breaking news
easy method
-
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
బంగారం ఆభరణాలంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు మక్కువ చూపుతారు. హుందాకు చిహ్నంగా భావిస్తారు. అందుకే పెళ్లిళ్లు, శుభకార్యాలయాల్లో బంగార ఆభరణాలదే అగ్రస్థానం. ధర ఎంత పెరిగినా.. పసిడిని కొనుగోలు చేయడం మానరు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం సంప్రదాయ అవసరాలు తీర్చడమే కాకుండా పెట్టుబడులకు కూడా ఉపయోగపడుతోంది. అందుకే చాలా మంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బంగారం కొనుగోలు (Gold Purchase) చేస్తున్నారు. కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అసలు బంగారం, దాని నాణ్యతను సులువుగా గుర్తించి మోసాలకు చెక్ పెట్టొచ్చు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.95 వేలకుపైగా చేరింది. ఈ క్రమంలో కొనుగోలు సమయంలో వినియోగదారులు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.బంగారంలోనే రంగులుబంగారు ఆభరణం తయారీలో నికిల్, మాంగనీస్ లేదా పల్లాడియం (Palladium) వంటి లోహాలు కలుపుతారు. అప్పుడు అది బంగారం వర్ణంలోనే కొంచెం తెల్లని ఛాయలో ఉంటుంది. రాగి ఎక్కువ కలిపితే ఎరుపు, గులాబీ ఛాయలో కనిపిస్తుంది. రోజ్గోల్డ్ అయితే అందులో 25 శాతం రాగి కలిపినట్లు అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఆ బంగారంతో 18 క్యారెట్లు మాత్రమే ఉంటుంది. వెండి, మాంగనీస్, రాగిని ఉపయోగిస్తే బూడిద రంగు ఛాయలో ఉంటుంది. కేవలం వెండిని మాత్రమే కలిపితే గ్రీనిస్ షేడ్లో కనిపిస్తుంది.స్వచ్ఛత గుర్తింపు ఇలా..ఆభరణం అంచులు రంగు పోయి బంగారపు వర్ణం కాకుండా ఇతర వర్ణం కనిపిస్తుంటే అది కచ్చితంగా పూత పోసిన ఆభరణమని గ్రహించాలి. నోటి పళ్ల మధ్య పెట్టి బలంతో ఆభరణాన్ని నొక్కి చూడండి. స్వచ్ఛ బంగారమా.. పూత పోసిందా అని తెలుసుకోవచ్చు. పంటి గాట్లను గమనించి బంగారం నాణ్యతను సులభంగా తెలుసుకోవచ్చు. బంగారంలో ఇనుము కలిసి ఉంటే ఆయస్కాంతంతో గుర్తించొచ్చు. షైనింగ్ లేని సిరామిక్ ప్లేట్ మీద బంగారు ఆభరణాన్ని రుద్దితే నల్లని చారలు పడితే ఆది స్వచ్ఛమైనది కాదు. బంగారు గీతలు పడితే స్వచ్ఛమైనది అని అర్థం. ఆభరణం కొనుగోలుకు ముందే షాపు వద్ద నైట్రిక్ యాసిడ్తో టెస్ట్ చేయమని కోరవచ్చు. ఆభరణంపై చుక్క నైట్రిక్ యాసిడ్ వేసిన వెంటనే రసాయనిక చర్య ప్రారంభమై ఆకుపచ్చ రంగులో కనిపిస్తే బేస్ మెటల్ లేదా బంగారు పూత (Gold Coating) వేసిందిగా గ్రహించాలి. బంగారం వర్ణంలోనే రియాక్షన్ కనిపిస్తే బంగారం పూత వేసి ఇత్తడిగా గమనించాలి. పాల రంగులో కనిపిస్తే వెండి ఆభరణంగా ఎలాంటి రియాక్షన్ లేకపోతే దానిని స్వచ్ఛమైన ఆభరణంగా గుర్తించాలి.కేడీఎం అంటే..జ్యూవెల్లరీ దుకాణంలో బంగారం కొనే సమయంలో ఆ ఆభరణం కేడీఎం అని షాపు యజమానులు చెబుతారు. అసలు కేడీఎం (KDM Gold) అంటే బంగారు ఆభరణాలు తయారీలో కాడ్మియంతో సోల్డరింగ్ చేస్తారు. ఇవి 91.6 స్వచ్ఛతతో ఉంటాయి.ఇవి గమనించాలి..24 క్యారెట్ల బంగారంలో 99.9, 22 క్యారెట్ బంగారంలో 91.6 శాతం స్వచ్ఛత ఉంటుంది. స్వచ్ఛ బంగారం మొత్తగా ఉంటుంది. బంగారంలో కలిపిన ఇతర లోహాల శాతాన్ని బట్టి ఆభరణాల రంగు, గట్టిదనం, మన్నిక ఆధారపడి ఉంటాయి. నాణ్యత తెలిపే కొలమానం వేయించుకుని రశీదులు తీసుకోవాలి. భవిష్యత్లో తేడా వస్తే కేసు వేయడానికి అవకాశం ఉంటుంది.క్యారెట్ల బట్టి స్వచ్ఛత..24 క్యారెట్లు: 99.9 శాతం స్వచ్ఛత ఇది. బిస్కెట్ రూపంలో ఉంటుంది.22 క్యారెట్లు: 91.6 శాతం బంగారం, మిగతా 8.4 శాతం ఇతర లోహాలు కలుస్తాయి.18 క్యారెట్లు: 75 శాతం బంగారం, మిగతా 25శాతం ఇతర లోహాలు14 క్యారెట్లు: 58.5 శాతం బంగారం, మిగతా భాగం ఇతర లోహలు12 క్యారెట్లు: 50 శాతం మాత్రమే బంగారం, మిగతా 50 శాతం ఇతర లోహాలు మిశ్రమంతో తయారీ అవుతుంది.10 క్యారెట్లు: 41.7 శాతం బంగారం మాత్రమే ఉంటుంది.24 క్యారెట్లు అంటే..బంగారం స్వచ్ఛతను క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 99.9 శాతం స్వచ్ఛత ఉన్న బంగారాన్ని 24 క్యారెట్ల బంగారం అంటారు. దీనితో ఆభరణాలు చేయరు. ఇది బిస్కెట్ రూపంలోనే ఉంటుంది. ఆభరణాలు గట్టిగా , మన్నికగా ఉండేందుకు గాను స్వచ్ఛమైన బంగారానికి రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి ఇతర లోహాలు కలుపుతారు. ఇలా చేయడం ద్వారా బంగారం స్వచ్ఛత 22.18.14 క్యారెట్లుగా నిర్ధారిస్తారు.చదవండి: బంగారం ఇప్పుడు కొంటే సాహసమే!హాల్మార్క్ సర్టిఫికెట్తో పసిడి నాణ్యత..బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్మార్క్ సర్టిఫికేషన్ విధానం ప్రవేశ పెట్టింది. తయారైన ఆభరణం చిన్నదైనా, పెద్దదైనా హాల్మార్క్ ముద్ర, నాణ్యత శాతాన్ని సూచించే నంబర్తో పాటు ఆ వస్తువు సర్టిఫై చేసిన హాల్మార్క్ (Hallmark) సెంటర్ వివరాలు తెలిపే హెచ్యూఐడీ హాల్మార్క్ యూనిక్ ఐడీ నంబర్ విధిగా ఉండాలి. ఈ అన్ని వివరాలను కొనుగోలు రశీదులో పొందుపర్చి వినియోగదారుడికి అందించాల్సి ఉంటుంది. కానీ వ్యాపారులు ఇవేవి చేయకపోగా అన్ని ఆభరణాలు 91.6 అని విక్రయిస్తున్నారు. దీనికి రశీదులు ఇవ్వకుండా.. ఇచ్చినా అందులో వివరాలు తెలుపడం లేదు. దీనిపై వినియోగదారులు చైతన్యవంతులై నిలదీయాలి. -
చెరకు సాగు ఇక సులువు!
కణుపులు కత్తిరించి, నాటేసే పరికరాలు అందుబాటులోకి.. వ్యవసాయంతో నేరుగా తమకు సంబంధం లేకపోయినా.. సరైన పరికరాలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న రైతులతో సహానుభూతి చెంది పరికరాలు తయారు చేస్తున్న సృజనశీలురు అరుదు. అటువంటి వారిలో మధ్యప్రదేశ్ నర్సింగ్పూర్కు చెందిన రోషన్లాల్ విశ్వకర్మ(47) ఒకరు. చెరకు కణుపులు నరకడానికి ఉపయోగపడే పరికరాన్ని, ట్రాక్టర్ సహాయంతో కణుపులను నాటే పరికరాన్ని ఆయన రూపొందించారు. ఉన్నత పాఠశాలలో ఉద్యోగి అయిన రోషన్లాల్ తన వర్క్షాప్లో వ్యవసాయ పరికరాలకు మరమ్మతు చేస్తూ, పరిశోధన చేస్తుంటాడు. ఇంజనీర్ ఒకరు.. చేతనైతే చెరకు కణుపులను ఒడుపుగా కత్తిరించే పరికరం తయారుచెయ్యి చూద్దాం అని సవాలు విసిరాడు. పట్టుదలతో కృషి చేసిన రోషన్లాల్ చెరకు రైతుల సమయాన్ని, డబ్బును, విత్తనాన్ని ఆదా చేసేందుకు ఉపయోగపడే సుగర్కేన్ బడ్ చిప్పర్ను రూపొం దించాడు. ఈ పరికరంలో చెరకు గడను ఉంచి హ్యాండిల్తో ఒత్తగానే.. అది చెరకు కణుపులను చెదిరిపోకుండా సున్నితంగా కత్తిరిస్తుంది. తక్కువ సమయంలో విత్తనాన్ని సిద్ధం చేసుకొని నాటుకునేందుకు రైతుకు తోడ్పడుతుంది. చెరకు విత్తనం 70-80 శాతం వరకు ఆదా అవుతుంది. దీనితోపాటు.. ట్రాక్టర్కు అమర్చి చెరకు విత్తనం నాటుకునే పరికరాన్ని కూడా రోషన్లాల్ ఇటీవల తయారు చేశాడు. ఎకరంలో చెరకు కణుపులను నాటేందుకయ్యే ఖర్చు రూ.6 వేల నుంచి రూ.800కు తగ్గించుకోవడానికి ఈ పరికరం ఉపకరిస్తుంది. వరుసల మధ్య దూరాన్ని మార్చుకోవడానికి వెసులుబాటు ఉండడం విశేషం. సృజనాత్మక పరికరాల రూపకర్తలను ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్.ఐ.ఎఫ్.) రోషన్లాల్ కృషిని గుర్తించింది. పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేయడంతోపాటు.. మైక్రో వెంచర్ ఇన్నోవేషన్ ఫండ్ కింద సహాయం అందించింది. ‘పల్లెసృజన’ స్వచ్ఛంద సంస్ధ ఈ పరికరాలను మన రైతులకు అందుబాటులో ఉంచింది. సంప్రదించాల్సిన చిరునామా: పల్లెసృజన, 67, వాయుపురి, సైనిక్పురి పోస్ట్, సికింద్రాబాద్- 500094 ఫోన్: 040-27111959. పోగుల గణేశం: 98660 01678