breaking news
Dorjee Khandu
-
దేశాన్ని షాక్కు గురి చేసిన విషాదాలు
ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం యావత్ దేశాన్ని షాక్కు గురి చేసింది. అయితే ఈ ఘటన మరోసారి రాజకీయ నేతల హెలికాఫ్టర్.. విమాన ప్రయాణాల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. గతంలో కూడా పలువురు ప్రముఖ నేతలు ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి దేశాన్ని విషాదంలో ముంచారు. ఆ ఘటనలను ఓసారి గుర్తు చేసుకుంటే.. 2001లో.. కాంగ్రెస్ సీనియర్ నేత మాధవరావ్ సింధియా విమాన ప్రమాదంలో మరణించారు. గ్వాలియర్ రాజవంశానికి చెందిన మాధవరావ్.. 9సార్లు లోక్సభకు ఎంపీగా పని చేశారు. రైల్వే, పర్యాటకం, మానవ వనరుల అభివృద్ధి, సివిల్ ఏవియేషన్ వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. సెప్టెంబర్ 30వ తేదీన ఢిల్లీ నుంచి పాట్నాకు ఆయన ప్రయాణిస్తున్న విమానం ఘజియాబాద్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మాధవరావ్తో పాటు పలువురు అనుచరులు మరణించారు.జీఎంసీ బాలయోగి.. దేశ తొలి దళిత లోక్సభ స్పీకర్. 2002లో స్పీకర్గా ఉన్న టైంలో ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. మార్చి 3వ తేదీన ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పరిసరాల్లో కూలిపోయింది. ఈ ఘటనలో బాలయోగితో పాటు ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన దేశాన్ని షాక్కు గురి చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండోసారి సీఎంగా ఉన్న సమయంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బేగంపేట నుంచి బయల్దేరిన గంట సేపటికి నల్లమల అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో వైఎస్సార్ సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖాండు కూడా హెలికాఫ్టర్ ప్రమాదంలోనే మరణించారు. 2011 ఏప్రిల్ 30వ తేదీన ఆయన ప్రయానిస్తున్న హెలికాఫ్టర్ తవాంగ్ జిల్లా అటవీ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో దోర్జీ ఖాండుతో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 2025 జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ మరణించారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే కుప్పకూలి పేలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 260 మంది మరణించిన సంగతి తెలిసిందే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో.. బల్వంత్రాయ్ మెహతా విమాన ప్రమాదంలో మరణించారు. 1965లో ఆయన ప్రయాణిస్తున్న విమానంపై పాకిస్థాన్ ఎయిర్క్రాఫ్ట్ కచ్ వద్ద దాడి జరిపింది. దేశంలో ఇప్పటిదాకా.. యుద్ధంలో మరణించిన ఒకే ఒక్క సీఎంగా బల్వంత్రాయ్ మెహతా నిలిచారు. అణు శాస్త్రవేత్త హోమి జహంగీర్ బాబా.. 1965లో ఆల్ప్స్ పర్వతాల్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించారు. కేంద్ర మాజీ మంత్రి మోహన్ కుమారమంగళం 1973లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదంలో మరణించారు. నటుడు ఇందర్ థాకూర్ 1985లో కనిష్క విమాన ప్రమాదంలో మరణించారు. హిమాచల్ ప్రదేశ్లో 1994లో జరిగిన ప్రమాదంలో పంజాబ్ మాజీ గవర్నర్ సురేంద్ర నాథ్ మరణించారు 1997లో కేంద్ర రక్షణ మంత్రి(సహాయ) ఎన్వీఎన్ సోము అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారుఅరుణాచల్ ప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి దేరా నాతుంగ్ 2001లో తవాంగ్ వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారుమేఘాలయా ఎమ్మెల్యే సైప్రియన్ సంగ్మా 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారుచైల్డ్ ఆర్టిస్ట్ తరుణీ సచ్ దేవ్.. నేపాల్లో 2012లో జరిగిన ప్రమాదంలో మరణించారుపైన చెప్పుకునే జాబితానే కాదు.. ప్రముఖ వ్యాపారవేత్త, హర్యానా మంత్రి ఓం ప్రకాశ్ జిందాల్ కూడా యూపీ షాహరన్పూర్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో మరో మంత్రి సురేందర్ సింగ్ కూడా దుర్మరణం పాలయ్యారు. ఇండియన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా డిసెంబర్ 08, 2021లో జరిగిన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో ఆయన సతీమణి మధులిక, మరో 12 మంది మరణించారు. 2004, ఏప్రిల్ 17న సినీ నటి సౌందర్య తన సోదరి అమర్నాథ్ తరఫున ఎన్నికల ప్రచారం కోసం వెళ్తూ హెలికాఫ్టర్ ప్రమాదంలోనే మరణించారు. ఇందిరా గాంధీ తనయుడు సంజయ్ గాంధీ (1980) ఢిల్లీలో ఈ తరహా ప్రమాదంలోనే కన్నుమూయగా.. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్లు కూడా విమాన ప్రమాదాల్లోనే మరణించారన్న ప్రచారం ఉన్నది తెలిసిందే. -
అరుణాచల్ప్రదేశ్ సీఎంగా పెమాఖండూ ప్రమాణం
ఇటానగర్ : అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమాఖండూ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బీడీ మిశ్రా ఆయనతో ప్రమాణస్వీకారం చేపించారు. 60 మంది సభ్యులున్న అరుణాచల్ప్రదేశ్ శాసనసభలో బీజేపీ 41 స్థానాలు గెలుపొందింది. దీంతో భారతీయ జనతాపార్టీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇటానగర్లోని దోర్జీ ఖండూ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి అసోం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మేఘాలయ సీఎంలు హాజరయ్యారు. -
దేశంలోనే యంగెస్ట్ సీఎం ఆయనే!
ఒకప్పుడు తండ్రికి రాజకీయాల్లో అండగా నిలిచాడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేదోడు-వాదోడుగా ఉండి సహకరించాడు. అలా నెమ్మదిగా అడుగులు వేస్తూ.. సామాజిక మార్పే సంకల్పంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు పెమా ఖండూ.. దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. అరుణాచల్ ప్రదేశ్ 9వ సీఎంగా పెమా ఖండూ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. పెమాకు మద్దతుగా 45 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ తథాగత్ రాయ్ ముందు పరేడ్ నిర్వహించడంతో ఇక అసెంబ్లీలో బలనిరూపణ అవసరం లేదని గవర్నర్ స్పష్టం చేశారు. అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ పెమా ఖండూకు రాష్ట్రంలో అత్యున్నతమైన సీఎం పదవి లభించింది. సొంత పార్టీ కాంగ్రెస్ లో రెబల్స్ కారణంగా నబం తుకీ సీఎల్పీ పదవికి రాజీనామా చేశారు. దాంతో సీఎం పదవి నుంచి కూడా వైదొలిగారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చీలికకు కారణమైన రెబల్ నేత, మాజీ సీఎం కలిఖో పాల్ కూడా పెమాకు మద్దతు పలుకడంతో ఆయన సీఎం పదవి చేపట్టేందుకు మార్గం సుగమమైంది.37 ఏళ్ల పెమా ఖండూతో సీఎంగా, చౌనా మెయిన్ తో డిప్యూటీ సీఎంగా గవర్నర్ ప్రమాణం చేయించారు. యువ సంచలనం! 37 ఏళ్లకే సీఎం పదవి చేపట్టి, దేశంలో అతి పిన్న ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన పెమా ఖండూ యువ సంచలనం అని చెప్పవచ్చు. పెమా ఖండూ తండ్రి డోర్జీ ఖండూ ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పనిచేశారు. సీఎం పదవిలో ఉండగానే 2011లో జరిగిన విమాన ప్రమాదంలో డోర్జీ ఖండూ ప్రాణాలు విడిచారు. తండ్రి మరణం నేపథ్యంలో ఆయన పెద్ద కొడుకు అయిన పెమా ఖండూ డోర్జీ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. ప్రతిష్టాత్మక ఢిల్లీ హిందూ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆయన తండ్రి మరణానంతరం అరుణాచల్ ప్రదేశ్ కేబినెట్ లో జలవనరుల శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా నబం తుకీకి వ్యతిరేకంగా అరుణాల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో తిరుగుబాటు తలెత్తడం.. దీంతో తుకీ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేయడం.. రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్లీ అరుణాల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ యువనేతకు దేశంలో అతిపిన్న సీఎంగా గొప్ప గౌరవం లభించింది.


