ఓటీటీలో టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో సరికొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. టాలీవుడ్లో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ధూల్పేట్ పోలీస్ స్టేషన్. ఈ వెబ్ సిరీస్కు జస్విని దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ధూల్పేట్ పోలీస్ స్టేషన్ సిరీస్ వచ్చేనెల 5 నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలిపారు. తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులో ఉండనుంది. కాగా.. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో అశ్విన్, శ్రీతు, గురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ చూస్తే ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే హత్యల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. The investigation begins this December 🚨🚔#DhoolpetPoliceStation Premieres 5th Dec only on #ahaEvery Friday - New Episodes#DhoolpetOnaha pic.twitter.com/EUadfirmZm— ahavideoin (@ahavideoIN) November 20, 2025