breaking news
Discovery Sport
-
జేఎల్ఆర్ ‘డిస్కవరీ స్పోర్ట్’లో పెట్రోల్ వేరియంట్
ప్రారంభ ధర రూ.56.50 లక్షలు న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ అనుబంధ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్).. పెట్రోల్ వేరియంట్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తాజాగా తన ప్రముఖ ఎస్యూవీ ‘లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్’లో 2.0 లీటర్ పెట్రోల్ వేరియంట్ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ.56.50 లక్షలు (ఎక్స్షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఇది కేవలం హెచ్ఎస్ఈ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉండనున్నది. కంపెనీ గతేడాదే డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో డిస్కవరీ స్పోర్ట్ మోడల్ను భారత్లోకి తీసుకువచ్చింది. డీజిల్ వేరియంట్లో ఏవైతే ఫీచర్లు ఉన్నాయో.. కొత్త వేరియంట్లోనూ అవే ప్రత్యేకతలు ఉన్నాయి. ఎలాంటి మార్పులు లేవు. -
సప్టెంబర్లో ల్యాండ్ రోవర్ కొత్త ‘డిస్కవరీ స్పోర్ట్’
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ల్యాండ్ రోవర్ కొత్త ప్రీమియం ఎస్యూవీ వెహికల్ ‘డిస్కవరీ స్పోర్ట్’ను సెప్టెంబర్ 2న మార్కెట్లోకి తీసుకువస్తోంది. రిటైలర్లు వీటి బుకింగ్స్ ప్రారంభించారు. ల్యాండ్ రోవర్ ఉత్పత్తుల విస్తరణలో ‘డిస్కవరీ స్పోర్ట్’ ఒక మైలురాయిగా నిలుస్తుందని ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ రోహిత్ సూరి ధీమా వ్యక్తం చేశారు. భారత్లో ల్యాండ్ రోవర్ వాహనాలు 22 ఔట్లెట్స్లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.