారం.మీరా పాత్ర పోషించిన నిమ్రత్ కౌర్ కూడా రూ. 8-9 కోట్ల వరకు తీసుకున్నారట. నిడివి తక్కువే అయినప్పటికీ దర్శన్ కుమార్ కూడా దాదాపు 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. కీలక పాత్రలో నటించిన సీనియర్ నటి సీమా బిస్వాస్, విపిన్ శర్మ రూ. 1-2 కోట్ల వరకు పారితోషికంగా పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం రెమ్యునరేషన్లకు దాదాపు రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.


